ODI WC 2023: అడ్రస్ లేని ఆఫ్ స్పిన్నర్లు... ప్రపంచ కప్లో లెగ్ స్పిన్నర్లకే పట్టం
ప్రపంచ క్రికెట్లో ఓ కళ క్రమక్రమంగా తగ్గిపోతోంది. అదే ఆఫ్ స్పిన్ (Off Spin). సీనియర్ బౌలర్లు, పార్ట్ బౌలర్లు తప్ప ఇంకెవరూ ఆఫ్ స్పిన్ వైపు రావడం లేదు. అలాగే జట్లు కూడా ఆఫ్ స్పిన్నర్ల విషయంలో శీతకన్ను వేస్తున్నాయి. (Off Spinner - Leg Spinner)
ఒకప్పుడు ఓ జట్టులో ఇద్దరు స్పిన్నర్లున్నారు అంటే.. అందులో ఒకరు ఆఫ్ స్పిన్నర్ (Off Spinner), మరొకరు లెగ్ స్పిన్నర్ (Leg Spinner) కావడం సాధారణం. అప్పుడే స్పిన్ దాడిలో వైవిధ్యం ఉంటుందని భావించేవాళ్లు. ముఖ్యంగా అప్పట్లో ఆఫ్స్పిన్నర్ల ఆధిపత్యం కనిపించేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆఫ్స్పిన్నర్ల ప్రభావం తగ్గిపోయి అన్ని జట్లూ వారికి ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేశాయి. ఇప్పుడంతా లెగ్ స్పిన్దే హవా. రాబోయే ప్రపంచకప్ (Odi World Cup 2023)లో కూడా లెగ్ స్పిన్నర్ల ఆధిపత్యమే చూడబోతున్నాం. ఆఫ్స్పిన్ కళే క్రమంగా కనుమరుగైపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
చైనామన్ చిన్నోడు.. ఫీనిక్స్లా లేచాడు
ఇటీవలే వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. టోర్నీ జరగబోయేది సొంతగడ్డ మీదే కావడంతో ఇక్కడి పిచ్లు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయి కాబట్టి ముగ్గురు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు. కానీ ఆ ముగ్గురిలో ఒక్క కుడి చేతి వాటం ఆఫ్స్పిన్నరూ లేడు. కుల్దీప్ యాదవ్ చైనామన్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఎడమ చేతి వాటం స్పిన్నర్లు. వాళ్ల బౌలింగ్ కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్లు బంతులేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కుల్దీప్ ఎడమచేతి వాటంలో ఆఫ్స్పిన్ వేస్తాడు. ఆ శైలినే ‘చైనామన్’ అంటారు. రవిచంద్రన్ అశ్విన్ రూపంలో సీనియర్ ఆఫ్స్పిన్నర్ అందుబాటులో ఉన్నా.. అతడికి ప్రపంచకప్ జట్టులో చోటివ్వలేదు.
అతను కాకుండా దేశవాళీ క్రికెట్లో పేరున్న ఆఫ్స్పిన్నర్లు కనిపించడం లేదు. గత కొన్నేళ్లలో ఆఫ్స్పిన్కు ప్రపంచ క్రికెట్లో ప్రాధాన్యం తగ్గిపోతూ వస్తుండటంతో వర్ధమాన ఆటగాళ్లలో స్పెషలిస్టు స్పిన్నర్లుగా మారాలనుకుంటే లెగ్ స్పిన్ను ఎంచుకుంటున్నారే తప్ప.. ఆఫ్స్పిన్ జోలికి వెళ్లట్లేదు. భారత్ అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని జట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని ప్రధాన జట్లలోనూ స్పెషలిస్టు స్పిన్నర్లంతా మణికట్టును ఉపయోగించి స్పిన్ చేసేవాళ్లే. వేలితో బంతిని తిప్పేవాళ్లు చాలా తక్కువమంది కనిపిస్తున్నారు. ప్రధానంగా బ్యాటర్లుగా ఉండి పార్ట్టైం స్పిన్ వేసే వాళ్లు మాత్రమే ఆఫ్స్పిన్నర్లుగా ఉంటున్నారు.
ఫామ్తో కుస్తీలు... ప్రపంచకప్ జట్టులో వీళ్లు అర్హులేనా?
ఇంగ్లాండ్ ప్రపంచకప్ జట్టుకి ఎంపికైన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ అడిల్ రషీద్ మణికట్టు బౌలర్ అన్న సంగతి తెలిసిందే. పార్ట్టైం బౌలింగ్ వేసే మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ ఆఫ్స్పిన్ వేస్తారు. ఆస్ట్రేలియా జట్టులోనూ ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపా లెగీనే. మరో స్పిన్నర్ అస్టాన్ అగార్ ఎడమచేతి వాటం బౌలర్. ఆ జట్టులో పార్ట్టైమర్లు అయిన మ్యాక్స్వెల్, ట్రావిస్ హెడ్ ఆఫ్స్పిన్ వేస్తారు. దక్షిణాఫ్రికా జట్టులో షంసి చైనామన్ బౌలర్. కేశవ్ మహరాజ్ ఎడమచేతి వాటం స్పిన్నర్. పాక్ జట్టులో షాదాబ్ ఖాన్ లెగీనే. మరో స్పిన్నర్ మహ్మద్ నవాజ్ది ఎడమచేతి వాటం. న్యూజిలాండ్ స్పిన్ విభాగాన్ని నడిపిస్తున్న శాంట్నర్, రచిన్ రవీంద్ర ఎడమచేతి వాటం స్పిన్నర్లే.
ఏమిటి కారణం?
ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ ఆఫ్స్పిన్నర్. భారత దిగ్గజ బౌలర్లలో ఒకడైన హర్భజన్ సింగ్ది ఈ శైలే. ఇంకా సక్లయిన్ ముస్తాక్, అశ్విన్, సయీద్ అజ్మల్, గ్రేమ్ స్వాన్ లాంటి మేటి ఆఫ్స్పిన్నర్లను చూశాం ప్రపంచ క్రికెట్లో. అయితే టీ20ల రంగ ప్రవేశంతో ఆఫ్స్పిన్నర్ల హవాను తెరపడిందని చెప్పొచ్చు. ఆఫ్స్పిన్నర్ల మీద ఎదురు దాడి చేయడం బ్యాటర్లకు తేలికైపోయింది. ఆఫ్స్పిన్నర్లు వేళ్లతో బంతిని పట్టుకునే తీరును బట్టే బ్యాటర్లు ఎలాంటి షాట్ ఆడాలో అంచనా వేసుకుంటున్నారు. బంతిని ఎంత టర్న్ చేసినా షాట్లు ఆడేస్తున్నారు. టీ20ల్లో ఆఫ్స్పిన్నర్ బంతి అందుకుంటే బ్యాటర్లకు పండగే అన్నట్లు తయారైంది పరిస్థితి. లెగ్స్పిన్నర్లతో పోలిస్తే ఆఫ్స్పిన్నర్లలో వైవిధ్యం తక్కువ కావడంతో దూకుడుగా ఆడే కొత్తతరం బ్యాటర్లు వారి బౌలింగ్ను అలవోకగా ఆడేస్తున్నారు. అందుకే అన్ని జట్లూ ఆఫ్స్పిన్నర్లకు ప్రాధాన్యం తగ్గించేశాయి. కొత్తగా ఆఫ్స్పిన్ను ఎంచుకునే స్పెషలిస్టు బౌలర్లూ తగ్గిపోయారు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్