ODI WC 2023: అడ్రస్ లేని ఆఫ్ స్పిన్నర్లు... ప్రపంచ కప్లో లెగ్ స్పిన్నర్లకే పట్టం
ప్రపంచ క్రికెట్లో ఓ కళ క్రమక్రమంగా తగ్గిపోతోంది. అదే ఆఫ్ స్పిన్ (Off Spin). సీనియర్ బౌలర్లు, పార్ట్ బౌలర్లు తప్ప ఇంకెవరూ ఆఫ్ స్పిన్ వైపు రావడం లేదు. అలాగే జట్లు కూడా ఆఫ్ స్పిన్నర్ల విషయంలో శీతకన్ను వేస్తున్నాయి. (Off Spinner - Leg Spinner)
ఒకప్పుడు ఓ జట్టులో ఇద్దరు స్పిన్నర్లున్నారు అంటే.. అందులో ఒకరు ఆఫ్ స్పిన్నర్ (Off Spinner), మరొకరు లెగ్ స్పిన్నర్ (Leg Spinner) కావడం సాధారణం. అప్పుడే స్పిన్ దాడిలో వైవిధ్యం ఉంటుందని భావించేవాళ్లు. ముఖ్యంగా అప్పట్లో ఆఫ్స్పిన్నర్ల ఆధిపత్యం కనిపించేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆఫ్స్పిన్నర్ల ప్రభావం తగ్గిపోయి అన్ని జట్లూ వారికి ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేశాయి. ఇప్పుడంతా లెగ్ స్పిన్దే హవా. రాబోయే ప్రపంచకప్ (Odi World Cup 2023)లో కూడా లెగ్ స్పిన్నర్ల ఆధిపత్యమే చూడబోతున్నాం. ఆఫ్స్పిన్ కళే క్రమంగా కనుమరుగైపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
చైనామన్ చిన్నోడు.. ఫీనిక్స్లా లేచాడు
ఇటీవలే వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. టోర్నీ జరగబోయేది సొంతగడ్డ మీదే కావడంతో ఇక్కడి పిచ్లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు. కానీ ఆ ముగ్గురిలో ఒక్క కుడి చేతి వాటం ఆఫ్స్పిన్నరూ లేడు. కుల్దీప్ యాదవ్ చైనామన్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఎడమ చేతి వాటం స్పిన్నర్లు. వాళ్ల బౌలింగ్ కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్లు బంతులేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కుల్దీప్ ఎడమచేతి వాటంలో ఆఫ్స్పిన్ వేస్తాడు. ఆ శైలినే ‘చైనామన్’ అంటారు. రవిచంద్రన్ అశ్విన్ రూపంలో సీనియర్ ఆఫ్స్పిన్నర్ అందుబాటులో ఉన్నా.. అతడికి ప్రపంచకప్ జట్టులో చోటివ్వలేదు.
అతను కాకుండా దేశవాళీ క్రికెట్లో పేరున్న ఆఫ్స్పిన్నర్లు కనిపించడం లేదు. గత కొన్నేళ్లలో ఆఫ్స్పిన్కు ప్రపంచ క్రికెట్లో ప్రాధాన్యం తగ్గిపోతూ వస్తుండటంతో వర్ధమాన ఆటగాళ్లలో స్పెషలిస్టు స్పిన్నర్లుగా మారాలనుకుంటే లెగ్ స్పిన్ను ఎంచుకుంటున్నారే తప్ప.. ఆఫ్స్పిన్ జోలికి వెళ్లట్లేదు. భారత్ అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని జట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని ప్రధాన జట్లలోనూ స్పెషలిస్టు స్పిన్నర్లంతా మణికట్టును ఉపయోగించి స్పిన్ చేసేవాళ్లే. వేలితో బంతిని తిప్పేవాళ్లు చాలా తక్కువమంది కనిపిస్తున్నారు. ప్రధానంగా బ్యాటర్లుగా ఉండి పార్ట్టైం స్పిన్ వేసే వాళ్లు మాత్రమే ఆఫ్స్పిన్నర్లుగా ఉంటున్నారు.
ఫామ్తో కుస్తీలు... ప్రపంచకప్ జట్టులో వీళ్లు అర్హులేనా?
ఇంగ్లాండ్ ప్రపంచకప్ జట్టుకి ఎంపికైన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ అడిల్ రషీద్ మణికట్టు బౌలర్ అన్న సంగతి తెలిసిందే. పార్ట్టైం బౌలింగ్ వేసే మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ ఆఫ్స్పిన్ వేస్తారు. ఆస్ట్రేలియా జట్టులోనూ ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపా లెగీనే. మరో స్పిన్నర్ అస్టాన్ అగార్ ఎడమచేతి వాటం బౌలర్. ఆ జట్టులో పార్ట్టైమర్లు అయిన మ్యాక్స్వెల్, ట్రావిస్ హెడ్ ఆఫ్స్పిన్ వేస్తారు. దక్షిణాఫ్రికా జట్టులో షంసి చైనామన్ బౌలర్. కేశవ్ మహరాజ్ ఎడమచేతి వాటం స్పిన్నర్. పాక్ జట్టులో షాదాబ్ ఖాన్ లెగీనే. మరో స్పిన్నర్ మహ్మద్ నవాజ్ది ఎడమచేతి వాటం. న్యూజిలాండ్ స్పిన్ విభాగాన్ని నడిపిస్తున్న శాంట్నర్, రచిన్ రవీంద్ర ఎడమచేతి వాటం స్పిన్నర్లే.
ఏమిటి కారణం?
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ ఆఫ్స్పిన్నర్. భారత దిగ్గజ బౌలర్లలో ఒకడైన హర్భజన్ సింగ్ది ఈ శైలే. ఇంకా సక్లయిన్ ముస్తాక్, అశ్విన్, సయీద్ అజ్మల్, గ్రేమ్ స్వాన్ లాంటి మేటి ఆఫ్స్పిన్నర్లను చూశాం ప్రపంచ క్రికెట్లో. అయితే టీ20ల రంగ ప్రవేశంతో ఆఫ్స్పిన్నర్ల హవాను తెరపడిందని చెప్పొచ్చు. ఆఫ్స్పిన్నర్ల మీద ఎదురు దాడి చేయడం బ్యాటర్లకు తేలికైపోయింది. ఆఫ్స్పిన్నర్లు వేళ్లతో బంతిని పట్టుకునే తీరును బట్టే బ్యాటర్లు ఎలాంటి షాట్ ఆడాలో అంచనా వేసుకుంటున్నారు. బంతిని ఎంత టర్న్ చేసినా షాట్లు ఆడేస్తున్నారు. టీ20ల్లో ఆఫ్స్పిన్నర్ బంతి అందుకుంటే బ్యాటర్లకు పండగే అన్నట్లు తయారైంది పరిస్థితి. లెగ్స్పిన్నర్లతో పోలిస్తే ఆఫ్స్పిన్నర్లలో వైవిధ్యం తక్కువ కావడంతో దూకుడుగా ఆడే కొత్తతరం బ్యాటర్లు వారి బౌలింగ్ను అలవోకగా ఆడేస్తున్నారు. అందుకే అన్ని జట్లూ ఆఫ్స్పిన్నర్లకు ప్రాధాన్యం తగ్గించేశాయి. కొత్తగా ఆఫ్స్పిన్ను ఎంచుకునే స్పెషలిస్టు బౌలర్లూ తగ్గిపోయారు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం