Team India: ఇదేం ఇంజూరీ మేనేజ్మెంట్? టీమ్ఇండియాను వదలని గాయాల బెడద
ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐ. అత్యుత్తమ ఫిట్నెస్ ప్రమాణాలు నెలకొల్పడానికి అవసరమైన వనరులన్నీ అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐ. అత్యుత్తమ ఫిట్నెస్ ప్రమాణాలు నెలకొల్పడానికి అవసరమైన వనరులన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ, టీమ్ ఇండియాను గాయాల బెడద ఎంతకీ వదలడం లేదు. కోచ్ల వైఫల్యమా.. ఆటగాళ్ల తప్పిదమా తెలియట్లేదు కానీ.. ఒకరి వెంట ఒకరు కీలక ఆటగాళ్లు గాయపడుతూనే ఉన్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా.. ఫిట్నెస్ కోసం వ్యక్తిగతంగా ఎంతో శ్రమించే విరాట్ కోహ్లి ఒక్కడు మినహాయింపు. జట్టులోని మిగతా ఆటగాళ్లందరినీ ఏదో ఒక దశలో ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. ఏమిటీ జాబితా అనుకుంటున్నారా? గత ఏడాదిన్నర వ్యవధిలో గాయాలతో ఇబ్బంది పడ్డ టీమ్ఇండియా ఆటగాళ్లు. చిన్న స్థాయి ఆటగాళ్లను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ జాబితా ఇంకా పెరుగుతుంది. క్రికెటర్లన్నాక గాయాలు సహజమే. ఒక ఆటగాడు మళ్లీ మళ్లీ గాయపడటం.. పూర్తి ఫిట్నెస్ సాధించాడు అనుకునేలోపే మళ్లీ గాయాలు తిరగబెట్టడం.. ఎప్పుడు ఏ ఆటగాడు మ్యాచ్కు దూరమవుతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుండటం ఆందోళన కలిగించే విషయం. గతేడాది దీర్ఘకాలం గాయాలతో సహవాసం చేసి వన్డే ప్రపంచకప్ ముంగిట ఫిట్నెస్ సాధించిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. నాలుగు నెలలు తిరక్కముందే మళ్లీ గాయాల బారిన పడ్డారు.
ఇంగ్లాండ్తో తొలి టెస్టు అవ్వగానే రాహుల్, జడేజా జట్టుకు దూరమయ్యారు. రెండో టెస్టు తర్వాత శ్రేయస్ అందుబాటులో లేకుండా పోయాడు. రాహుల్, శ్రేయస్లకు పాత గాయాలే తిరగబెట్టినట్లు తెలుస్తోంది. మూడో టెస్టుకైనా రాహుల్ అందుబాటులోకి వస్తాడనుకుంటే కష్టమే అని తేలిపోయింది. జడేజాకు జట్టులో చోటు దక్కినప్పటికీ అతను పూర్తిగా కోలుకున్నాడనేమీ చెప్పట్లేదు. తుది జట్టులో ఆడించడం ఫిట్నెస్ క్లియరెన్స్ మీదే ఆధారపడి ఉంది. అతను రెండేళ్ల కిందట కూడా తీవ్ర గాయంతో నెలల తరబడి ఆటకు దూరంగా ఉన్నాడు. ఇంతలో గాయం తిరగబెట్టింది. మరోవైపు బుమ్రా ఏడాది పైగా గాయంతో ఇబ్బంది పడ్డాడు. మధ్యలో ఒకసారి పునరాగమనం చేసినట్లే చేసి వెనక్కి వెళ్లిపోయాడు. వన్డే ప్రపంచకప్ నుంచి అతను జట్టులో కొనసాగుతున్నాడు కానీ.. మన జట్టు ఇంజూరీ మేనేజ్మెంట్ టీం పనితనం చూస్తుంటే అతడికి ఎప్పుడు గాయం తిరగబెడుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. జడేజా, రాహుల్ కలిపి మూడేళ్ల వ్యవధిలో 12 సార్లు గాయపడ్డారని ఇటీవల ఒక వార్త హల్చల్ చేసింది. ఇది మన ఇంజూరీ మేనేజ్మెంట్ ఎంత పేలవంగా ఉందో చెప్పడానికి ఉదాహరణ.
ఎన్సీఏలో ఏం జరుగుతోంది?
భారత ఆటగాళ్లలో గాయపడ్డ ప్రతి ఒక్కరి గమ్యం బెంగళూరులోని జాతీయ అకాడమీ (ఎన్సీఏ)నే. అక్కడ బీసీసీఐ నేతృత్వంలోని ఫిట్నెస్ టీం ఉంది. కోట్లల్లో వార్షిక జీతాలిచ్చి ఇంజూరీ మేనేజ్మెంట్ టీంను నడిపిస్తోంది బీసీసీఐ. అయితే కొన్ని నెలల పాటు అక్కడ ఉండి చికిత్స చేయించుకుని సాధన చేశాక కూడా ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్ సాధించట్లేదు. ముందు అక్కడ క్లియరెన్స్ ఇస్తారు. తీరా మైదానంలోకి వచ్చాక ఆటగాళ్లకు గాయాలు తిరగబెడతాయి. బుమ్రా విషయంలో బీసీసీఐ మెడికల్ టీం ఎలా నవ్వుల పాలైందో తెలిసిందే. అతను పూర్తి ఫిట్నెస్ అని ప్రకటించాక రెండు మూడు మ్యాచ్లు ఆడేసరికే గాయం తిరగబెట్టి తిరిగి ఎన్సీఏకు చేరాడు. రాహుల్, శ్రేయస్ అతడితో పోలిస్తే కొంత ఎక్కువ కాలం జట్టుతో కొనసాగారు.
ఇప్పుడు పాత గాయాలు తిరగబెట్టి చలో ఎన్సీఏ అన్నారు. జడేజాది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి. కోహ్లిలా వ్యక్తిగతంగా ఉత్తమ ఫిట్నెస్ ప్రమాణాల కోసం కష్టపడితే ఏ సమస్యా ఉండదు. కానీ మిగతా వాళ్లు అతడి స్థాయిలో ఉత్తమ స్థితిలో ఉండట్లేదు. మరి ఆటగాళ్లను దృఢంగా తీర్చిదిద్ది గాయాల బారిన పడకుండా పర్యవేక్షించాల్సిన బీసీసీఐ బృందం ఈ విషయంలో విఫలమవుతోందన్నది స్పష్టం. ప్రపంచంలో మరే అంతర్జాతీయ జట్టుకూ లేని స్థాయిలో టీమ్ఇండియాను మాత్రమే ఫిట్నెస్ సమస్యలు ఎందుక వేధిస్తున్నాయంటే ఇంజూరీ మేనేజ్మెంట్లో విఫలమవుతున్నట్లే కదా?
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్