42% రిజర్వేషన్ల సాధనకు ‘అష్టాంగ’ ఆందోళనలు
డిసెంబరు తొలివారంలో పార్లమెంటు ముట్టడి
బీసీ ఐకాస విస్తృతస్థాయి సమావేశంలో నేతల నిర్ణయం 

ఐక్యత చాటుతున్న సురేష్, జాజుల శ్రీనివాస్గౌడ్, ఆర్.నారాయణమూర్తి, ఈటల, వీహెచ్, అయిలయ్య, జూలూరు గౌరీశంకర్, ప్రభాకర్ తదితరులు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు ఈ నెల 6 నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు బీసీ ఐకాస నేతలు వెల్లడించారు. వచ్చే 3 నెలలపాటు గల్లీ నుంచి దిల్లీ వరకు 8 రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందుకు గౌతమ బుద్ధుడి స్ఫూర్తితో ‘అష్టాంగ’ ఆందోళనలుగా నామకరణం చేశామని తెలిపారు. బీసీ ఉద్యమ కార్యాచరణపై ఆదివారం బంజారాహిల్స్లోని కళింగ భవనంలో ఐకాస, పలు పార్టీల నేతల రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం బీసీ ఐకాస వర్కింగ్ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఈ ఉద్యమంతో బీసీలందరికీ తెలంగాణ దిక్సూచిగా మారనుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో క్రమంగా ఐక్యత పెరుగుతోందన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో, ప్రత్యేక తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టేలా ఎంపీలపై ఒత్తిడి తేవాలని సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ఉద్యమాలకు దళితుల నుంచి మద్దతు ఉంటుందని, వ్యక్తిగతంగా కాకుండా బీసీ సమాజం కోసం పోరాడినప్పుడే రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఐకాసను సమర్థంగా నిర్వహించాలని, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. జాజుల శ్రీనివాస్గౌడ్ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సమావేశంలో బీసీ ఐకాస కోఛైర్మన్ దాసు సురేశ్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, సినీ దర్శకులు ఆర్.నారాయణమూర్తి, ఎన్.శంకర్, 90 బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ కార్యాచరణ..
నవంబరు 6న రాష్ట్రవ్యాప్తంగా ఫులే విగ్రహాల ముందు బీసీల మౌన దీక్ష, 13న సామాజిక న్యాయ సాధనకు పల్లె నుంచి పట్నం వరకు ‘బీసీల ధర్మ పోరాట దీక్షలు, 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలపై ఒత్తిడి పెంచడానికి 18న ఎంపీలతో బీసీల ములాఖత్, 23న అఖిలపక్ష పార్టీల సమావేశం, డిసెంబరు మొదటివారంలో బీసీల చలో దిల్లీ, పార్లమెంటు ముట్టడి, మూడోవారం నుంచి పల్లె నుంచి పట్నం వరకు బస్సుయాత్ర, జనవరి నాలుగోవారంలో చలో హైదరాబాద్, వేల వృత్తులు-కోట్ల గొంతులు పేరుతో భారీ బహిరంగ సభ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అధిక వేగంతోనే 84% ప్రమాదాలు
వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి... మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి... అనేక కుటుంబాల్ని రోడ్డుపాలు చేస్తున్నాయి... 2024లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 84 శాతం ఘటనలకు ఇవే కారణమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. - 
                                    
                                        

69 కి.మీ.. 50 మృత్యు మలుపులు
69 కిలోమీటర్ల దూరం.. ఐదేళ్లలో 720 ప్రమాదాలు.. 211 మంది మృతి... 737 మంది క్షతగాత్రులు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నవారు వేలల్లో.. ఇది హైదరాబాద్- బీజాపూర్ (విజయపుర) జాతీయ రహదారి రక్తచరిత్ర. - 
                                    
                                        

తెలంగాణలో 47.6% ఉపాధి హామీ పనిదినాల తగ్గుదల
తెలంగాణలో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 47.6% పనిదినాలు తగ్గినట్లు లిబ్టెక్ ఇండియా అధ్యయన నివేదిక వెల్లడించింది. - 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్బాబు అన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే వైద్య చికిత్సలను చేయిస్తుందన్నారు. - 
                                    
                                        

మిగులు టీచర్లు... 10 వేల మంది!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 వేల మంది మిగులు ఉపాధ్యాయులున్నారని పాఠశాల విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 24,238 పాఠశాలలు ఉండగా... 1.08 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. - 
                                    
                                        

ముడుపులు ఇచ్చిన.. పుచ్చుకున్నవారిపైనా చర్యలు
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ముడుపులు ఇచ్చినవారిపైనా.. పుచ్చుకున్నవారిపైనా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. - 
                                    
                                        

ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారు?
మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం చేస్తూ కేటీఆర్ పగటి కలలు కంటున్నారని.. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ సీఎం ఎలా అవుతారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. - 
                                    
                                        

ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే అందర్నీ మోసం చేశారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రేవంత్రెడ్డికి అందర్నీ మోసం చేశారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. - 
                                    
                                        

కోకాపేట.. ఎకరం రూ. 99 కోట్లు!
హెచ్ఎండీఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తరం
జూబ్లీహిల్స్ అమాత్యుల అడ్డాగా మారింది. రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ అధిష్ఠానం నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. - 
                                    
                                        

ఎస్ఎల్బీసీ పూర్తిచేసి తీరతాం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ)ను పూర్తిచేస్తే కాంగ్రెస్కు పేరొస్తుందనే రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్, హరీశ్లు ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. - 
                                    
                                        

మృత్యు ప్రయాణం
కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు.. వ్యాపార పనులకోసం కొందరు.. ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఇంకొందరు.. సెలవులకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మరికొందరు.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


