Team India Fitness: ఎవరికి.. ఎప్పుడు.. ఏ గాయమవునో... టీమ్ఇండియాలో ఫిట్నెస్ ఓ మిథ్య!
టీమిండియా ఫిట్నెస్ (Team India Fitness) కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. NCCలో కోలుకుని, పూర్తి ఫిట్నెస్తో వచ్చారని చెబుతున్న క్రికెటర్లు (Team India Players) వెంటనే గాయంతో జట్టు నుంచి దూరమవుతున్నారు.
జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. ఏమిటీ జాబితా అనుకుంటున్నారా? గత ఏడాది వ్యవధిలో గాయాలతో ఇబ్బంది పడ్డ టీమ్ఇండియా ఆటగాళ్లు వీళ్లు. క్రికెటర్లన్నాక గాయాలు సహజమే కావచ్చు.. ఒక ఆటగాడు మళ్లీ మళ్లీ గాయపడటం.. పూర్తి ఫిట్నెస్ (Fitness) సాధించాడు అనుకునేలోపే మళ్లీ గాయాలు తిరగబెట్టడం.. ఎప్పుడు ఏ ఆటగాడు మ్యాచ్కు దూరం అవుతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా ఆసియా కప్లో రెండు మ్యాచ్లు ఆడాడో లేదో అంతలోనే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయపడటం చర్చనీయాంశంగా మారింది.
కొన్ని వారాల కిందటి మాట. ఆసియా కప్ (Asia Cup 2023) సమీపిస్తుండగా.. ప్రపంచకప్ జట్టు ఎంపికకూ సమయం దగ్గర పడుతుండగా.. కేఎల్ రాహుల్ (KL Rahul), శ్రేయస్ అయ్యర్ల ఫిట్నెస్పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇంతలో వాళ్లిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు, మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు వార్తలు. ఇద్దరూ హుషారుగా ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడేస్తున్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) వర్గాలు సమాచారం ఇచ్చాయి. అంతా ఓకే అనుకుంటుండగా ఆసియా కప్ జట్టును ప్రకటించారు సెలక్టర్లు. రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్కూ జట్టులో చోటిచ్చారు. కానీ అంతలోనే చిన్న ట్విస్ట్ ఇచ్చారు. తొడ గాయం నుంచి రాహుల్ కోలుకున్నాడని, కానీ అతడికేదో మళ్లీ చిన్న గాయం అయిందని చెబుతూ ఆసియా కప్లో తొలి రెండు మ్యాచ్లకు అతణ్ని దూరం పెట్టారు. శ్రేయస్ అయ్యర్ మాత్రం పూర్తి ఫిట్గా ఉన్నట్లు ప్రకటించారు.
అప్పటి బస్సు డ్రైవర్.. ఇప్పుడు టీమ్ ఇండియా త్రోడౌన్ స్పెషలిస్ట్
అయితే రాహుల్ రెండు మ్యాచ్ల అనంతరం పాకిస్థాన్తో సూపర్-4 మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. కానీ ఇంతలో శ్రేయస్ అయ్యర్కు మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది. రాహుల్ అందుబాటులోకి వచ్చిన మ్యాచ్కు అతను దూరమయ్యాడు. తన స్థానంలోనే రాహుల్ ఆడాడు. వరుసగా రెండు మ్యాచ్లకు శ్రేయస్ దూరమైన సంగతి తెలిసిందే. రాహుల్ ఈ ఏడాది ఐపీఎల్లో తొడ గాయంతో ఆటకు దూరమై శస్త్రచికిత్స చేయించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ అంతకంటే ముందు వెన్ను గాయానికి గురయ్యాడు. అతనూ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇద్దరూ కొన్ని నెలల పాటు ఎన్సీఏలో ఉండి కోలుకున్నారు. పూర్తి ఫిట్నెస్ సాధించారు అనుకున్నాక మళ్లీ వీరిని గాయాలు ఇబ్బంది పెట్టాయి. మరి అన్ని నెలలు ఎన్సీఏలో వైద్యుల పర్యవేక్షణలో ఉండి వీళ్లు ఏం కోలుకున్నారన్నది ప్రశ్న.
అదే క(వ్య)థ!
ఫిట్నెస్ విషయంలో ఈ అయోమయం రాహుల్, శ్రేయస్లకే పరిమితం కాదు. కొంత కాలంగా భారత జట్టులో ఇంజురీ మేనేజ్మెంట్ ఏమాత్రం బాగా లేదని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంగతే తీసుకుంటే.. గత నెలలో ఐర్లాండ్తో టీ20 సిరీస్లో పునరాగమనం చేయడానికి ముందు గత ఏడాది వ్యవధిలో అతను 5 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడాడు. అతను గాయపడటం.. కోలుకుని జట్టులోకి రావడం.. మళ్లీ గాయపడి ఆటకు దూరం కావడం.. ఇదీ వరస. నిరుడు టీ20 ప్రపంచకప్ ముంగిట ఫిట్నెస్ సాధించినట్లే సాధించి మళ్లీ గాయపడి సుదీర్ఘ కాలం ఆటకు దూరమయ్యాడు. మరో పేస్ బౌలర్ దీపక్ చాహర్ విషయంలోనూ ఇదే జరిగింది.
గాయంతో పోరాడుతూ 2022 ఐపీఎల్కు కూడా అతను దూరమయ్యాడు. ఒక సమయంలో టీమ్ఇండియా ప్రధాన బౌలర్గా ఉన్న అతను.. గాయాల కారణంగానే జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. మళ్లీ మళ్లీ గాయపడటంతో సెలక్టర్లు అతణ్ని పక్కన పెట్టేశారు. మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ సైతం భారత జట్టులో అవకాశం అందుకున్నట్లే అందుకుని గాయంతో దూరమయ్యాడు. ఇటీవలే అతను కోలుకుని జట్టులో చోటు సంపాదించాడు కానీ.. మళ్లీ ఎప్పుడు గాయపడతాడో తెలియదు. బుమ్రా, శ్రేయస్, రాహుల్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో దీర్ఘ కాలం పోరాడి తిరిగొచ్చారు. ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. కానీ టోర్నీ మొదలయ్యే లోపు, మొదలయ్యాక వీళ్లు ఎంతమాత్రం ఫిట్నెస్తో ఉంటారన్నది ప్రశ్నార్థకం.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్