Punjab Vs Mumbai: డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి బ్యాటర్ టిమ్ డేవిడ్, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్లపై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తీవ్ర చర్యలు చేపట్టింది. పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో కూర్చుని.. క్రీజ్లోని బ్యాటర్లకు డీఆర్ఎస్ సిగ్నల్ ఇవ్వమని సైగలు చేసినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. దీనిని గమనించిన పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ సామ్ కరన్ (Sam Curran)ఈ విషయాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. అవేవీ పట్టించుకోని ఫీల్డ్ అంపైర్ డీఆర్ఎస్ రిఫర్ చేయడం గమనార్హం. దీంతో అంపైరింగ్ వ్యవస్థపై సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ముంబయి జట్టుకు అనుకూలంగా మారుతుందనే ట్రోలింగ్ మొదలైంది.
ఈక్రమంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ను డేవిడ్, పొలార్డ్ ఉల్లంఘించినట్లు భావించిన అడ్వైజరీ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘టిమ్ డేవిడ్, పొలార్డ్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.0 ప్రకారం లెవల్ 1 నేరానికి పాల్పడ్డారు. వారిద్దరి మ్యాచ్ ఫీజ్లో చెరో 20 శాతం జరిమానాగా విధిస్తున్నాం’’ అని వెల్లడించింది. అయితే, ఎందుకు జరిమానా విధిస్తున్నామనేది అందులో చెప్పకపోవడం గమనార్హం.
పంజాబ్ వ్యూహంపై చోప్రా ఆగ్రహం
ఆరంభంలో వికెట్లను కోల్పోయినప్పటికీ శశాంక్సింగ్, అశుతోష్ శర్మ కీలక ఇన్నింగ్స్లతో పంజాబ్ విజయానికి చేరువగా వచ్చింది. వారిద్దరూ పెవిలియన్కు చేరడంతో ముంబయి చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో పంజాబ్ వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ‘‘మీరు 14/4 స్కోరు వద్ద ఉన్నప్పుడు.. మీరు రేసులోనే లేరు. ప్రధాన ఆటగాళ్లుగా భావిస్తున్నవారంతా పెవిలియన్కు చేరారు. అలాంటప్పుడు శశాంక్ను ఆరో వికెట్గా పంపారు. దేశవాళీ క్రికెట్లో అనుభవం కలిగిన ఆటగాడు. అతడిని మీరు ఫినిషర్గా ఎలా నిర్ణయించుకున్నారు. అద్భుతంగా ఆడినప్పటికీ ఇంకాస్త ముందుగా పంపించి ఉంటే వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసేవాడు. కేవలం బ్యాటింగ్ చేయడంతోపాటు దూకుడు మాత్రమే ఫినిషర్ పాత్రకు సరిపోదు’’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం