Telangana Inter Result: ఇంటర్ ఫస్టియర్లో ఉత్తీర్ణత 49 శాతమే
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది
4.59 లక్షలకు 2.24 లక్షల మంది పాస్
గతంతో పోల్చుకుంటే 11 శాతం తక్కువ
నేటి సాయంత్రం 5 నుంచి వెబ్సైట్లో మెమోలు
పునఃమూల్యాంకనానికి తుది గడువు ఈ నెల 22
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా తగ్గిపోయింది. ఈసారి జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 60.01 కాగా ఈ ఏడాది 11 శాతం తగ్గింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాలను ఇంటర్బోర్డు గురువారం వెల్లడించింది. మొత్తం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్, ఒకేషనల్... రెండింటిలోనూ ఉత్తీర్ణత శాతం సమానంగా రావడం గమనార్హం.
పరీక్షలపై అస్పష్టతే కారణం!
గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి పరీక్షలపై అస్పష్టతే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2020-21 విద్యా సంవత్సరంలో నెలన్నర తప్ప మిగిలిన రోజుల్లో ఆన్లైన్ తరగతులే జరిగాయి. గత ఏడాదికి సంబంధించి మే నెలలో పరీక్షలు జరగాల్సి ఉండగా...కరోనా రెండో వేవ్ కారణంగా విద్యార్థులను రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేశారు. భవిష్యత్తు పరిస్థితులను బట్టి తొలి ఏడాది విద్యార్థులకు పరీక్షలు జరుపుతామని గత ఏప్రిల్లో ప్రభుత్వం ప్రకటించింది. దాంతో విద్యార్థులు పరీక్షలు ఉండనట్లేనని భావించి చదువుకు దూరమయ్యారు. పరీక్షలు ఉంటాయన్న స్పష్టత ఇవ్వకుండా విద్యాశాఖ అక్టోబరు 27 నుంచి నిర్వహించింది. అప్పటికే రెండో ఏడాది చదువులో నిమగ్నమైన విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితంగా భారీగా ఉత్తీర్ణత శాతం పడిపోయింది.
తప్పులుంటే 31లోగా ప్రిన్సిపాళ్ల దృష్టికి తీసుకెళ్లాలి
పునఃలెక్కింపు, పునఃమూల్యాంకనం కోసం ఈనెల 22వ తేదీలోపు ఇంటర్బోర్డు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తిరిగి లెక్కింపు కోసం సబ్జెక్టుకు రూ.100, పునఃమూల్యాంకనానికి రూ.600 చొప్పున ఫీజు చెల్లించాలి. పునః లెక్కింపు అంటే మార్కుల కూడికలో తేడాలుంటే పరిశీలిస్తారు. పునఃమూల్యాంకనంలో సబ్జెక్టు నిపుణుడితో మరోసారి మూల్యాంకనం చేయిస్తారు. విద్యార్థుల జవాబుపత్రం స్కానింగ్ కాపీని పంపిస్తారు. ఆ పత్రాలను ఇంటర్బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్కుల మెమోల్లో తప్పులుంటే విద్యార్థులు వారి చదివే కళాశాలల ప్రిన్సిపాళ్ల దృష్టికి ఈనెల 31వ తేదీలోపు తీసుకువెళ్లాలని బోర్డు తెలిపింది. మార్కుల మెమోలను ఈ నెల 17న సాయంత్రం 5 గంటల నుంచి వెబ్సైట్లో ఉంచుతామని పేర్కొంది.
మేడ్చల్లో అత్యధికం... మెదక్లో అత్యల్పం
ఈసారి మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 63 శాతం ఉత్తీర్ణత దక్కింది. ఆ తర్వాత ములుగు జిల్లాలో 61 శాతం మంది పాసయ్యారు. అత్యల్పంగా మెదక్ జిల్లాలో 22 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు.
సైకాలజిస్టులు మీ కోసమే
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న ఒత్తిడి, ఆందోళన, భయం తొలగించడానికి ఏడుగురు సైకాలజిస్టులు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్లలో అందుబాటులో ఉంటారని ఇంటర్బోర్డు తెలిపింది.
పి.జవహర్లాల్ నెహ్రు- 91549 51699, రజని- 91549 51695, ఎస్.శ్రీలత- 91549 51703, శైలజా పీసపాటి- 91549 51706, జి.అనుపమ- 91549 51687, మజ్హర్ అలీ- 91549 51977
ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత ఎంత?
గత ఏడాది వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, వివిధ రకాల గురుకుల యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణత శాతం ఎంత అన్న గణాంకాలు ఇచ్చే ఇంటర్బోర్డు ఈసారి ఇవ్వకపోవడం గమనార్హం. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత 30 శాతంలోపే ఉందని సమాచారం. అందువల్లనే ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయలేదని పలువురు భావిస్తున్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు లేనట్లే!
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తప్పిన విద్యార్థులకు ఇక సప్లిమెంటరీ పరీక్షలు లేనట్లే. ఈసారి కరోనా కారణంగా ఆర్నెల్లు ఆలస్యంగా పరీక్షలు జరపగా 51 శాతం మంది తప్పారు. వారికి సప్లిమెంటరీ పరీక్షలు జరుపుతామని ఇంటర్బోర్డు ప్రకటించలేదు. తప్పిన విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల సందర్భంగా రాసుకోవాల్సిందే. అప్పుడు ఫస్టియర్లో తప్పిన సబ్జెక్టులతో పాటు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయాలి.
అందరికీ పాస్ మార్కులు ఇవ్వాలి: టీపీఏ
ఇంటర్ ఫస్టియర్లో సబ్జెక్టులు తప్పిన విద్యార్థులు ప్రస్తుతం సెకండియర్లో ఉన్నందున వారికి కనీస పాస్ మార్కులు ఇవ్వాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ, ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ
వచ్చే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రైతాంగ సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
సెప్టెంబరు 15లోపు ఇంజినీరింగ్ తరగతులు
వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. -
వైద్యుడిగా పేరు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ డా.బల్మూరి వెంకట్ తెలంగాణ వైద్య మండలి (టీఎంసీఐ)లో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఆయన కరీంనగర్లోని చల్మెడ వైద్య కళాశాలలో 2021లో ఎంబీబీఎస్, 2022లో అదే కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. -
తూర్పు కనుమల్లోని 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి
తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ(ఈ-డీఎన్ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు. -
జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
గురుకుల ‘జూనియర్’ ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో 15 వరకు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెం.మీ., సత్తుపల్లిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఇలినోయీలో ప్రభాకర్రావు.. మియామీలో శ్రవణ్రావు
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
నోముల భగత్ క్వార్టర్కు సీల్ తొలగింపుపై అప్పీలు ఉపసంహరణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వార్టర్ (ఈఈ/19)కు వేసిన సీల్ను 48 గంటల్లో తొలగించాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఉపసంహరించుకుంది. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. -
నేటితో ముగియనున్న ఎప్సెట్
రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ (ఇంజినీరింగ్) విభాగం పరీక్షలు శనివారం ఉదయం విడతతో ముగియనున్నాయి. రెండో రోజు ఉదయం విడతలో 94.3 శాతం, మధ్యాహ్నం విడతలో 94.8 శాతం మంది హాజరయ్యారు. -
వారంలో మేడిగడ్డపై నిపుణుల కమిటీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిసారించాలంటూ జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. -
మన్నె క్రిశాంక్కు బెయిల్.. జైలు నుంచి విడుదల
‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?