BCCI: బీసీసీఐ ‘దేశవాళీ’ నిర్ణయం.. కుర్రాళ్లకు గుణపాఠం
ఒకటీ, రెండు మ్యాచ్లు ఆడగానే.. తామే స్టార్లుగా భావించే ఆటగాళ్లు ఇటీవల ఎక్కువైపోయారు. అలాంటివారికి బీసీసీఐ షాక్ ఇచ్చింది.
భారత జట్టులో స్థానం ప్రతీ క్రికెటర్కు పెద్ద కల. ఎన్నో కష్టాలు.. ఎంతో పోటీని తట్టుకుని ఎట్టకేలకు చోటు దక్కించుకుంటున్నారు కుర్రాళ్లు. కానీ జట్టులోకి వచ్చాక చాలామందిలో అప్పటివరకు ఉన్న కమిట్మెంట్ మాయమైపోతుంది. వారి ఆటలో మార్పు వస్తుంది. ప్రవర్తనలో తేడా వస్తుంది. మొత్తానికే కెరీరే దెబ్బ తింటోంది. ఇటీవల కుర్ర క్రికెటర్లను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. క్రమశిక్షణ లోపించడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పోగొట్టుకున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లే ఇందుకు ఉదాహరణ. నిబంధనలు మీరితే మున్ముందు కఠిన శిక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుందని బీసీసీఐ ఈ సంఘటనతో తెలియజేసింది.
రంజీలు ఆడకపోతే
అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో దేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో ఆడాలన్నది బీసీసీఐ నిబంధన. కానీ ప్రస్తుత తరం క్రికెటర్లు ఈ నిబంధనను పట్టించుకోవట్లేదు. కాస్త పేరు రాగానే.. కొంచెం బిజీ కాగానే తాము పెద్ద క్రికెటర్లన్న భావనలో ఉంటున్న యువ ఆటగాళ్లు రంజీని చిన్నచూపు చూస్తున్నారు. ఇటీవల ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల ప్రవర్తనే ఇందుకు నిదర్శనం. దక్షిణాఫ్రికా పర్యటనలో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వస్తున్నట్లు చెప్పిన ఇషాన్ కిషన్.. దుబాయ్లో పార్టీలో కనబడడం బీసీసీఐకి ఆగ్రహాన్ని తెప్పించింది. మరోవైపు గాయం పేరుతో స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్కు దూరమయ్యాడు శ్రేయస్ అయ్యర్. కానీ శ్రేయస్కు గాయం సమస్య ఏమీ లేదని ఎన్సీఏ ఫిజియో చెప్పడం చర్చనీయాంశమైంది. జాతీయ జట్టులోకి రావాలంటే ఫామ్ నిరూపించుకోవాలనే నిబంధనను ఈ యువ ఆటగాడు ఉల్లంఘించాడు. దీనికితోడు రంజీల్లో ఆడాలని బీసీసీఐ పెద్దలు చెప్పిన మాటలను కూడా ఇషాన్, శ్రేయస్ పెడచెవిన పెట్టారు. పైగా హార్దిక్ పాండ్యతో కలిసి ఐపీఎల్ శిక్షణలో పాల్గొనడం ఇషాన్పై నెగెటివిటీని పెంచింది. ఇవన్నీ కలిసి ఈ స్టార్ క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్ట్ను పోగొట్టుకునేందుకు కారణమయ్యాయి.
ఒకప్పుడు అలా..
భారత్లోనే అత్యున్నత దేశవాళీ టోర్నీ రంజీ. ఇందులో ఆడటాన్ని ఏ క్రికెటర్ అయినా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. కానీ నేటితరం కుర్ర క్రికెటర్ల ఆలోచనలు వేరేలా ఉంటున్నాయి. పేరు, పలుకుబడి సంపాదించాక జూనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నామోషీగా భావిస్తున్నారు. రంజీల్లో దిగితే ఏదో లెవల్ పడిపోయినట్లుగా అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు సునీల్ గావస్కర్, సచిన్ తెందుల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు రంజీలు ఆడటాన్ని ఎంతో ఆస్వాదించేవాళ్లు. యువ ఆటగాళ్లకు తమ అనుభవాన్ని పంచుతూ ఫామ్ను నిరూపించుకునేవాళ్లు. కెరీర్ చివరిలో కూడా గంగూలీ రంజీ మ్యాచ్లు ఆడి భారత జట్టులోకి వచ్చాడు. ఈ తరం క్రికెటర్లలో ఆ కాంక్ష తగ్గిపోయింది. డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది. ఐపీఎల్ పుణ్యమా అని ఒక్క దేశవాళీ మ్యాచ్ ఆడకపోయినా జాతీయ జట్టుకు ఆడే అదృష్టాన్ని దక్కించుకుంటున్నారు కుర్రాళ్లు. కానీ ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోగా.. అనవసర పోకడలతో కెరీర్లను ముగిస్తున్నారు. పృథ్వీ షా కూడా ఈ కోవకు చెందినవాడే. ఎంతో ప్రతిభావంతుడైన ఈ ఓపెనర్.. ఆటేతర వివాదాలతో గాడి తప్పాడు. బరువు పెరిగిపోయి.. ఆట తగ్గిపోయి తెరమరుగయ్యే పరిస్థితికి వచ్చాడు.
ఒకప్పుడు జాతీయ జట్టులో స్థానం దక్కకపోతే రంజీల్లో రాణించి సెలక్టర్లపై ఒత్తిడి పెంచేవాళ్లు. అయితే ఇప్పుడు కుర్రాళ్లు మాత్రం ఐపీఎల్లో రాణించడంపైనే దృష్టి పెడుతున్నారు. నిజానికి ఐపీఎల్ అసలైన సత్తాకు పరీక్షగా నిలవదు. నాలుగురోజుల దేశవాళీ ఫార్మాట్లోనే ఫామ్ ఎలా ఉందో తెలుస్తుంది. కానీ కుర్రాళ్లు ఈ బేసిక్ విషయాన్ని మరిచిపోయి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా శ్రేయస్, ఇషాన్ల సంఘటనతోనైనా మిగిలిన కుర్రాళ్లు జాగ్రత్త పడడం అవసరం. భారత జట్టులో అవకాశం అంటే తేలిక కాదు అని తెలుసుకోవడం అత్యవసరం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్