జేఈఈలో కాలిక్యులేటర్‌కు అనుమతి లేదు: ఎన్‌టీఏ

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 04:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌లో ఏ రూపంలోనూ కాలిక్యులేటర్‌ను అనుమతించబోమని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌కు సంబంధించి శుక్రవారం అర్ధరాత్రి వెబ్‌సైట్‌లో సమాచార పత్రాన్ని పెట్టిన ఎన్‌టీఏ.. అందులో వర్చువల్‌ కాలిక్యులేటర్‌ వినియోగించుకోవచ్చని పేర్కొంది. తాజాగా ఆదివారం దానిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. సమాచార పత్రంలో పొరపాటు దొర్లిందని, ఎటువంటి కాలిక్యులేటర్‌ను అనుమతించడం లేదని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు