Apple: యాపిల్‌ పరికరాలకు కొత్త ఎం5 చిప్‌ శోభ

Eenadu icon
By Technology News Team Published : 22 Oct 2025 04:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

యాపిల్‌ సంస్థ ఐప్యాడ్‌ ప్రొ, విజన్‌ ప్రొ, మ్యాక్‌బుక్‌ ప్రొ కొత్త మోడళ్లను పరిచయం చేసింది. ఇవన్నీ కొత్త ఎం5 చిప్‌తో కూడుకొని ఉండటం విశేషం. ఎం4 చిప్‌ కన్నా ఇది మరింత వేగంగా పరికరాలు పనిచేసేలా చూస్తుంది. థర్డ్‌ జనరేషన్‌ 3-నానో మీటర్‌ టెక్నాలజీ సాయంతో రూపొందించిన ఈ చిప్‌ ప్రతి కోర్‌లో న్యూరల్‌ యాక్సిలరేటర్‌తో కూడిన 10-కోర్‌ జీపీయూ ఆర్కిటెక్చర్‌ను పొందుపరుస్తుంది. దీంతో ఏఐ పనులు నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో పూర్తవుతాయి. ఈ పరికరాల అమ్మకాలు నేటి నుంచి మొదలవుతాయి.

  • అల్ట్రా రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, ఐప్యాడ్‌ఓఎస్‌ 26 ఫీచర్లతో ఐప్యాడ్‌ ప్రొ కనువిందు చేస్తోంది. స్పేస్‌ బ్లాక్, సిల్వర్‌ రంగుల్లో ఆకర్షిస్తోన్న ఇది 11-13 అంగుళాల వేరియెంట్స్‌లో లభిస్తుంది. ధర రూ.99,990 నుంచి ప్రారంభం.
  • విజన్‌ఓఎస్‌ 26 వినూత్న ఫీచర్లతో విజన్‌ ప్రొ అలరిస్తోంది. మెరుగైన సామర్థ్యంతో పాటు డిస్‌ప్లే రెండరింగ్, కొత్త స్పేషియల్‌ యాప్స్, యాపిల్‌ ఇమ్మర్సివ్‌ కంటెంట్‌ వంటి ఫీచర్లు కలిగుంది. బ్యాటరీని ఒకసారి ఛార్జ్‌ చేస్తే రెండున్నర గంటల సేపు వాడుకోవచ్చు. ధర రూ.3,499 అమెరికా డాలర్లు. 
  • వినూత్న ఏఐ సామర్థ్యాలు గల 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రొ.. నానోటెక్చర్‌ ఆప్షన్‌తో కూడిన లిక్విడ్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, 12ఎంపీ సెంటర్‌ స్టేజ్‌ కెమెరా, ఆరు స్పీకర్ల సౌండ్‌ సిస్టమ్‌ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు