భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
ఇప్పటికే రిసీవర్ ఆస్తుల పంపిణీ వ్యవహారాన్ని పరిష్కరించారు
73 ఏళ్లనాటి నవాబ్ ఫక్రుల్ ముల్క్ కేసును పరిష్కరిస్తూ హైకోర్టు సంచలన తీర్పు
కలకత్తా హైకోర్టు తరువాత తెలంగాణ హైకోర్టులో 73 ఏళ్ల కేసు పరిష్కారం
ఈనాడు, హైదరాబాద్: అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 72 ఏళ్లుగా దేశంలోనే అత్యంత పాత కేసుల్లో ఒకటైన బెర్హంపూర్ బ్యాంకు కేసును కలకత్తా హైకోర్టు గత ఏడాది పరిష్కరించగా, 73 ఏళ్ల పాత కేసును తెలంగాణ హైకోర్టు తాజాగా పరిష్కరించి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల మధ్య వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
ఇదీ వివాదం
నవాబ్ ఫక్రుల్ ముల్క్కు చెందిన వారసత్వ భూమి పంపిణీ వివాదంలో 1951లో హైకోర్టులో మూడు రాజీ పిటిషన్ల ద్వారా ప్రాథమిక డిక్రీ జారీ అయింది. దాని ప్రకారం ఐదు భాగాలుగా ఐదుగురికి నగరంలో ఉన్న 9 ఆస్తుల పంపిణీ జరగాలి. అవి ఎర్రమంజిల్, ఎర్రగడ్డ, బొల్లారం, బల్దా, బెహ్లూల్ఖాన్గూడ, యూసఫ్గూడ, మూసాపేటలలో ఉన్నాయి. ఆ భూముల పరిరక్షణతోపాటు విక్రయించి వాటాలను పంచడానికిగాను ఇప్పటిదాకా 9 మంది రిసీవర్లు నియమితులయ్యారు. అప్పటి నుంచి ఒక్కో ఆస్తిని పంచే క్రమంలో తిరిగి వివాదాలు, కేసులు నడుస్తూ వస్తున్నాయి. కొంత ఆస్తిని వారసులకు భాగ పంపిణీ చేశారు కూడా. ప్రభుత్వం కూడా కొంత భూమిని సేకరించి పరిహారాన్ని ఇవ్వగా దానిని కూడా వారసులకు పంచారు. ఆ క్రమంలోనే ఎర్రగడ్డలోని ఎర్రం నూమా బంగళాకు సంబంధించిన 59 ఎకరాలను సేకరించి ప్రభుత్వ టీబీ ఆస్పత్రి నిర్మించింది. ఇంకా ఆస్తి పంపక వ్యవహారం ఎడతెగని వివాదంగా ఉండడంతో 2022 నవంబరు 29న విశ్రాంత జిల్లా జడ్జి మహమ్మద్ నిజాముద్దీన్ను చివరిగా రిసీవర్ కమ్ కమిషనరుగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గత ఏడాది మార్చి 16న తుది నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నివేదికపై అభ్యంతరాలుంటే వ్యక్తం చేయవచ్చని హైకోర్టు బార్ అసోసియేషన్కు నోటీసు జారీచేసింది. కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
శ్మశానం తప్ప ఏమీ మిగల్లేదు
రిసీవర్ సమర్పించిన నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఆమోదించింది. వాస్తవానికి పంపిణీ చేయడానికి క్షేత్రస్థాయిలో అమీర్పేటలోని శ్మశానభూమి మినహా ఇంకేమీ లేదని రిసీవర్ నివేదికలో పేర్కొన్నప్పటికీ ఇంకా భూములున్నాయని వాటి భాగ పంపిణీ కాలేదంటూ కొందరు చేసిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. భూమి ఉందని పేర్కొంటున్నపుడు నిర్దిష్ట వివరాలు సమర్పించకుండా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేం. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త కారణాలతో ఇంకా భాగ పంపిణీ జరగాల్సి ఉందని చెప్పజాలరు’’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
క్లెయిం తీసుకోనివారు సొమ్ము తీసుకోవచ్చు
భూముల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము 2023 మార్చి 10నాటికి రూ.1,18,81,249 హైకోర్టు వద్ద ఉందని, దాన్ని జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశించింది. తమ వాటాను క్లెయిం చేసుకోని వారు చెక్ పిటిషన్ దాఖలు చేసి సొమ్మును వడ్డీ సహా తీసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. అమీర్పేటలో ఉన్న శ్మశానవాటికను కేంద్రం చారిత్రక ప్రదేశంగా గుర్తించినందున, ముల్క్ వారసులు ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని దాన్ని పరిరక్షించాలని, అంతేగానీ పంపకం జరగడానికి వీల్లేదని తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన 73 ఏళ్ల రికార్డులను భద్రపరచిన హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం అభినందించింది.
పెండింగ్లో మరో మూడు పాత కేసులు
తెలంగాణ హైకోర్టులో నిజాం నవాబులు, పైగా భూములకు చెందిన మరో మూడు పాత కేసులు పెండింగ్లో ఉన్నాయి. వారసుల నుంచి పవర్ ఆఫ్ అటార్నీతో కొనుగోలు చేశామని, వాటిపై హక్కులున్నాయంటూ పలువురు బడా వ్యక్తులు మధ్యంతర పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తూ సుప్రీంకోర్టు దాకా వెళుతున్నారు. అసలైన పిటిషన్ పెండింగ్లో ఉండగా మధ్యంతర పిటిషన్లతో వివాదాలు పెరుగుతున్నందున వాటికి తెరదించాలన్న లక్ష్యంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ
వచ్చే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రైతాంగ సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
సెప్టెంబరు 15లోపు ఇంజినీరింగ్ తరగతులు
వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. -
వైద్యుడిగా పేరు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ డా.బల్మూరి వెంకట్ తెలంగాణ వైద్య మండలి (టీఎంసీఐ)లో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఆయన కరీంనగర్లోని చల్మెడ వైద్య కళాశాలలో 2021లో ఎంబీబీఎస్, 2022లో అదే కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. -
తూర్పు కనుమల్లోని 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి
తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ(ఈ-డీఎన్ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు. -
జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
గురుకుల ‘జూనియర్’ ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో 15 వరకు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెం.మీ., సత్తుపల్లిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఇలినోయీలో ప్రభాకర్రావు.. మియామీలో శ్రవణ్రావు
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
నోముల భగత్ క్వార్టర్కు సీల్ తొలగింపుపై అప్పీలు ఉపసంహరణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వార్టర్ (ఈఈ/19)కు వేసిన సీల్ను 48 గంటల్లో తొలగించాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఉపసంహరించుకుంది. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. -
నేటితో ముగియనున్న ఎప్సెట్
రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ (ఇంజినీరింగ్) విభాగం పరీక్షలు శనివారం ఉదయం విడతతో ముగియనున్నాయి. రెండో రోజు ఉదయం విడతలో 94.3 శాతం, మధ్యాహ్నం విడతలో 94.8 శాతం మంది హాజరయ్యారు. -
వారంలో మేడిగడ్డపై నిపుణుల కమిటీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిసారించాలంటూ జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. -
మన్నె క్రిశాంక్కు బెయిల్.. జైలు నుంచి విడుదల
‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు