Deepak Chahar: కొత్త రూల్స్ మాకు ఉపయోగం.. బ్యాటర్లు చిత్తే: దీపక్ చాహర్
గుజరాత్ను ఓడించడంలో చెన్నై బౌలర్ దీపక్ చాహర్, శివమ్ దూబె కీలక పాత్ర పోషించారు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు దీపక్ చాహర్ కీలకమైన రెండు వికెట్లు తీశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులు ఇచ్చాడు. గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (21), శుభ్మన్ గిల్ (8)ను ఔట్ చేశాడు. ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఐపీఎల్ నిర్వాహకులు కొత్త రూల్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చాహర్ స్పందించాడు.
‘‘ఇప్పటి వరకు ఆడిన చాలా మ్యాచుల్లో పవర్ ప్లేలోనే మూడు ఓవర్లు వేశాను. ఇప్పుడు కూడా ఇలానే సంధించా. కొత్త నిబంధనలు వచ్చాక.. వాటిని అలవాటు చేసుకొనేందుకు ప్రయత్నించా. గతంలో ఓవర్లో తొలి మూడు బంతుల్లో బౌన్సర్ వేస్తే.. మిగతావి లైన్ అండ్ లెంగ్త్తో వస్తాయని బ్యాటర్లు అంచనా వేసేవారు. ఇప్పుడు ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేసే వెసులుబాటు లభించింది. దీంతో బ్యాటర్లపై బౌలర్లు పైచేయి సాధించేందుకు అవకాశం ఉంది. అది పేసర్లకు చాలా ఉపయోగకరం. చెన్నై పిచ్పై బౌన్స్ ఎప్పుడూ ఉంటుంది. గుజరాత్తో మ్యాచ్లో మంచు ప్రభావం పెద్దగా లేదు. ఇప్పుడు బౌలింగ్ చేసే సమయంలో నేను ఇద్దరి వైపు చూస్తా. కెప్టెన్ రుతురాజ్తోపాటు మహీ భాయ్ సూచనలు కీలకం’’ అని దీపక్ చాహర్ తెలిపాడు.
చెన్నైకి.. ఇతర ఫ్రాంచైజీలకు ఇదే వ్యత్యాసం: దూబె
‘‘ఐపీఎల్లో ఇతర ఫ్రాంచైజీలతో పోలిస్తే చెన్నై జట్టుకు చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వారి కోసం కొన్ని మ్యాచ్లనైనా గెలిపించాలని భావించా. దాని కోసం చాలా కష్టపడ్డా. గుజరాత్ బౌలర్లు షార్ట్ బాల్స్తో ఇబ్బంది పెడతారని తెలుసు. అందుకు సిద్ధమై క్రీజ్లోకి వెళ్లా. చెన్నై తరఫున అత్యధిక స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేయాలని భావించా’’ అని దూబె వెల్లడించాడు. గుజరాత్పై దూబె 23 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అతడికే వరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్