Virat Kohli: వారిద్దరూ టీమిండియా సీత-గీత: కోహ్లీ చెప్పిన ఆ ప్లేయర్స్‌ ఎవరంటే..?

ఇద్దరు యువ ప్లేయర్ల గురించి మాట్లాడుతూ విరాట్ కోహ్లీ (Virat Kohli) సరదాగా స్పందించాడు. 

Published : 11 Apr 2024 17:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియాలో ఇద్దరు ఆటగాళ్ల గురించి కింగ్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర విషయం వెల్లడించాడు. వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని చెప్పాడు. ఇంతకీ అతడు చెప్పింది ఎవరి గురించి అంటే..?

యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్,  శుభ్‌మన్‌ గిల్ మంచి స్నేహితులు. వారి సోషల్ మీడియా చిత్రాలు చూసిన ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. పర్యటనల్లో ఒకరి కంపెనీని మరొకరు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ బంధం భలే సరదాగా ఉంటుందన్న కోహ్లీ.. వారిని ‘సీతా ఔర్‌ గీతా’ చిత్రంలోని కవలల పాత్రలతో పోల్చాడు. ‘‘ముఖ్యంగా పర్యటనల సమయంలో వారు ఒకరిని విడిచి ఒకరు ఉండరు. మేం ఆహారం కోసం బయటకు వెళ్తే.. వారు కలిసే వస్తారు. ఏదైనా చర్చల్లో కూడా కలిసే కనిపిస్తారు. వారు విడిగా ఉండటాన్ని నేను చూడలేదు. వారు గొప్ప స్నేహితులు’’ అని విరాట్ ఫన్నీగా స్పందించాడు.

గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్న గిల్‌.. ఈ ఐపీఎల్‌లో తన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఓపెనర్ బృందం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ఇషాన్ కిషన్ ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని