అంగూరీబాయి ముందస్తు నిర్బంధాన్ని సమర్థించిన హైకోర్టు

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 04:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: గంజాయి వినియోగం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని, దీనికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ గంజాయి వ్యాపారి అంగూరీబాయి అలియాస్‌ అరుణాబాయిను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం సబబేనని హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీయడం అంటే శాంతిభద్రతలకు భంగం కలిగించడమేనన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. అక్రమ నిర్బంధంలోకి తీసుకున్న అంగూరీబాయిను కోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలంటూ ఆమె కుమార్తె రోషిణిదేవి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్‌ ఊరిళ్ల వాదనలు వినిపిస్తూ ధూల్‌పేటకు చెందిన అంగూరీబాయిపై గంజాయి విక్రయంపై ఇప్పటికే 25కిపైగా కేసులున్నాయన్నారు. బెయిలుపై బయటికి వచ్చిన వెంటనే ఆమె మళ్లీ నేరానికి పాల్పడుతున్నారన్నారు. ముందస్తు నిర్బంధంలోకి తీసుకుంటూ కలెక్టర్‌ మార్చి 10న ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని