MLC Kavitha: బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత

Eenadu icon
By Telangana News Team Published : 29 Jul 2025 11:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: బీసీ బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేయనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయనున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి  ఉంటే.. అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి దిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దిల్లీలో తలపెట్టిన ధర్నా కేవలం బిహార్‌ ఎన్నికలను దృష్టి పెట్టుకుని చేస్తున్న డ్రామా అని విమర్శించారు. బీసీ బిల్లు విషయంలో చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ సాగదీత ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు. భాజపా నేతలు బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు