Kavitha: నిరాహార దీక్షకు అనుమతివ్వని పోలీసులు.. హైకోర్టుకు ఎమ్మెల్సీ కవిత?

Eenadu icon
By Telangana News Team Published : 01 Aug 2025 20:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా 72 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం అడ్డుకున్నా.. ఎన్ని ఆటంకాలు సృష్టించినా 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని కవిత స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని