ఇక వేలంలో కొనడమే!
తెలంగాణలో కొత్త బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో రెండు బొగ్గు గనులు ప్రైవేటు కంపెనీలు సొంతం చేసుకున్నాయి.
మరోసారి గనులను వేలం వేయనున్న కేంద్ర బొగ్గుశాఖ
టెండర్ వేసి దక్కించుకోవాలని సింగరేణి యోచన
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కొత్త బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో రెండు బొగ్గు గనులు ప్రైవేటు కంపెనీలు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కేంద్ర బొగ్గుశాఖ మరోసారి కొత్త గనులను వేలం వేయడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ఆపై గనుల వేలం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కొత్తగా మరిన్ని గనులను వేలం వేయనున్నట్లు సమాచారం. ఈ వేలంలో పాల్గొని గనులను దక్కించుకోవాలని సింగరేణి కసరత్తు చేస్తోంది.
సింగరేణికే బొగ్గు అవసరం
తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల విద్యుదుత్పత్తి కేంద్రాలు 2.40 లక్షల టన్నుల వరకు బొగ్గు కావాలని సింగరేణిని అడుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా జైపూర్లో సింగరేణికి ఇప్పటికే 1200 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. అక్కడే మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి సింగరేణి టెండర్లు పిలుస్తోంది. దీంతోపాటు 800 మెగావాట్ల ప్లాంటు నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్రం సింగరేణికి సూచించింది. నాలుగేళ్లలో పూర్తయ్యే ఈ రెండు ప్లాంట్లకు రోజూ 20 వేల టన్నుల బొగ్గు అవసరం. ఇవే కాకుండా రామగుండంలో ఎన్టీపీసీ 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రానికి బొగ్గు సరఫరాకు సింగరేణి తంటాలు పడుతోంది. అక్కడే అదనంగా మరో 2400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి ఎన్టీపీసీ కసరత్తు చేస్తోంది. ఇవి పూర్తయితే రోజుకు మరో 30 వేల టన్నుల బొగ్గు సింగరేణి సరఫరా చేయాలి. ఇప్పుడున్న పాత గనుల్లో రోజువారీ ఉత్పత్తవుతున్న 2.20 లక్షల టన్నులే సరిపోక 20 వేల టన్నుల అమ్మకాలను సింగరేణి నష్టపోతోంది. ఇక కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాలు పూర్తయితే రోజూ మరో 50 వేల టన్నులకు పైగా ఎక్కడి నుంచి తేవాలనేది కీలకప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో భారీ నిల్వలున్న కొత్త గనులను వేలంలో దక్కించుకోకపోతే మరో నాలుగైదేళ్లలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ తెలిపింది. దీనివల్ల టెండరు వేసి వేలంలో గనులను కొంటే ఉత్పత్తి పెంచగలమని వివరించింది. ఈ నేపథ్యంలో కొత్త గనులను వేలంలో కొనడానికి సింగరేణి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ వ్యవస్థనూ ‘వదల్లేదు!’
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపైనా జగన్ దాడికి దిగారు. తన అనుయాయుల్ని, అనుచరగణాన్ని ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థపైనా దాడి చేయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడికి దిగారు. కార్యనిర్వాహక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, అధికారుల్ని భయభ్రాంతుల్ని చేసి చెప్పినట్టల్లా ఆడించారు. -
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. -
ఓటేసేందుకు వైఎస్ భాస్కరరెడ్డికి అనుమతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. 13న వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ రావాలని స్పష్టం చేసింది. -
ఇదీ సంగతి!
-
గాలివాన బీభత్సం
రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. ఆదివారం మధ్యాహ్నం తరువాత గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. -
విద్యుత్ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో 9,009 మిలియన్ యూనిట్ల వినియోగంతో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. -
కాళేశ్వరం పంప్హౌస్ల మునకపై ఆరా
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంప్హౌస్లకు సంబంధించిన వివరాలు అందజేయాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లకు విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు. -
ఐఐటీల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులకు సీట్లు?
పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు నేరుగా ఐఐటీల్లో బీటెక్ రెండో ఏడాదిలో చేరొచ్చా?.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఐఐటీ హైదరాబాద్ సైతం అందుకు కృషి చేస్తున్నాయి. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డిలతోపాటు పలు జిల్లాల పరిధిలో ఆదివారం గాలి వాన, పిడుగులు పడిన ఘటనల్లో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
15న సీపీగెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నోటిఫికేషన్ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. -
ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ విడుదల
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక ‘కీ’ని ఆదివారం విడుదల చేశారు. రెస్సాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచామని, అభ్యంతరాలుంటే ఈ నెల 14న ఉదయం 10 గంటలలోపు వెబ్సైట్ నుంచే పంపించాలని కన్వీనర్ డీన్కుమార్, కో-కన్వీనర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. -
యాదాద్రిపై భక్తజన సందోహం!
దైవదర్శనాలు.. స్వామివారి కల్యాణం.. దీపారాధనలు.. మొక్కులు, వాహన పూజలు.. పుణ్య స్నానాలతో పంచనారసింహులు కొలువైన మహా పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదివారం భక్తజన సందోహంగా మారింది. -
వీనులవిందుగా ‘రవీంద్రుని’ గీతాలాపన
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం 11 రాష్ట్రాల్లో ఒకేరోజు, ఒకే సమయంలో.. ఒకేసారి ఒక్కోచోట 100 మంది గాయకుల చొప్పున రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత 20 గీతాలను మధురంగా ఆలపించి ఆయనకు నివాళులర్పించారు. -
ముఖ్యమంత్రి ‘ఆట’విడుపు..!
కొద్దిరోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) మైదానంలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. -
అంగన్వాడీ సిలబస్ మరింత సరళం!
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ కేంద్రాల్లో మరింత నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనుంది. -
సీఎంకు హైకోర్టు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు బార్ అసోసియేషన్ ఆదివారం కృతజ్ఞతలు తెలిపింది. -
బ్యాట్ పట్టిన అసదుద్దీన్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం వరకు ప్రచారంలో విరామం లేకుండా గడిపిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. -
అన్ని షిఫ్టుల కార్మికులకు వేతనంతో కూడిన సెలవు నేడు
పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం కర్మాగారాల కార్మికుల్లో అన్ని షిఫ్టుల వారికీ వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్