Poco: పోకో ఎం7 ప్లస్‌ కొత్త రకం

Eenadu icon
By Technology News Desk Published : 17 Sep 2025 00:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పోకో సంస్థ ఇటీవల పరిచయం చేసిన ఎం7 ప్లస్‌ 5జీ ఫోన్లలో తాజాగా కొత్తరకాన్ని ప్రకటించింది. చవకగా 4జీబీ ర్యామ్‌ పరికరాన్ని తీసుకొచ్చింది. అంటే 6జీబీ, 8జీబీ ర్యామ్‌ రకాలతో పాటు ఇదీ అందుబాటులో ఉంటుదన్నమాట. స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జెన్‌ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత హైపర్‌ఓఎస్‌ 2.0తో పనిచేసే దీనికి రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌గ్రేడ్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందుతాయి. 144హెచ్‌జడ్‌ వరకూ రిఫ్రెష్‌ వేగంతో కూడిన 6.9 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే.. వెనకాల 50 మెగాపిక్సెల్‌ మెయిన్‌ సెన్సర్, ఏఐ ఆధారిత సెకండరీ లెన్స్‌తో కూడిన రెండు కెమెరాల వ్యవస్థ.. ముందు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 ఎంపీ కెమెరా.. 33డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు గల 7,000 ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీ.. 18డబ్ల్యూ రివర్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌.. దుమ్ము, నీటిని తట్టుకోవటంలో ఐపీ64 రేటింగ్‌ వంటి ఫీచర్లతో అలరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు