పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్‌), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు.

Published : 29 Apr 2024 03:03 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్‌), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. కొత్తగూడెంలో జరిగిన రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో 15 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్‌ ఎం.రామకృష్ణ ఆదివారం తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎ.సతీశ్‌ (నిజామాబాద్‌), సహాయ కార్యదర్శిగా మిస్రిన్‌ సుల్తానా (హైదరాబాద్‌), కోశాధికారిగా రత్నం రమేశ్‌ (కొత్తగూడెం), పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు. ప్రైవేటు వర్సిటీ బిల్లు, నూతన జాతీయ విద్యా విధానం రద్దు తదితర అంశాలపై తీర్మానాలను నూతన కార్యవర్గం ఆమోదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని