Unmukt Chand: బీసీసీఐ నిర్ణయం వల్లే.. దేశవాళీ క్రికెట్ ఇంకా బతికి ఉంది: ఉన్ముక్త్ చంద్
బీసీసీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టే.. దేశవాళీ క్రికెట్ మనుగడ సాధిస్తుందని అండర్ -19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ లీగుల్లో ఆడేందుకు భారత క్రికెటర్లకు బీసీసీఐ అనుమతి ఇవ్వకపోవడమే మంచిదైందని అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అతడు యూఎస్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియాలో విపరీతమైన పోటీ నేపథ్యంలో స్థానం దక్కించుకోలేకపోయాడు. దీంతో అతడు యూఎస్ఏకు తన మకాం మార్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీ20 లీగ్ క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘బీసీసీఐ భారత ఆటగాళ్లకు విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణాలు ఉంటాయి. అయితే, ఒక ఆటగాడిగా.. ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు వస్తే బాగుంటుందని నేను అనుకోవడంలో తప్పులేదు. ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగుల్లో ఆడేస్తాడు. వీటిని తన జాతీయ జట్టులోకి రావడానికి అదొక అవకాశంగా మార్చుకుంటాడు. అయితే, ఇప్పుడు ఎక్కువ లీగ్లు మన దేశవాళీ టోర్నీలు జరిగే సమయంలోనూ నిర్వహిస్తుంటారు. రంజీ ట్రోఫీ, టీ20 లీగ్, విజయ్ హజారే.. ఇలా డొమిస్టిక్ షెడ్యూల్ బిజీగా ఉంటుంది. ఒకవేళ ఆటగాళ్లను విదేశీ లీగ్ల్లో ఆడించేందుకు అనుమతిస్తే.. దేశవాళీ క్రికెట్ అంతమైనట్లే. ఇలాంటి టెక్నికల్ అంశాలకు బీసీసీఐ తన సమాధానం ఇస్తుంది. కానీ, వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళ్లి ఆడే అవకాశం ఉంటే బాగుంటుందని అనుకుంటా’’ అని ఉన్ముక్త్ తెలిపాడు.
వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్పై..
‘‘దాయాదుల పోరు అంటే అభిమానుల్లో ఎప్పటికీ క్రేజ్ ఉంటుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కోసం సర్వత్రా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు యూఎస్ వేదికగా తొలిసారి మెగా టోర్నీ జరగనుంది. పెద్ద మైదానాలు భారీగా ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నా. భారత్ ఎక్కువగా ఇక్కడ ఆడనుంది. కాబట్టి ప్రతి మ్యాచ్ హౌస్ఫుల్ అవడం ఖాయం’’ అని వ్యాఖ్యానించాడు. జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!