ప్రగతిభవన్‌లో గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Published : 27 Jan 2023 05:11 IST

జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్‌ రాజు, మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని అమర జవానుల స్మారక స్తూపం వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని