భూగర్భ జలాలు గలగల..

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

గతేడాదితో పోలిస్తే 29 జిల్లాల్లో పెరుగుదల
కామారెడ్డిలో అత్యధికంగా 3.74 మీటర్లు పైకి

ఈనాడు, హైదరాబాద్‌: కుంభవృష్టి వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచి అక్టోబరు వరకు రాష్ట్ర సాధారణ వర్షం 831 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 1,164 మి.మీ. కురిసింది. ఏకంగా 40% అధిక వర్షపాతం నమోదైంది. 29 జిల్లాల్లో సాధారణంకన్నా అధికంగా కురిశాయి. మొత్తం 33 జిల్లాలకు గాను 2024 అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో 29 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో పెరుగుదల నమోదైంది. వీటిలో అత్యధికంగా కామారెడ్డిలో 3.74 మీటర్లు పైకొచ్చాయి. నాలుగు జిల్లాల్లో మాత్రం జలమట్టాలు మరింత కిందకు పడిపోయాయి. అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 0.38 మీటర్లు కిందకు పడిపోయినట్లు భూగర్భ జలశాఖ అధ్యయనంలో గుర్తించింది. 

  • అతితక్కువగా సగటున 2 మీటర్లలోనే మహబూబ్‌నగర్‌ జిల్లాలో భూగర్భ జలాలున్నాయి.
  • మొత్తం 19 జిల్లాల్లో సగటున 5 మీటర్లలోపే ఉన్నట్లు తేలింది.
  • మే నెలకన్నా అక్టోబరులో సగటున రాష్ట్రవ్యాప్తంగా 5.65 మీటర్లు పైకొచ్చాయి. ఈ విషయంలో అత్యధికంగా వికారాబాద్‌ జిల్లాలో ఏకంగా 9.27 మీటర్లు పైకి రావడం విశేషం. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం రాష్ట్ర సగటుకన్నా తక్కువగా 2.37 మీటర్లు మాత్రమే మే నెలకన్నా పైకొచ్చాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు