Rohit Sharma: ‘ఈ ప్రశ్నే తప్పు..’: రిపోర్టర్పై రోహిత్ శర్మ అసహనం
Rohit Sharma: మైదానంలోకి అభిమానులు పరిగెత్తుకురావడంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తంచేశాడు. ఇది సరైన ప్రశ్న కాదన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో భారత్ తొలి పోరుకు సిద్ధమవుతోంది. బుధవారం రాత్రి ఐర్లాండ్తో టీమ్ఇండియా (Team India) తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మీడియాతో మాట్లాడాడు. ఈసందర్భంగా వార్మప్ మ్యాచ్ సమయంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై రిపోర్టర్ అడగ్గా.. హిట్మ్యాన్ ఒకింత అసహనానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..?
మెగా టోర్నీ (T20 World Cup 2024)కి ముందు బంగ్లాదేశ్తో టీమ్ఇండియా ఏకైక వార్మప్ మ్యాచ్ (WarmUp Match) ఆడింది. ఆ సమయంలో ఓ అభిమాని ఉన్నట్టుండి మైదానంలోకి దూసుకొచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని పట్టుకున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న రోహిత్ శర్మ.. కాస్త సున్నితంగా వ్యవహరించండి అంటూ భద్రతా సిబ్బందిని వారించినట్లుగా కన్పించింది.
ఆ ఇద్దరు.. ఆ కల నెలవేర్చుకుంటారా!
మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ ఆ సంఘటన (Security Breach)ను ప్రస్తావిస్తూ.. ‘‘అభిమాని దూసుకురావడం.. సెక్యూరిటీ అతడిని పట్టుకున్న విధానం.. వదిలేయండని మీరు చెప్పడం.. ఆ సమయంలో మీరు ఎలాంటి ఎమోషన్కు లోనయ్యారు?’ అని అడిగాడు. దీనికి రోహిత్ అసంతృప్తి వ్యక్తంచేస్తూ.. ‘ఆ సంఘటన.. మీ ప్రశ్న రెండూ తప్పే’ అని అన్నాడు.
‘‘గేమ్ మధ్యలో మైదానంలోకి ఎవరూ చొచ్చుకురావొద్దు. అది తప్పు. ఇక ఈ ప్రశ్న కూడా సరికాదు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలను మేం ప్రోత్సహించబోం. ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యమైన అంశం. అదే సమయంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారి భద్రత కూడా అంతే ముఖ్యం. క్రికెట్ స్టేడియంలో నియమ, నిబంధనల గురించి అభిమానులు అర్థం చేసుకోవాలి. అప్పుడే మ్యాచ్ను మీరు ఆస్వాదించగలుగుతారు. ఇలా గ్రౌండ్లోకి పరిగెత్తుకురావాల్సిన అవసరం లేదు’’ అని రోహిత్ (Rohit Sharma) బదులిచ్చాడు. ఇలాంటి ఘటనలతో మైదానంలో ఆటగాళ్ల దృష్టి మరల్చలేరని, తమ ఆలోచనలంతా లక్ష్యంపైనే ఉంటుందని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?