IND vs ENG: యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ.. ఇంగ్లాండ్ టార్గెట్ 557
ఇంగ్లాండ్తో మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. పర్యటక జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండో మ్యాచ్లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో యశస్వి (214*: 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్లు) ద్విశతకం బాదేశాడు. అతడితోపాటు శుభ్మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ (68*) హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇంగ్లాండ్ ఎదుట 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 319 రన్స్కే ఆలౌటైంది. భారత్కు 126 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.
గిల్ రనౌట్.. సెంచరీ మిస్
ఓవర్నైట్ 196/2 స్కోరుతో నాలుగో రోజును ప్రారంభించిన భారత్ దాదాపు గంటపాటు వికెట్ కోల్పోలేదు. కానీ, కుల్దీప్తో (27) సమన్వయలోపం కారణంగా శుభ్మన్ గిల్ రనౌట్గా పెవిలియన్కు చేరాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 55 పరుగులు జోడించారు. వెన్ను నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ ప్రకటించిన యశస్వి మళ్లీ క్రీజ్లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే దూకుడుగానే ఆడాడు. అయితే, మరికాసేపటికే నిలకడగా ఆడిన కుల్దీప్ ఔటయ్యాడు. దాదాపు 15 ఓవర్లపాటు క్రీజ్లో ఉండటం విశేషం. 258/4 స్కోరుతో ఉన్న సమయంలో యశస్వికి తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ జతకలిశాడు. ఇంగ్లాండ్కు ‘బజ్బాల్’ క్రికెట్ రుచి చూపిస్తూ బౌండరీలతో హోరెత్తించారు. కేవలం 26 ఓవర్లలోనే ఐదో వికెట్కు 172 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యశస్వి తన కెరీర్లో రెండో డబుల్ సెంచరీ, సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర మ్యాచ్లోనే రెండో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఇంగ్లాండ్ ఎదుట లక్ష్యం 550+ దాటడంతో భారత సారథి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసినట్లు ప్రకటించాడు.
మరిన్ని విశేషాలు..
- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (855) ఉన్నాడు.
- భారత్ ప్రతి ఇన్నింగ్స్లోనూ 400+ స్కోరు చేయడం ఇది మూడోసారి. 2005లో పాక్పై (407, 407/9), 2009లో శ్రీలంకపై (426, 412/4) సాధించింది.
- ఒక సిరీస్లో అత్యధిక సిక్స్లు కొట్టిన తొలి జట్టుగా తన రికార్డునే భారత్ అధిగమించింది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు 48 సిక్స్లను భారత్ కొట్టింది. అంతకుముందు దక్షిణాఫ్రికాపై 47 సిక్స్లు బాదారు.
- భారత్ తరఫున టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్గా యశస్వి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ (535) పేరిట ఉన్న రికార్డును యశస్వి (545) అధిగమించాడు.
- ఒక టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్గా యశస్వి రికార్డు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 12 సిక్స్లు కొట్టాడు. ఓవరాల్గా వసీమ్ అక్రమ్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో.. ఒకే ఓవర్లో మూడు సిక్స్లు కొట్టిన ఐదో భారత బ్యాటర్ యశస్వి. అతడి కంటే ముందు ధోనీ, హార్దిక్, రోహిత్, ఉమేశ్ ఉన్నారు.
- రెండో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్. వరుసగా రెండు ద్విశతకాల బాదిన మూడో టీమ్ఇండియా క్రికెటర్గానూ నిలిచాడు. వినోద్ కాంబ్లి, విరాట్ కోహ్లీ అతడి కంటే ముందున్నారు.
- అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. దిలావర్ హుస్సేన్, సునీల్ గావస్కర్, శ్రేయస్ అయ్యర్ ఈ ఘనత సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?