KTR: పెద్దవాళ్ల భవంతులు, ఫామ్‌హౌస్‌లు కూల్చే ధైర్యం హైడ్రాకు లేదు: కేటీఆర్‌

Eenadu icon
By Telangana News Team Published : 02 Nov 2025 13:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం నినాదంతో హైడ్రా వెళ్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) విమర్శించారు. హైడ్రా చర్యలపై తెలంగాణ భవన్‌లో ఆయన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయని.. ఇప్పుడు పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం హయాంలో సచివాలయం, టీహబ్‌, వీహబ్‌, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు నిర్మించామన్నారు. 

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాం. మంత్రి పొంగులేటి చెరువును పూడ్చి ఇల్లు కడితే.. ఎందుకు కూల్చలేదు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో మంత్రి వివేక్‌ ఇల్లు కూల్చే ధైర్యం ఉందా? సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉంది. ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేందుకు హైడ్రా సమయం ఇచ్చింది. పేదలు ఇళ్లను కూల్చివేసిన అధికారులు.. పెద్దవాళ్లు భవంతులు, ఫామ్‌హౌస్‌లు నిర్మిస్తే వాటి జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. గాజులరామారంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్థలం జోలికి వెళ్లలేదు. అదే గాజుల రామారంలోనే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు, పోలీసులను పంపారు’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు