MS Dhoni: టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) అదరగొడుతున్నాడు. ఫినిషర్గా బరిలోకి దిగుతూ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటివరకు 35 బంతులు ఎదుర్కొని 91 పరుగులు చేశాడు. ఈ ఏడాది ధోనీ ఒక్కసారీ ఔట్ కాలేదు. మరోవైపు, జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం మరికొన్ని రోజుల్లో సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న ధోనీని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను మాజీలు తెర పైకి తెచ్చారు. ఓ స్పోర్ట్స్ ఛానల్ కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, ఆరోన్ ఫించ్ టీ20 ప్రపంచకప్నకు ధోనీ ‘వైల్డ్కార్డ్’ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందన్న విషయంపై చర్చించారు.
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జట్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంఎస్ ధోనీని చూస్తామా? అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. అదేగనుక జరిగితే అది ‘వైల్డెస్ట్ కార్డ్’ అవుతుందన్నాడు. ‘‘ధోనీ టీ20 ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నానని చెబితే ఆ ప్రతిపాదనను ఎవరూ తిరస్కరించరు. అతడి రాకతో ఎవరికీ ఇబ్బంది ఉండదు. ధోనీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
‘ధోనీని మించిన ఆటగాడు ఎవరున్నారు’
‘‘ధోనీ 255 స్ట్రైక్రేట్తో ఆడుతున్నాడు. ఇంతవరకు ఔట్ కాలేదు కాబట్టి యావరేజ్ లేదు. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ని చూస్తే.. మనం ఎన్ని మంచి జట్లతో తలపడతాం? ధోనీ మొదటి రౌండ్లో బ్యాటింగ్ చేయడు. కేవలం వికెట్ కీపింగ్ చేయాలి. సీఎస్కేలో ఇప్పుడు ఎలాగో అదే చేస్తున్నాడు. ధోనీ కేవలం మూడు జట్లపై బ్యాటింగ్కు దిగాలి. అవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా. పాకిస్థాన్ను కూడా లెక్కలోకి తీసుకుంటే నాలుగు టీమ్లు అవుతాయి. అది కూడా చివరి మూడు ఓవర్లలో వచ్చి బ్యాటింగ్ చేయాలి. ఈ విషయంలో ధోనీని మించిన ఆటగాడు ఎవరున్నారు?’’ అని సెహ్వాగ్ ఇటీవల ఓ క్రీడా ఛానల్తో అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..