ODI WC 2023: కప్పు ముందు గాయాలు బాబోయ్.. జట్లకు ఆటగాళ్ల గాయాల భయాలు!
మెగా సమరం (ODI World Cup 2023) ప్రారంభంకానున్న వేళ అన్ని జట్లకూ గాయాలబెడద ఆందోళనగా మారింది. కొంతమంది తాజాగా గాయపడటం.. మరికొందరికి గాయాలు తిరగబెట్టడం అభిమానులను కంగారుకు గురి చేస్తోంది.
ఓ వైపు వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ముంచుకొస్తోంది.. అక్టోబర్ 5నే భారత్లో ఈ మెగా టోర్నీ ఆరంభమవుతుంది. కానీ కప్పు ముందు జట్లకు ఆటగాళ్ల గాయాలు.. భయాలు పుట్టిస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ (భారత్), టిమ్ సౌథీ, విలియమ్సన్ (న్యూజిలాండ్), నోకియా, బవుమా (దక్షిణాఫ్రికా), నజ్మల్ శాంటో, ఎబాదత్, తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్), కమిన్స్, స్మిత్, స్టార్క్, మ్యాక్స్వెల్, అగర్, ట్రేవిస్ హెడ్ (ఆస్ట్రేలియా), నసీమ్ షా, హారిస్ రవూఫ్, సల్మాన్ అఘా, ఇమాముల్ హక్ (పాకిస్థాన్), ఆదిల్ రషీద్, మార్క్వుడ్, జోఫ్రా ఆర్చర్, జేసన్ రాయ్ (ఇంగ్లాండ్), హసరంగ, తీక్షణ, చమీర, మదుశంక (శ్రీలంక).. ఇలా దాదాపు అన్ని జట్లలోనూ ప్రస్తుతం కొంతమంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. వీళ్లలో కొంతమంది ప్రపంచకప్ నాటికి కోలుకునే అవకాశముంది. కానీ నసీˆమ్ షా, సౌథీ, ఎబాదత్, హెడ్ లాంటి ఆటగాళ్లు టోర్నీ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉంది.
అంతలోనే..
స్వదేశంలో వన్డే ప్రపంచకప్. జట్టుపై ఎన్నో అంచనాలు. కానీ ఆటగాళ్ల గాయాలు టీమ్ఇండియాకు ప్రధాన సమస్యగా ఉండేది. కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. శస్త్రచికిత్సల నుంచి ఎప్పుడు కోలుకుంటారో? తిరిగి జట్టులో ఎప్పుడు అడుగుపెడతారో? అని జట్టు మేనేజ్మెంట్తో పాటు అభిమానులూ ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు ఫలించి.. సరిగ్గా ప్రపంచకప్కు ముందు ఈ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ముందుగా బుమ్రా.. ఆ తర్వాత శ్రేయస్, కేఎల్ రాహుల్ పునరాగమనం చేశారు. ప్రపంచకప్కు జట్టును కూడా ప్రకటించేశారు. అదే జట్టును ఆసియా కప్లో దించారు. ఇంకేముంది ఆసియా కప్లో జట్టు మంచిగా సన్నద్ధమై.. సొంతగడ్డపై ప్రపంచకప్లో రాణిస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కథ అడ్డం తిరిగింది. శ్రేయస్ను వెన్ను నొప్పి మళ్లీ బాధిస్తోంది. ఆసియా కప్లో పాకిస్థాన్తో మ్యాచ్లో అతను కేవలం 9 బంతులే ఆడి ఔటైపోయాడు. నేపాల్తో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. కానీ ఇంతలోనే మళ్లీ వెన్ను నొప్పి అని సూపర్- 4లో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్తో మ్యాచ్లకు అతను దూరమయ్యాడు. శ్రేయస్ కోలుకుంటున్నాడు కానీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని తెలిసింది. ఒకవేళ జట్టులోకి వచ్చినా.. మళ్లీ గాయం పేరుతో బయటకు వెళ్లకూడదనేది అభిమానుల కోరిక.
మరోవైపు అక్షర్ పటేల్కు తాజాగా గాయాలవడం ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాతో మ్యాచ్లో అతనికి చిటికెన వేలు, మోచేతి గాయాలతో పాటు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ను పిలిపించారు. అక్షర్ ఇప్పటికిప్పుడే కోలుకోవడం కష్టమేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ప్రపంచకప్ నాటికి అతను ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా అతని స్థానంలో వేరొకరిని ఆడిస్తారా? అన్నది చూడాలి.
ఈ జట్లకు గట్టిదెబ్బ..
ఆటగాళ్ల గాయాల కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. శస్త్రచికిత్స నుంచి వేగంగా కోలుకుంటున్న విలియమ్సన్ ప్రపంచకప్ నాటికి ఫిట్నెస్ సాధిస్తాడని న్యూజిలాండ్ ఆశలు పెట్టుకుంది. అందుకే అతనే కెప్టెన్గా ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. కానీ శస్త్రచికిత్స నుంచి కోలుకోవడం అంటే సుదీర్ఘ ప్రక్రియ. ఒకవేళ విలియమ్సన్ ఫిట్గా మారిన ప్రపంచకప్లో ఆడటంపై అనుమానాలు మాత్రం అలాగే కొనసాగుతాయి. తాజాగా ఇంగ్లాండ్తో నాలుగో వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో కివీస్ సీనియర్ పేసర్ సౌథీ కుడిచేతి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, అతను ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మియా వెనుక భయ్యా... సిరాజ్ను దిద్దిన విరాట్ కోహ్లి
ఇక పాకిస్థాన్కు ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్లోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టుకు కీలకంగా మారిన పేసర్లు నసీమ్ షా, హారిస్ రవూఫ్, సల్మాన్ అఘా గాయాల పాలయ్యారు. భుజం గాయంతో నసీమ్ ప్రపంచకప్తో పాటు ఆ తర్వాత కొన్ని నెలలు కూడా ఆటకు దూరంగా ఉండే అవకాశముందని తెలిసింది. బంగ్లాదేశ్కు కీలకమైన బౌలర్ ఎబాదత్, బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ కూడా ఇంకా గాయాల నుంచి కోలుకోలేదు. ఈ కారణంతోనే ఆసియా కప్లోనూ ఆడలేదు. నజ్మల్ శాంటో కూడా గాయపడ్డాడు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టులో ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న ఆటగాళ్ల జాబితా పెద్దగానే ఉంది. కమిన్స్, స్మిత్, స్టార్క్, మ్యాక్స్వెల్, అగర్ ప్రపంచకప్ వరకు ఫిట్నెస్ సాధించేలా కనిపిస్తున్నారు. కానీ హెడ్ మాత్రం ఆ మెగా టోర్నీ ఆడే అవకాశం లేదనే చెప్పాలి. ఆర్చర్ మినహా గాయపడ్డ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రపంచకప్ వరకు కోలుకునే ఆస్కారముంది. తమ ఆటగాళ్లు త్వరగానే కోలుకుంటారని దక్షిణాఫ్రికా, శ్రీలంక ఆశతో ఉన్నాయి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్