గురువు పాటవం.. గోడలూ చెబుతాయి పాఠం

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 04:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పాఠాలు చెప్పి వదిలేయకుండా ఆయా అంశాలకు సంబంధించిన బొమ్మలను తరగతి గదిలో గోడలపై స్వయంగా వేస్తూ విద్యార్థులకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండలం గొరిట జడ్పీ ఉన్నత పాఠశాలలో  జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రాచర్ల నరేందర్‌. 1998 నుంచి ఇప్పటివరకు ఆయన పనిచేసిన ఐదు బడులను ఇలా రంగులతో మార్చారు.  తరగతి గదులు, వరండాల్లో పుస్తకాల్లోని అంశాలు, స్వాతంత్య్ర సమరయోధులు, మేధావుల బొమ్మలు వేశారు. ఇదంతా సెలవు రోజులు, పాఠశాల ముగిసిన తర్వాతే చేస్తారు. ఇప్పటివరకు రంగులకు దాదాపు రూ.2 లక్షలు వెచ్చించినట్లు ఆయన చెబుతున్నారు.

న్యూస్‌టుడే, తిమ్మాజీపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు