TS News: ‘ఎసైన్డ్’ స్వాహా!
మహబూబ్‘నగర్’ చుట్టూ ఉన్న ఎసైన్డ్ భూములు.. కనుమరుగవుతున్నాయి. స్థిరాస్తుల ధరలు భారీగా పెరగడంతో దళారుల చూపు వాటిపై పడింది. పేదరైతుల నుంచి ఎకరాల చొప్పున తక్కువ ధరకే గుంజు‘కొని’ వాటిని అభివృద్ధి చేస్తున్నారు. ఆపై గజాల లెక్కన విభజిస్తున్నారు. వాటినే రూ.కోట్లకు విక్రయిస్తున్నారు. ఇలా రూ.500 కోట్లకుపైగా ఖరీదైన భూములు చేతులు మారినట్లు తెలుస్తుంది. నిర్మించుకునే భవనాలకు సైతం అన్ని అనుమతులూ దళారులే ఇప్పిస్తున్నారు.
దళారుల చెరలో రూ.500 కోట్ల విలువైన సర్కారు భూములు
మహబూబ్నగర్ చుట్టూ ఆక్రమణల దందా
చోద్యం చూస్తున్న ప్రభుత్వ శాఖలు
మహబూబ్‘నగర్’ చుట్టూ ఉన్న ఎసైన్డ్ భూములు.. కనుమరుగవుతున్నాయి. స్థిరాస్తుల ధరలు భారీగా పెరగడంతో దళారుల చూపు వాటిపై పడింది. పేదరైతుల నుంచి ఎకరాల చొప్పున తక్కువ ధరకే గుంజు‘కొని’ వాటిని అభివృద్ధి చేస్తున్నారు. ఆపై గజాల లెక్కన విభజిస్తున్నారు. వాటినే రూ.కోట్లకు విక్రయిస్తున్నారు. ఇలా రూ.500 కోట్లకుపైగా ఖరీదైన భూములు చేతులు మారినట్లు తెలుస్తుంది. నిర్మించుకునే భవనాలకు సైతం అన్ని అనుమతులూ దళారులే ఇప్పిస్తున్నారు.
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్, ఈనాడు, హైదరాబాద్: పేదలకు ప్రభుత్వం పంచిన భూములను కొందరు ఫలహారం చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారం ముసుగులో కొందరు ఉండగా, మరికొందరు దళారులుగా అవతారమెత్తి ప్రభుత్వ భూములకు అక్రమంగా అనుమతులు తెచ్చిపెడుతున్నారు. నగర శివార్లలో వందల ఎకరాలు పలువురు నాయకులు, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయి. ఎసైన్డ్ పోను మిగిలిన స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. కొత్త కలెక్టరేట్, ఐటీ పార్కుల నిర్మాణం జరుగుతున్న క్రమంలో చుట్టుపక్కల స్థలాల ధరలు రూ.కోట్లకు చేరాయి. సమీపంలోని ఎసైన్డ్ భూముల విక్రయాలు జోరందుకున్నాయి. ఎసైన్డ్ చట్టం ప్రకారం లావుణి క్రయవిక్రయాలు, దానం, బహుమతి చెల్లదు. సాగు కోసం పంపిణీ చేసిన భూముల్లో భారీ భవంతులు నిర్మిస్తున్నారు. చట్ట ప్రకారం సాగుభూమి మార్పిడికి ‘నాలా’ అనుమతులు పొందాలి. ఇవేమీ లేకున్నా పురపాలక శాఖ భవనాలకు ఉదారంగా అనుమతులిస్తుండగా.. అదే బాటలో కొళాయి, విద్యుత్ కనెక్షన్లు వస్తున్నాయి.
రూ.218 కోట్ల భూమికి రెక్కలు
ఎదిరలో సర్వే నంబరు 556, 607లలో 371.34 ఎకరాలను ఐటీ పార్కుకు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) భూసేకరణ జరిపి దీన్ని నిర్మిస్తోంది. ఇక్కడ భూమి విలువ ఎకరా రూ.2కోట్లకు పైనే ఉంది. రెండేళ్ల కిందట పార్కు కోసం ఈ రెండు సర్వే నంబర్లలో 481.06 ఎకరాలను తీసుకోనున్నట్లు ప్రకటించారు. రెవెన్యూ రికార్డుల్లోనూ అంతే విస్తీర్ణం నమోదై ఉంది. పార్కు నిర్మాణం వేగం పుంజుకున్నాక డీజీపీఎస్(డిఫరెన్సియేట్ గ్లోబల్ పోజిషనింగ్ సర్వే) చేపట్టారు. ఆ సమయంలో 371.34 ఎకరాలే భూమి ఉందని ప్రకటించారు. అంతే విస్తీర్ణానికి పరిహారమిచ్చేందుకు నోటిఫికేషన్ జారీచేశారు. 109 ఎకరాల స్థలం క్షేత్రస్థాయిలో లేదని ప్రకటించారు. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు చేసిన స్థానికులు తమ భూమిని భారీగా తగ్గించి చూపారంటూ ఆక్రోశించారు. నిస్సహాయ స్థితిలో చివరికి ఇచ్చిన పరిహారమే తీసుకున్నారు. వారి ఎసైన్డ్ భూములను కొందరు కావాలనే ‘మాయ’ం చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై దృష్టిసారించే అధికారులే లేకపోవటం విచిత్రం!
రూ.100 కోట్లకుపైగా లావాదేవీలు
మహబూబ్నగర్లోని క్రిస్టియన్పల్లి సర్వే నంబరు 523/1లో ఎసైన్డ్ భూమిని కొల్లగొడుతున్నారు. ఇక్కడ 83.28 ఎకరాల ప్రభుత్వం స్థలం ఉంది. 1980-2017 మధ్య కొందరు పేదలకు ప్రభుత్వం పట్టాలివ్వగా.. రెట్టింపు సంఖ్యలో ఆక్రమణలు జరిగాయి. 2017లో కలెక్టర్ అసలైన లబ్ధిదారులు 500 మందిని గుర్తించి ఆ భూములను వెనక్కు తీసుకున్నారు. అక్కడే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అక్కడే మరో 75 మంది దివ్యాంగులకూ పట్టాలచ్చారు. ఆపై.. మిగిలిన భూమికి నకిలీ పట్టాలు సృష్టించి కొందరు నాయకులు వాటిని అమ్మకానికి పెడుతున్నారు. వంద గజాల స్థలాన్ని రూ.10-20 లక్షలకు విక్రయిస్తుండగా.. 2000 మంది కొన్నట్లు అంచనా. చివరకు చిన్నవాగునూ మింగేశారు.
* పాలకొండ సర్వే నంబరు 282 ఉపసంఖ్యల్లో ఒకచోట ఓ పార్టీకి చెందిన ముఖ్యనేతకు 20 గుంటల భూమి ఉంది. అది ఎసైన్డ్ భూమి అని రికార్డులు చెప్తున్నాయి. పేదల కోసం సాగుకు ఉద్దేశించిన ఈ భూమిని గతంలో ఓ వ్యక్తికి కేటాయించారు. ఆయన నుంచి నాయకుడి కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా కొన్నారు. రెవెన్యూ దస్త్రాల్లో అది ఎసైన్డ్ అని చూపుతుండగా.. యజమానుల పేర్లు మాత్రం మారడం గమనార్హం. ఇప్పటికే ఈ భూమిలో ప్రహరీ నిర్మించి, బోర్లు వేశారు. దీన్ని స్వాధీనం చేసుకుని ఆధునాతన మార్కెట్ను నిర్మించాలని గతంలో అధికారులు ప్రణాళిక రూపొందించినా ఆ నాయకుడి ఒత్తిడి వల్ల పని జరగలేదు. ఈ భూమి వెల రూ.2 కోట్లకుపైమాటే.
* జిల్లా పేరు: మహబూబ్నగర్
* రెవెన్యూ గ్రామాలు: పాలకొండ, బోయపల్లి, మహబూబ్నగర్, ఎదిర, ఎనుగొండ, ఎర్రవల్లి
* ఎసైన్డ్, ప్రభుత్వ భూముల విస్తీర్ణం: 5000 ఎకరాలు
* పేదలకు ఎసైన్డ్ చేసిన విస్తీర్ణం: 2000 ఎకరాలు (దీనిలోనే అక్రమాలు)
* మహబూబ్నగర్ అర్బన్ మండలం పాలకొండ సర్వే నంబరు 79లోని భూమి అంతా లావుణి పట్టానే. 79/1లో 76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సాగుచేసుకోవడానికి కొన్నేళ్ల క్రితం పేదలకు రెండు నుంచి అయిదు ఎకరాల వరకు లావుణి పట్టాలు ఇచ్చారు. స్థిరాస్తి వ్యాపారులు ఈ భూములను రైతుల నుంచి అగ్గువకు కొట్టేసి అమ్మకాలకు పెడుతున్నారు. గజాల చొప్పున ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ సగం ఎసైన్డ్ విస్తీర్ణం కనుమరుగయేందుకు సిద్ధంగా ఉంది. చేతులు మారిన భూముల విలువ రూ.170 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం..
మహబూబ్నగర్ శివార్లలోని పాలకొండ, ఎదిర, క్రిస్టియన్పల్లి పరిధిలో అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమాలపై ఆర్డీవో, తహసీల్దార్లతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపడతాం. అక్రమాలు తేలితే నోటీసులిచ్చి ఆయా భూముల నుంచి ఖాళీచేయిస్తాం. ‘ధరణి’ వచ్చాక పరిస్థితి మారింది. క్రిస్టియన్పల్లి భూములపై మరో అదనపు కలెక్టర్ విచారణ జరుపుతున్నారు.
- సీతామారావు, అదనపు కలెక్టర్, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ
వచ్చే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రైతాంగ సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
సెప్టెంబరు 15లోపు ఇంజినీరింగ్ తరగతులు
వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. -
వైద్యుడిగా పేరు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ డా.బల్మూరి వెంకట్ తెలంగాణ వైద్య మండలి (టీఎంసీఐ)లో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఆయన కరీంనగర్లోని చల్మెడ వైద్య కళాశాలలో 2021లో ఎంబీబీఎస్, 2022లో అదే కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. -
తూర్పు కనుమల్లోని 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి
తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ(ఈ-డీఎన్ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు. -
జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
గురుకుల ‘జూనియర్’ ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో 15 వరకు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెం.మీ., సత్తుపల్లిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఇలినోయీలో ప్రభాకర్రావు.. మియామీలో శ్రవణ్రావు
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
నోముల భగత్ క్వార్టర్కు సీల్ తొలగింపుపై అప్పీలు ఉపసంహరణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వార్టర్ (ఈఈ/19)కు వేసిన సీల్ను 48 గంటల్లో తొలగించాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఉపసంహరించుకుంది. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. -
నేటితో ముగియనున్న ఎప్సెట్
రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ (ఇంజినీరింగ్) విభాగం పరీక్షలు శనివారం ఉదయం విడతతో ముగియనున్నాయి. రెండో రోజు ఉదయం విడతలో 94.3 శాతం, మధ్యాహ్నం విడతలో 94.8 శాతం మంది హాజరయ్యారు. -
వారంలో మేడిగడ్డపై నిపుణుల కమిటీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిసారించాలంటూ జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. -
మన్నె క్రిశాంక్కు బెయిల్.. జైలు నుంచి విడుదల
‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?