Shikhar Dhawan: గబ్బర్ మళ్లీ వస్తాడా..?
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఇటీవల జట్టులోకి ఎంపిక కావడం లేదు. తాజాగా ఆసియా క్రీడలకు ప్రకటించిన జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతడి క్రికెట్ భవితవ్యం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.
‘‘శిఖర్ ధవన్కు అవకాశాలకు ఎల్లవేళలా తలుపులు తెరిచే ఉంటాయి. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా పెద్ద మొత్తం మ్యాచ్లతో క్యాలెండర్ ఫుల్గా ఉంది. భారీ టోర్నీల్లో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. అందుకోసం బ్యాకప్ ఆటగాళ్లను రెడీగా ఉంచుతాం. ఇప్పుడు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. వారు యువకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తే ఇస్తారు. లేకపోతే సీనియర్ల అవసరం ఉందనిపిస్తే వారినే ఎంచుకుంటారు’’.. ఇవీ ఆసియా క్రీడల కోసం భారత జట్టును ఎంపిక అనంతరం ఓ బీసీసీఐ అధికారి చేసిన వ్యాఖ్యలు.
మొన్నటి వరకు సీనియర్ ప్లేయర్ శిఖర్ ధవన్ స్థానానికి ఎటువంటి ఢోకాలేకుండా పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో ప్రధాన జట్టు టోర్నీల్లోకానీ, కీలకమైన పర్యటనలకు వెళ్లినప్పుడు.. ధవన్కు ఓ జట్టును అప్పగించిన సందర్భాలూ ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో ధవన్ ఉండటం ఖాయమనే వ్యాఖ్యలూ ఉన్నాయి. ఓపెనర్గా శుభారంభం అందిస్తాడు. అవసరమైన దూకుడు.. నిదానం ఇలా ఏదైనా పరిస్థితికి తగ్గట్లుగా ఆడతాడనే పేరు సంపాదించాడు. ఇటీవల ఐపీఎల్లోనూ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్గా ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ చేసిన 143 పరుగుల్లో ఏకంగా 99 రన్స్ ధవన్వే అంటే మీరు నమ్మగలరా..? అలాంటి సీనియర్ను గత కొన్ని రోజులుగా బీసీసీఐ బెంచ్కే పరిమితం చేసింది. తాజాగా ఆసియా క్రీడల కోసమూ శిఖర్నే కెప్టెన్గా నియమిస్తారనే చర్చ కూడా వచ్చింది. పొట్టి ఫార్మాట్ కావడంతో కెప్టెన్సీ దేవుడెరుగు.. జట్టులోనే అవకాశం లేకుండాపోయింంది.
గోల్డ్ మెడల్ నెగ్గడమే మా కల: రుతురాజ్ గైక్వాడ్
యువకుల నుంచి తీవ్ర పోటీ?
ప్రస్తుతం భారత్ రోహిత్ నాయకత్వంలో విండీస్ పర్యటనలో ఉంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి టోర్నీలకు ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ కూడా ఇదే కావడం గమనార్హం. మరి అలాంటి సిరీస్కు ధవన్ను పక్కన పెట్టేసింది. దీనికి కారణం మాత్రం యువకుల నుంచి తీవ్ర పోటీ నెలకొనడమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ధవన్ ఇటీవల ఎక్కువగా ఓపెనర్గానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ, ఇప్పుడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఓపెనర్గా సెటిలైన సంగతి తెలిసిందే. ఇక రెండో ఓపెనింగ్ స్థానం కోసం కేఎల్ రాహుల్ గట్టి పోటీనిచ్చాడు. ఇప్పుడు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ నుంచి తీవ్ర పోటీ నెలకొనగా.. తాజాగా యశస్వి జైస్వాల్ కూడా రేసులోకి వచ్చాడు. గిల్, కిషన్ డబుల్ సెంచరీలు సాధించారు. ధవన్ మాదిరిగానే కిషన్ కూడా లెఫ్ట్హ్యాండర్ కావడంతో అతడికి సానుకూలాంశంగా మారేందుకు అవకాశం ఉంది.
ఫిట్నెస్ సమస్యలు..
ప్రస్తుతం ధవన్ వయసు 37 ఏళ్లు. ఈసారి ఆసియా కప్, వన్డే ప్రపంచప్ టోర్నీలే దాదాపు చివరిగా భావించొచ్చు. అందుకే ఈసారి అవకాశం ఇవ్వాలని ధవన్ అభిమానులు కోరుతున్నారు. అతడి ఫామ్ గురించి పెద్దగా ఆందోళన లేదు కానీ.. ఫిట్నెస్ విషయంలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ధవన్ కంటే రెండేళ్లు మాత్రమే చిన్నవారైనప్పటికీ గాయాల బెడద వారికి పెద్దగా లేకపోవడం గమనార్హం. విరాట్ గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కు వెళ్లలేదంటే అతడి ఫిట్నెస్ స్థాయి అర్థం చేసుకోవచ్చు. కానీ, ధవన్ మాత్రం ఇటీవల గాయాలబారిన పడుతుండటం కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపనుంది.
గత నాలుగేళ్లలో ప్రదర్శన ఇలా..
శిఖర్ ధవన్ గత వన్డే ప్రపంచ కప్ నుంచి ఇప్పటి వరకు 37 వన్డేలు ఆడాడు. మొత్తం 1,313 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 98 పరుగులు కాగా.. సగటు 41.03 మాత్రమే ఉంది. అదే సమయంలో గిల్ కేవలం 24 మ్యాచుల్లో 65.55 సగటుతో 1,311 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. గత పది వన్డేల్లో శిఖర్ ధవన్ గణాంకాలు మరీ ఘోరంగా ఉన్నాయి. ఇందులో కేవలం ఒకే ఒక్క అర్థ శతకం మాత్రమే ఉంది. ఇది కూడా ధవన్ను కాస్త పక్కన పెట్టేందుకు కారణమై ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఇప్పటి వరకు 167 వన్డేల్లో 44.1 సగటుతో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు