మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం.
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయాన్ని పెంచాలన్న వినతుల్ని ఈసీకి పంపాం
ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది నమోదు
‘ఈనాడు’తో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్
ఈనాడు, హైదరాబాద్: ‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. గత ఏడాది నవంబరులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటేసిన కేంద్రాల్లోనే ఓటు వేయవచ్చు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. శనివారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘‘ఈవీఎంలను కేటాయించేందుకు త్వరలో ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపడతాం. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు 25 నియోజకవర్గాలకు సంబంధించి వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిలో 20 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వినియోగించుకునేందుకు న్యాయస్థానం, ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించింది. మిగిలిన ఐదింటి విషయంలో స్పష్టత రాలేదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ పూర్తి కానుంది. ఆ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీల నుంచి వినతులు వచ్చాయి. వాటిని ఎన్నికల సంఘానికి పంపాం.
మరో 50 కంపెనీల బలగాలను కోరాం
రాష్ట్రానికి 155 కంపెనీల సాయుధ బలగాలు వచ్చాయి. మరో 50 కంపెనీలను కేటాయించాలని కోరాం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 375 కంపెనీల బలగాలు వచ్చాయి. ఈ దఫా దేశవ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్ జరగనుండటంతో వాటి సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో ఉన్న 60 వేల యూనిఫాం సర్వీసు ఉద్యోగులతోపాటు పక్క రాష్ట్రాల నుంచి 20 వేల పోలీసు బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే సాయుధ బలగాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అక్కడి లోక్సభ స్థానాలకు రెండు దశల పోలింగ్ పూర్తి అయింది. ఆ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం.
పోస్టల్ బ్యాలెట్లు అడిగిన వారు 2.80 లక్షల మంది
లోక్సభ ఎన్నికల్లో 2.80 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకునేందుకు నమోదు చేసుకున్నారు. వారిలో 80 శాతం మంది సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు మూడు రోజులు అవకాశం కల్పిస్తాం. ప్రస్తుతానికి వచ్చే నెల 5, 6, 7 తేదీలని అనుకుంటున్నాం. ఎన్నికల సంఘం అనుమతితో ఆ తేదీలను త్వరలో ఖరారు చేస్తాం. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఫెసిలిటీ సెంటర్లో ఓటేయవచ్చు. అందరూ ఒకే రోజు వెళితే ఇతర పనులకు ఇబ్బంది వస్తుంది. అందుకోసమే మూడు రోజుల వ్యవధి నిర్ణయించాం. వారు ఓటు వేసేందుకు ఎంచుకున్న రోజున ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ఇంటి నుంచి ఓటు వేసేందుకు 24,974 మంది ఎంచుకున్నారు. వారిలో 11,238 మంది 85 సంవత్సరాలు దాటిన వారు. 11,904 మంది దివ్యాంగులు. 1,832 మంది వివిధ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు.
500 వరకు మోడల్ పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు స్పష్టం చేశాం. షామియానాలు వేయాలని చెప్పాం. అందుబాటులో ఉంటే కూలర్లు.. లేని పక్షంలో పెడస్టల్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని తెలిపాం. రాష్ట్రం మొత్తం మీద 500 వరకు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ట్రాన్స్జెండర్ల కోసం ఓ మోడల్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం’’ అని వికాస్రాజ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ
వచ్చే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రైతాంగ సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
సెప్టెంబరు 15లోపు ఇంజినీరింగ్ తరగతులు
వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. -
వైద్యుడిగా పేరు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ డా.బల్మూరి వెంకట్ తెలంగాణ వైద్య మండలి (టీఎంసీఐ)లో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఆయన కరీంనగర్లోని చల్మెడ వైద్య కళాశాలలో 2021లో ఎంబీబీఎస్, 2022లో అదే కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. -
తూర్పు కనుమల్లోని 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి
తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ(ఈ-డీఎన్ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు. -
జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
గురుకుల ‘జూనియర్’ ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో 15 వరకు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెం.మీ., సత్తుపల్లిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఇలినోయీలో ప్రభాకర్రావు.. మియామీలో శ్రవణ్రావు
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
నోముల భగత్ క్వార్టర్కు సీల్ తొలగింపుపై అప్పీలు ఉపసంహరణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వార్టర్ (ఈఈ/19)కు వేసిన సీల్ను 48 గంటల్లో తొలగించాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఉపసంహరించుకుంది. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. -
నేటితో ముగియనున్న ఎప్సెట్
రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ (ఇంజినీరింగ్) విభాగం పరీక్షలు శనివారం ఉదయం విడతతో ముగియనున్నాయి. రెండో రోజు ఉదయం విడతలో 94.3 శాతం, మధ్యాహ్నం విడతలో 94.8 శాతం మంది హాజరయ్యారు. -
వారంలో మేడిగడ్డపై నిపుణుల కమిటీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిసారించాలంటూ జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. -
మన్నె క్రిశాంక్కు బెయిల్.. జైలు నుంచి విడుదల
‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్