పసికందులకు ఆరోగ్యమస్తు
ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు(ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్-ఐఎంఆర్) రాష్ట్రంలో గడిచిన ఏడేళ్లలో గణనీయంగా తగ్గింది. 2014లో ప్రతి వేయి జననాలకు ఏడాదిలోపు శిశువులు 39 మంది మృతి చెందగా.. గురువారం వెలువడిన 2020 గణాంకాల్లో
తెలంగాణలో తగ్గిన శిశు మరణాల రేటు
2020 గణాంకాల్లో 21 నమోదు
జాతీయ సగటు కంటే తక్కువే
ఎస్ఆర్ఎస్ సర్వే తాజా నివేదికలో వెల్లడి
ఈనాడు - హైదరాబాద్
ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు(ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్-ఐఎంఆర్) రాష్ట్రంలో గడిచిన ఏడేళ్లలో గణనీయంగా తగ్గింది. 2014లో ప్రతి వేయి జననాలకు ఏడాదిలోపు శిశువులు 39 మంది మృతి చెందగా.. గురువారం వెలువడిన 2020 గణాంకాల్లో 21కి తగ్గింది. 2019తో పోల్చితే 2 పాయింట్లు తగ్గడం విశేషం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘నమూనా నమోదు విధానం(శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-ఎస్ఆర్ఎస్)’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమాచారాన్ని పొందుపర్చింది. శిశు మరణాల రేటుతో పాటు జనన, మరణాల రేటు, సహజ వృద్ధి రేటు తదితర సమాచారాలనూ అందించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో 121, పట్టణాల్లో 103 చొప్పున మొత్తంగా 224 కేంద్రాల్లో నమూనాలను సేకరించారు. వీటిలో గ్రామీణ తెలంగాణలో 1.58 లక్షల జనాభాను, పట్టణాల్లో 0.56 లక్షల జనాభా కలుపుకొని మొత్తం 2.14 లక్షల జనాభా నుంచి ఈ నమూనాలను నమోదు చేశారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు(28) కంటే తెలంగాణ(21)లో తక్కువగా నమోదవడం విశేషం.
గ్రామీణంలో ఎక్కువే
రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టినా.. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణంలో ఎక్కువ మరణాలే జరుగుతున్నట్లు ఎస్ఆర్ఎస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ తెలంగాణలో ప్రతి వేయి జననాలకు కొన్ని జిల్లాల్లో కనిష్ఠంగా 19, గరిష్ఠంగా కొన్ని జిల్లాల్లో 30 వరకూ శిశు మరణాలు చోటుచేసుకున్నట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కనిష్ఠంగా 9, గరిష్ఠంగా 25 వరకూ సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే.. కనిష్ఠంగా 17, గరిష్ఠంగా 26 మరణాలు సంభవించాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ వైద్యంపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శిశు మరణాల్లో బాలురు, బాలికల నిష్పత్తి 21:22గా నమోదైంది. రాష్ట్రంలో ఏటా సుమారు 63 వేల నుంచి 93 వేల మంది శిశువులు ముందస్తుగా లేదా తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. ఇలా పుట్టిన పిల్లల్లో ఇన్ఫెక్షన్లు సోకడానికి అవకాశాలెక్కువ. దీన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 32 నవజాత శిశు సంరక్షణ కేంద్రాల(ఎస్ఎన్సీయూ)ను నెలకొల్పింది. వీటిలో ఏటా సుమారు 50-60 వేల మంది నవజాత శిశువులు చికిత్స పొందుతుండగా.. వీరిలో సుమారు 77 శాతం మంది క్షేమంగా బయటపడుతున్నారు. ఎస్ఎన్సీయూల అత్యుత్తమ సేవల ఫలితంగానూ, కేసీఆర్ కిట్ అమలుతో తల్లీబిడ్డ సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన ఫలితంగానూ.. మొత్తంగా శిశు మరణాల రేటు తగ్గిందని వైద్యవర్గాలు విశ్లేషించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ
వచ్చే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రైతాంగ సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
సెప్టెంబరు 15లోపు ఇంజినీరింగ్ తరగతులు
వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. -
వైద్యుడిగా పేరు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ డా.బల్మూరి వెంకట్ తెలంగాణ వైద్య మండలి (టీఎంసీఐ)లో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఆయన కరీంనగర్లోని చల్మెడ వైద్య కళాశాలలో 2021లో ఎంబీబీఎస్, 2022లో అదే కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. -
తూర్పు కనుమల్లోని 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి
తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ(ఈ-డీఎన్ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు. -
జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
గురుకుల ‘జూనియర్’ ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో 15 వరకు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెం.మీ., సత్తుపల్లిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఇలినోయీలో ప్రభాకర్రావు.. మియామీలో శ్రవణ్రావు
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
నోముల భగత్ క్వార్టర్కు సీల్ తొలగింపుపై అప్పీలు ఉపసంహరణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వార్టర్ (ఈఈ/19)కు వేసిన సీల్ను 48 గంటల్లో తొలగించాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఉపసంహరించుకుంది. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. -
నేటితో ముగియనున్న ఎప్సెట్
రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ (ఇంజినీరింగ్) విభాగం పరీక్షలు శనివారం ఉదయం విడతతో ముగియనున్నాయి. రెండో రోజు ఉదయం విడతలో 94.3 శాతం, మధ్యాహ్నం విడతలో 94.8 శాతం మంది హాజరయ్యారు. -
వారంలో మేడిగడ్డపై నిపుణుల కమిటీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిసారించాలంటూ జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. -
మన్నె క్రిశాంక్కు బెయిల్.. జైలు నుంచి విడుదల
‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?