BCCI: బీసీసీఐ ‘దేశవాళీ’ నిర్ణయం.. కుర్రాళ్లకు గుణపాఠం
ఒకటీ, రెండు మ్యాచ్లు ఆడగానే.. తామే స్టార్లుగా భావించే ఆటగాళ్లు ఇటీవల ఎక్కువైపోయారు. అలాంటివారికి బీసీసీఐ షాక్ ఇచ్చింది.
భారత జట్టులో స్థానం ప్రతీ క్రికెటర్కు పెద్ద కల. ఎన్నో కష్టాలు.. ఎంతో పోటీని తట్టుకుని ఎట్టకేలకు చోటు దక్కించుకుంటున్నారు కుర్రాళ్లు. కానీ జట్టులోకి వచ్చాక చాలామందిలో అప్పటివరకు ఉన్న కమిట్మెంట్ మాయమైపోతుంది. వారి ఆటలో మార్పు వస్తుంది. ప్రవర్తనలో తేడా వస్తుంది. మొత్తానికే కెరీరే దెబ్బ తింటోంది. ఇటీవల కుర్ర క్రికెటర్లను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. క్రమశిక్షణ లోపించడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పోగొట్టుకున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లే ఇందుకు ఉదాహరణ. నిబంధనలు మీరితే మున్ముందు కఠిన శిక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుందని బీసీసీఐ ఈ సంఘటనతో తెలియజేసింది.
రంజీలు ఆడకపోతే
అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో దేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో ఆడాలన్నది బీసీసీఐ నిబంధన. కానీ ప్రస్తుత తరం క్రికెటర్లు ఈ నిబంధనను పట్టించుకోవట్లేదు. కాస్త పేరు రాగానే.. కొంచెం బిజీ కాగానే తాము పెద్ద క్రికెటర్లన్న భావనలో ఉంటున్న యువ ఆటగాళ్లు రంజీని చిన్నచూపు చూస్తున్నారు. ఇటీవల ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల ప్రవర్తనే ఇందుకు నిదర్శనం. దక్షిణాఫ్రికా పర్యటనలో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వస్తున్నట్లు చెప్పిన ఇషాన్ కిషన్.. దుబాయ్లో పార్టీలో కనబడడం బీసీసీఐకి ఆగ్రహాన్ని తెప్పించింది. మరోవైపు గాయం పేరుతో స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్కు దూరమయ్యాడు శ్రేయస్ అయ్యర్. కానీ శ్రేయస్కు గాయం సమస్య ఏమీ లేదని ఎన్సీఏ ఫిజియో చెప్పడం చర్చనీయాంశమైంది. జాతీయ జట్టులోకి రావాలంటే ఫామ్ నిరూపించుకోవాలనే నిబంధనను ఈ యువ ఆటగాడు ఉల్లంఘించాడు. దీనికితోడు రంజీల్లో ఆడాలని బీసీసీఐ పెద్దలు చెప్పిన మాటలను కూడా ఇషాన్, శ్రేయస్ పెడచెవిన పెట్టారు. పైగా హార్దిక్ పాండ్యతో కలిసి ఐపీఎల్ శిక్షణలో పాల్గొనడం ఇషాన్పై నెగెటివిటీని పెంచింది. ఇవన్నీ కలిసి ఈ స్టార్ క్రికెటర్లు సెంట్రల్ కాంట్రాక్ట్ను పోగొట్టుకునేందుకు కారణమయ్యాయి.
ఒకప్పుడు అలా..
భారత్లోనే అత్యున్నత దేశవాళీ టోర్నీ రంజీ. ఇందులో ఆడటాన్ని ఏ క్రికెటర్ అయినా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. కానీ నేటితరం కుర్ర క్రికెటర్ల ఆలోచనలు వేరేలా ఉంటున్నాయి. పేరు, పలుకుబడి సంపాదించాక జూనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నామోషీగా భావిస్తున్నారు. రంజీల్లో దిగితే ఏదో లెవల్ పడిపోయినట్లుగా అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు సునీల్ గావస్కర్, సచిన్ తెందుల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు రంజీలు ఆడటాన్ని ఎంతో ఆస్వాదించేవాళ్లు. యువ ఆటగాళ్లకు తమ అనుభవాన్ని పంచుతూ ఫామ్ను నిరూపించుకునేవాళ్లు. కెరీర్ చివరిలో కూడా గంగూలీ రంజీ మ్యాచ్లు ఆడి భారత జట్టులోకి వచ్చాడు. ఈ తరం క్రికెటర్లలో ఆ కాంక్ష తగ్గిపోయింది. డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది. ఐపీఎల్ పుణ్యమా అని ఒక్క దేశవాళీ మ్యాచ్ ఆడకపోయినా జాతీయ జట్టుకు ఆడే అదృష్టాన్ని దక్కించుకుంటున్నారు కుర్రాళ్లు. కానీ ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోగా.. అనవసర పోకడలతో కెరీర్లను ముగిస్తున్నారు. పృథ్వీ షా కూడా ఈ కోవకు చెందినవాడే. ఎంతో ప్రతిభావంతుడైన ఈ ఓపెనర్.. ఆటేతర వివాదాలతో గాడి తప్పాడు. బరువు పెరిగిపోయి.. ఆట తగ్గిపోయి తెరమరుగయ్యే పరిస్థితికి వచ్చాడు.
ఒకప్పుడు జాతీయ జట్టులో స్థానం దక్కకపోతే రంజీల్లో రాణించి సెలక్టర్లపై ఒత్తిడి పెంచేవాళ్లు. అయితే ఇప్పుడు కుర్రాళ్లు మాత్రం ఐపీఎల్లో రాణించడంపైనే దృష్టి పెడుతున్నారు. నిజానికి ఐపీఎల్ అసలైన సత్తాకు పరీక్షగా నిలవదు. నాలుగురోజుల దేశవాళీ ఫార్మాట్లోనే ఫామ్ ఎలా ఉందో తెలుస్తుంది. కానీ కుర్రాళ్లు ఈ బేసిక్ విషయాన్ని మరిచిపోయి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా శ్రేయస్, ఇషాన్ల సంఘటనతోనైనా మిగిలిన కుర్రాళ్లు జాగ్రత్త పడడం అవసరం. భారత జట్టులో అవకాశం అంటే తేలిక కాదు అని తెలుసుకోవడం అత్యవసరం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్