Mohit Sharma: బంతి వేగం 100 కి.మీ కంటే తక్కువే.. అలా ఎందుకు వేశానంటే?: పేసర్ మోహిత్
హైదరాబాద్పై గుజరాత్ విజయం సాధించడంలో బౌలర్లదే కీలక పాత్ర. ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ సెన్సేషన్ స్పెల్ వేశాడు. డెత్ ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయాలో యువ బౌలర్లకు అదర్శంగా నిలిచాడు. ఒక దశలో అతడి బంతి వేగం 95 కి.మీ నుంచి 100 కి.మీ మాత్రమే ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. స్పిన్నర్ వేసే స్పీడ్తో వైవిధ్యంగా బంతులను సంధించిన మోహిత్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. భారీ హిట్టర్లు కలిగిన హైదరాబాద్ను అడ్డుకోవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. తాను స్లో డెలివరీలను వేయడానికి కారణాలను మోహిత్ వెల్లడించాడు.
‘‘బౌలింగ్ ప్రాక్టీస్ను ఎప్పుడూ నేను సాధారణంగానే చేస్తా. మ్యాచ్ పరిస్థితి బట్టి బౌలింగ్లో వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నిస్తా. అదే సమయంలో ఎక్కడ బంతిని సంధిస్తున్నామనేది చాలా కీలకం. రెండు రకాల బంతులను సంధించాలనుకుంటాం. బ్యాటర్లూ సిద్ధంగా ఉంటారు. స్లో బౌన్సర్ వేస్తారేమోనని భావిస్తారు. అంతే కానీ స్టంప్స్నకు దూరంగా స్లో షార్ట్ బాల్ వస్తుందని ఊహించలేరు. అలాంటప్పుడే మనం రెండింటిని కలిపి సంధించాలి. మంచు ప్రభావం వల్ల బంతి మన నియంత్రణలో ఉండదు. అందుకోసం ప్రాక్టీస్ సమయంలోనే తడి బంతులతో సాధన చేయాలి. అప్పుడు సరైన దిశలో, అనుకున్న విధంగా బంతి వెళ్తే సంతోషిస్తా. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా నేను ఎక్కడ బాగా వేశాను.. ఎక్కడ పొరపాటు చేశాననే విషయాలపై విశ్లేషించుకుంటా. రషీద్, నూర్ అహ్మద్ చాలా చక్కగా బౌలింగ్ వేశారు. మధ్యలో మా బ్యాటింగ్ నెమ్మదించినప్పటికీ చివరికి విజయం సాధించాం’’ అని మోహిత్ తెలిపాడు.
ప్రపంచ స్థాయి బౌలింగ్తో బరిలోకి దిగాం: గిల్
‘‘సొంతమైదానంలో రెండు మ్యాచ్లు గెలవడం ఆనందంగా ఉంది. మా తర్వాత గేమ్ కూడా ఇక్కడే. టోర్నీలో మేం మంచి స్థితిలోనే ఉన్నాం. హైదరాబాద్ను కట్టడి చేయడంలో బౌలర్లు రషీద్, నూర్, మోహిత్ కీలక పాత్ర పోషించారు. మిడిల్ ఓవర్లలో పరుగులు ఎక్కువ ఇవ్వకపోవడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగింది. డెత్లో రెండు ఓవర్లను అద్భుతంగా సంధించడం అభినందనీయం. మోహిత్ శర్మ స్లో బంతులతో పరుగులను నియంత్రించాడు. ఈ పిచ్పై 160 -170 స్కోరైనా మంచిదేనని భావించా. వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని కరిగించారు. మిల్లర్ మళ్లీ ఫామ్ అందుకోవడం మాకు కలిసొస్తుంది. అతడి ఫిట్నెస్కు ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని గిల్ స్పష్టం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?