గోల్ఫ్‌ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణం: మంత్రి జూపల్లి

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 05:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఐజీఎఫ్‌ఆర్‌ అధ్యక్షుడు రాబర్ట్‌ను సన్మానిస్తున్న మంత్రి జూపల్లి

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ గోల్ఫ్‌ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తెలంగాణకు రావడం గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో 60వ ఐజీఎఫ్‌ఆర్‌ (ఇంటర్నేషనల్‌ గోల్ఫింగ్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ రోటేరియన్స్‌) అంతర్జాతీయ గోల్ఫ్‌ ఛాంపియన్‌ షిప్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘‘వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్‌ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రసూతి, శిశు, ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో అద్భుతమైన ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోట వంటి పర్యాటక ప్రాంతాలను ఈ ఛాంపియన్‌ షిప్‌లో భాగస్వామ్యం చేశాం. క్రీడలతో పర్యాటకం అభివృద్ధి ముడిపడి ఉంది. గోల్ఫ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు