Team India : ఫామ్తో కుస్తీలు... ప్రపంచకప్ జట్టులో వీళ్లు అర్హులేనా?
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) కోసం టీమ్ ఇండియా జట్టును ఇటీవల BCCI ప్రకటించింది. 15 మంది జట్టులో ఓ ముగ్గురి విషయంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాళ్లే సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav), అక్షర్ పటేల్ (Axar Patel), శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur).
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023)కు అన్ని దేశాలూ జట్లను ప్రకటించేశాయి. కప్పుపై కన్నేసిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లు అత్యుత్తమ ఫామ్లో ఉన్న ఆటగాళ్లనే ఎంచుకున్నాయి. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ, టీమ్ఇండియా (Team India) మాత్రం ఇప్పటిదాకా కెరీర్లో ఏమంత గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఇటీవలి ఫామ్ కూడా బాలేకున్నా కొందరు ఆటగాళ్లను ప్రపంచకప్నకు తీసుకెళ్తోంది. మరి సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ ఆటగాళ్లు నిలబెడతారా? లేక ప్రపంచకప్లో జట్టు అవకాశాలను దెబ్బ తీస్తారా?
ప్రస్తుతం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిల ఫామ్ కూడా ఒకప్పటిలా పతాక స్థాయిలో లేని మాట వాస్తవం. కానీ, వాళ్ల సామర్థ్యం ఏంటో అందరికీ తెలుసు. తమదైన రోజున వారిని అడ్డుకోవడం అసాధ్యం. వాళ్లు కొత్తగా రుజువు చేసుకోవాల్సిందేమీ లేదు. లయ అందుకుంటే వీరు జట్టుకు ఎంత ఉపయోగపడగలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోని, తామేంటో పూర్తి స్థాయిలో రుజువు చేసుకోని ఆటగాళ్ల విషయంలోనే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జట్టుకు భరోసానివ్వలేకపోతున్న ఆ ఆటగాళ్లే.. అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్.
అంతంతమాత్రం అక్షర్
టీమ్ఇండియాకు చాన్నాళ్లుగా ఆడుతున్నప్పటికీ ఒక స్థాయి అందుకోని ఆటగాడు అక్షర్ పటేల్. తన రాష్ట్రానికే చెందిన జడేజా లాగే లెఫ్టార్మ్ స్పిన్నర్, ఆల్రౌండర్ అయిన అక్షర్.. జడ్డూ లాగా ఆల్రౌండ్ మెరుపులు మెరిపించింది తక్కువ. మూడు ఫార్మాట్లలో ఆడుతున్నప్పటికీ అతడి గణాంకాలు అంతంతమాత్రం. వన్డేల విషయానికే వస్తే.. 50 మ్యాచ్ల్లో 58 వికెట్లు మాత్రమే తీశాడు. అతడి బౌలింగ్ సగటు 32కు చేరువగా ఉండటం గమనార్హం. అతడి బ్యాటింగ్ పర్వాలేదు. 19 సగటుతో 413 పరుగులు నమోదు చేశాడు. ఇలాంటి గణాంకాలతో వన్డే జట్టులో కొనసాగుతుండటం, పైగా ప్రపంచకప్కు ఎంపిక కావడం ఆశ్చర్యం కలిగించే విషయం.
వన్డే ప్రపంచ కప్... 2003, 2019 సీన్ రిపీట్ అవుతుందా?
ఇలాంటి ప్రదర్శనతో మరే పెద్ద జట్టులోనూ ఓ ఆటగాడు ప్రపంచకప్ అవకాశం అందుకుని ఉండడంటే అతిశయోక్తి కాదు. అక్షర్ ఇటీవలి ఫామ్ పేలవంగా ఉన్నప్పటికీ అతణ్ని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. అశ్విన్, చాహల్ లాంటి స్పిన్నర్లను కాదని అక్షర్ను ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడైన జై షా బీసీసీఐ కార్యదర్శి అయ్యాక అతడి సొంత రాష్ట్రానికి చెందిన అక్షర్ పటేల్కు ప్రదర్శనతో సంబంధం లేకుండా టీమ్ఇండియాలో చోటు దక్కుతోందన్న ఆరోపణలుండటం గమనార్హం. మరి ప్రపంచకప్ తుది జట్టులో ఆడే అవకాశం వస్తే అక్షర్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
శార్దూల్ సత్తా చాటాలి
శార్దూల్ ఠాకూర్ ప్రతిభావంతుడైన బౌలరే కానీ.. అతడికి నిలకడ లేమి పెద్ద సమస్య. ఒక మ్యాచ్లో అదరగొడతాడు. తర్వాత వరుసగా కొన్ని మ్యాచ్లు విఫలమవుతాడు. వికెట్లు బాగానే తీస్తాడని పేరుంది కానీ.. ధారాళంగా పరుగులు ఇచ్చేయడం బలహీనత. ఇప్పటిదాకా 40 వన్డేలాడిన శార్దూల్ 29.11 సగటుతో 59 వికెట్లే తీశాడు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే ఈ ప్రదర్శన సాధారణం. లోయర్ ఆర్డర్లో కొన్నిసార్లు మెరుపు ఇన్నింగ్స్లు ఆడుతుంటాడు శార్దూల్. అతణ్ని తరచుగా వన్డే జట్టులో ఆడిస్తుండటానికి, ప్రపంచకప్ ఎంపికకు అది కూడా ఒక కారణమే. కానీ శార్దూల్ బౌలింగ్ మాత్రం మెరుగుపడాల్సి ఉంది. అర్ష్దీప్, ఉమ్రాన్ మాలిక్ వన్డేల్లో రాణించకపోవడం.. ప్రసిద్ధ్ కృష్ణ గాయంతో ఇబ్బంది పడటం శార్దూల్కు కలిసొచ్చి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అతను తుది జట్టులో కూడా కొనసాగే అవకాశాలే ఎక్కువ. మరి తన ఎంపిక సరైందే అని తన ఆటతో శార్దూల్ రుజువు చేస్తాడేమో చూడాలి.
టీ20లో సూపర్ సూర్య.. కానీ...
సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఎంత ప్రమాదకర ఆటగాడో కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించి.. టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న అతను.. అనతి కాలంలోనే టీ20ల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆ ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ బ్యాటర్గానూ మారాడు. ఈ ప్రదర్శన చూసి వన్డేలు, టెస్టుల్లోనూ అతడికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు పెరిగాయి. అయితేటెస్టుల సంగతి పక్కన పెడితే.. వన్డేల్లోనూ సూర్య సత్తా చాటలేకపోయాడు. వరుసగా అవకాశాలు ఇస్తున్నా ఉపయోగించుకోలేకపోయాడు.
కార్డియాక్ కిడ్స్... నేపాల్ క్రికెటర్లతో అంత వీజీ కాదు!
తొలి బంతి నుంచే విధ్వంసం సృష్టించే టీ20లు అతడికి నప్పుతున్నాయి కానీ.. కొంచెం నిలిచి ఆడాల్సిన వన్డేల్లో సూర్యకుమార్ రాణించలేకపోతున్నాడు. ఇప్పటిదాకా 26 వన్డేలాడిన సూర్య.. 24.33 సగటుతో 511 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకం కూడా లేదు. చివరగా వెస్టిండీస్ సిరీస్లో ఆడిస్తే అందులోనూ విఫలమయ్యాడు. ఆసియా కప్కు తుది జట్టులో ఆడించట్లేదు కానీ.. ప్రపంచకప్కు మాత్రం సూర్యను ఎంపిక చేశారు. అతడి స్థానంలో యువ ఆటగాడైన తిలక్ వర్మను ఎంపిక చేయాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ప్రదర్శన ప్రకారం సూర్యను ప్రపంచకప్లో తుది జట్టులో ఆడించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్