Jos Buttler: ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కోల్కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (107) అద్భుతం చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కోల్కతాపై చివరి బంతికి జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సెంచరీ చేసిన అతడు ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఏకాగ్రతతో ఆడి ఆర్ఆర్ను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో జోస్ బట్లర్ మాట్లాడాడు. గాయం కారణంగా పంజాబ్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్.. కోల్కతాపై నొప్పిని భరించి మరీ పోరాడాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదనను పునరావృతం చేసింది. గతంలో పంజాబ్పై (2020లో) 224 పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్ పూర్తి చేసింది.
‘‘భారీ లక్ష్య ఛేదనకు దిగినప్పుడు ఆత్మవిశ్వాసంతో ఆడాలి. అదే కీలక పాత్ర పోషిస్తుంది. లయను అందుకోవడానికి ఇబ్బంది పడ్డా. ఎందుకు ఆడలేకపోతున్నానని నిరుత్సాహానికి గురికావడం సహజం. అప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంతా ఓకే.. ఒకటీ రెండు షాట్లు తగిలేవరకూ అలాగే ఆడాలని నా మనస్సుకు సర్ది చెబుతా. ఐపీఎల్లో భారీ లక్ష్యాలను ఛేదించడం సహజమే. ధోనీ, విరాట్ కోహ్లీ.. చివరి వరకూ క్రీజ్లో ఉండి తమ జట్లను గెలిపించినవారే. నేను కూడా వారినే అనుసరించా.. చేయగలననే నమ్మకంతో ఆడా. ఇక మా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంగక్కర మాటలు ఎంతో పనిచేశాయి. ఎక్కడో ఒక చోట బ్రేక్ పాయింట్ ఉంటుందన్న అతడి సూచనలు వర్కౌట్ అయ్యాయి. దాని కోసం వేచి చూసి బౌలర్లపై ఎదురు దాడి చేశా. కనీస పోరాటం చేయకుండా వికెట్ సమర్పించుకోవడం అత్యంత దారుణం. సంగక్కర చెప్పినట్లు క్రీజ్లో ఉంటే ఏదొక సమయంలో మలుపు తిరిగేందుకు అవకాశం ఉంటుందని గ్రహించా. ఆ ప్రణాళికలకు అనుగుణంగానే చివరి వరకూ పోరాడాలని నిర్ణయించుకున్నా. ఇప్పటి వరకు నేను ఆడిన ఇన్నింగ్స్ల్లో ఇదే అత్యుత్తమం అని చెప్పగలను’’ అని బట్లర్ తెలిపాడు.
నరైన్ను టార్గెట్ చేయాలనే ఆడా: రోవ్మన్ పావెల్
ఓ వైపు జోస్ బట్లర్ జట్టు విజయం కోసం శ్రమిస్తే.. ఆఖర్లో రోవ్మన్ పావెల్ (13 బంతుల్లో 26 పరుగులు) టార్గెట్ను తేలిక చేసేశాడు. కీలక సమయంలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘220+ టార్గెట్ను ఛేదిస్తే.. అద్భుతమైన మ్యాచ్ అవుతుంది. నేను బ్యాటింగ్కు దిగే సమయానికి పరిస్థితి కాస్త కఠినంగానే ఉంది. సునీల్ నరైన్పై ఎదురు దాడి చేయాలని భావించా. ఆ జట్టులో అతడే అత్యుత్తమ బౌలర్. నా బ్యాటింగ్పై పూర్తి నమ్మకం ఉంది. కోల్కతాపై కీలక ఇన్నింగ్స్ ఆడటం బాగుంది. సునీల్ నరైన్ మళ్లీ జాతీయ జట్టులోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అతడు మాత్రం అవేవీ పట్టించుకోనట్లు ఉన్నాడు. నరైన్ బెస్ట్ ఫ్రెండ్స్ పొలార్డ్, బ్రావో, పూరన్ అయినా టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు ప్రకటన లోపు ఒప్పిస్తారేమో చూడాలి’’ అని పావెల్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూపై హత్యాయత్నం కేసు.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు