
పసికందులకు ఆరోగ్యమస్తు
తెలంగాణలో తగ్గిన శిశు మరణాల రేటు
2020 గణాంకాల్లో 21 నమోదు
జాతీయ సగటు కంటే తక్కువే
ఎస్ఆర్ఎస్ సర్వే తాజా నివేదికలో వెల్లడి
ఈనాడు - హైదరాబాద్
ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు(ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్-ఐఎంఆర్) రాష్ట్రంలో గడిచిన ఏడేళ్లలో గణనీయంగా తగ్గింది. 2014లో ప్రతి వేయి జననాలకు ఏడాదిలోపు శిశువులు 39 మంది మృతి చెందగా.. గురువారం వెలువడిన 2020 గణాంకాల్లో 21కి తగ్గింది. 2019తో పోల్చితే 2 పాయింట్లు తగ్గడం విశేషం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘నమూనా నమోదు విధానం(శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-ఎస్ఆర్ఎస్)’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమాచారాన్ని పొందుపర్చింది. శిశు మరణాల రేటుతో పాటు జనన, మరణాల రేటు, సహజ వృద్ధి రేటు తదితర సమాచారాలనూ అందించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో 121, పట్టణాల్లో 103 చొప్పున మొత్తంగా 224 కేంద్రాల్లో నమూనాలను సేకరించారు. వీటిలో గ్రామీణ తెలంగాణలో 1.58 లక్షల జనాభాను, పట్టణాల్లో 0.56 లక్షల జనాభా కలుపుకొని మొత్తం 2.14 లక్షల జనాభా నుంచి ఈ నమూనాలను నమోదు చేశారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు(28) కంటే తెలంగాణ(21)లో తక్కువగా నమోదవడం విశేషం.
గ్రామీణంలో ఎక్కువే
రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టినా.. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణంలో ఎక్కువ మరణాలే జరుగుతున్నట్లు ఎస్ఆర్ఎస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ తెలంగాణలో ప్రతి వేయి జననాలకు కొన్ని జిల్లాల్లో కనిష్ఠంగా 19, గరిష్ఠంగా కొన్ని జిల్లాల్లో 30 వరకూ శిశు మరణాలు చోటుచేసుకున్నట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కనిష్ఠంగా 9, గరిష్ఠంగా 25 వరకూ సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే.. కనిష్ఠంగా 17, గరిష్ఠంగా 26 మరణాలు సంభవించాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ వైద్యంపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శిశు మరణాల్లో బాలురు, బాలికల నిష్పత్తి 21:22గా నమోదైంది. రాష్ట్రంలో ఏటా సుమారు 63 వేల నుంచి 93 వేల మంది శిశువులు ముందస్తుగా లేదా తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. ఇలా పుట్టిన పిల్లల్లో ఇన్ఫెక్షన్లు సోకడానికి అవకాశాలెక్కువ. దీన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 32 నవజాత శిశు సంరక్షణ కేంద్రాల(ఎస్ఎన్సీయూ)ను నెలకొల్పింది. వీటిలో ఏటా సుమారు 50-60 వేల మంది నవజాత శిశువులు చికిత్స పొందుతుండగా.. వీరిలో సుమారు 77 శాతం మంది క్షేమంగా బయటపడుతున్నారు. ఎస్ఎన్సీయూల అత్యుత్తమ సేవల ఫలితంగానూ, కేసీఆర్ కిట్ అమలుతో తల్లీబిడ్డ సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన ఫలితంగానూ.. మొత్తంగా శిశు మరణాల రేటు తగ్గిందని వైద్యవర్గాలు విశ్లేషించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Happy Birthday: అతిథిగా టామ్ క్రూజ్.. సరదాగా ‘హ్యాపీ బర్త్డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
General News
Cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత ఏం చేయాలి..?
-
India News
Rahul Gandhi: భాజపా ముఖ్య సమస్యల్ని మేనేజ్ చేస్తూ.. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తోంది: రాహుల్
-
Movies News
Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
-
World News
Jail Attack: నైజీరియా కారాగారంపై దాడి.. 600 మంది ఖైదీలు పరార్
-
Politics News
Congress: 110 ఏళ్ల చరిత్రలో.. యూపీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన కాంగ్రెస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
- Venu Madhav: ఒక్క సీన్ అనుకుంటే మూడు సీన్లు అయ్యాయి
- Trending English words:ఈ 10 ట్రెండింగ్ ఇంగ్లిష్ పదాల గురించి తెలుసా?
- Driver Jamuna: ‘డ్రైవర్ జమున’గా ఐశ్వర్య రాజేశ్.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్
- Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
- Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
- Telangana News: నిమ్జ్ కోసం బలవంతపు భూసేకరణ.. రైతు బిడ్డ ఆవేదన
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Anand Mahindra: మీరు ఎన్నారైనా?.. నెటిజన్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఊహించని రిప్లై