IND vs ENG: యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ.. ఇంగ్లాండ్ టార్గెట్ 557
ఇంగ్లాండ్తో మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. పర్యటక జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండో మ్యాచ్లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో యశస్వి (214*: 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్లు) ద్విశతకం బాదేశాడు. అతడితోపాటు శుభ్మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ (68*) హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇంగ్లాండ్ ఎదుట 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 445 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 319 రన్స్కే ఆలౌటైంది. భారత్కు 126 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.
గిల్ రనౌట్.. సెంచరీ మిస్
ఓవర్నైట్ 196/2 స్కోరుతో నాలుగో రోజును ప్రారంభించిన భారత్ దాదాపు గంటపాటు వికెట్ కోల్పోలేదు. కానీ, కుల్దీప్తో (27) సమన్వయలోపం కారణంగా శుభ్మన్ గిల్ రనౌట్గా పెవిలియన్కు చేరాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 55 పరుగులు జోడించారు. వెన్ను నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ ప్రకటించిన యశస్వి మళ్లీ క్రీజ్లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే దూకుడుగానే ఆడాడు. అయితే, మరికాసేపటికే నిలకడగా ఆడిన కుల్దీప్ ఔటయ్యాడు. దాదాపు 15 ఓవర్లపాటు క్రీజ్లో ఉండటం విశేషం. 258/4 స్కోరుతో ఉన్న సమయంలో యశస్వికి తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ జతకలిశాడు. ఇంగ్లాండ్కు ‘బజ్బాల్’ క్రికెట్ రుచి చూపిస్తూ బౌండరీలతో హోరెత్తించారు. కేవలం 26 ఓవర్లలోనే ఐదో వికెట్కు 172 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యశస్వి తన కెరీర్లో రెండో డబుల్ సెంచరీ, సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర మ్యాచ్లోనే రెండో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఇంగ్లాండ్ ఎదుట లక్ష్యం 550+ దాటడంతో భారత సారథి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసినట్లు ప్రకటించాడు.
మరిన్ని విశేషాలు..
- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (855) ఉన్నాడు.
- భారత్ ప్రతి ఇన్నింగ్స్లోనూ 400+ స్కోరు చేయడం ఇది మూడోసారి. 2005లో పాక్పై (407, 407/9), 2009లో శ్రీలంకపై (426, 412/4) సాధించింది.
- ఒక సిరీస్లో అత్యధిక సిక్స్లు కొట్టిన తొలి జట్టుగా తన రికార్డునే భారత్ అధిగమించింది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు 48 సిక్స్లను భారత్ కొట్టింది. అంతకుముందు దక్షిణాఫ్రికాపై 47 సిక్స్లు బాదారు.
- భారత్ తరఫున టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్గా యశస్వి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ (535) పేరిట ఉన్న రికార్డును యశస్వి (545) అధిగమించాడు.
- ఒక టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్గా యశస్వి రికార్డు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 12 సిక్స్లు కొట్టాడు. ఓవరాల్గా వసీమ్ అక్రమ్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టుల్లో.. ఒకే ఓవర్లో మూడు సిక్స్లు కొట్టిన ఐదో భారత బ్యాటర్ యశస్వి. అతడి కంటే ముందు ధోనీ, హార్దిక్, రోహిత్, ఉమేశ్ ఉన్నారు.
- రెండో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్. వరుసగా రెండు ద్విశతకాల బాదిన మూడో టీమ్ఇండియా క్రికెటర్గానూ నిలిచాడు. వినోద్ కాంబ్లి, విరాట్ కోహ్లీ అతడి కంటే ముందున్నారు.
- అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. దిలావర్ హుస్సేన్, సునీల్ గావస్కర్, శ్రేయస్ అయ్యర్ ఈ ఘనత సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తోన్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. -
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
ధోనీని రనౌట్ చేసిన వికెట్ కీపర్ జితేశ్ శర్మపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. అతడి ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. -
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి