Cyber crime: మస్క్‌ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్‌ నేరగాడు టోకరా

డీప్‌ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది.  

Updated : 25 Apr 2024 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తనతో మాట్లాడుతున్నాడని నమ్మిన ఓ మహిళ నిట్టనిలువునా మునిగింది. మస్క్‌నంటూ నమ్మబలికిన కేటుగాడి మాయలో పడి రూ.లక్షల్లో నష్టపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?(Cyber crime)

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్ జిసన్‌ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. అందుకు డీప్‌ఫేక్ వీడియో కారణమైంది. ‘‘ఎలాన్‌ మస్క్‌ జీవిత చరిత్ర చదివిన తర్వాత ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ అయ్యాను. అలాంటి నాకు గత ఏడాది ఒక కలలాంటి అనుభవం ఎదురైంది. జులై 17న ఇన్‌స్టాగ్రాంలో మస్క్‌ పేరుతో ఉన్న ఖాతాకు ఫ్రెండ్స్‌ జాబితాలో యాడ్ చేశాడు. అది చూసి, మొదట నాకు అనుమానం వచ్చింది. అయితే తన పని ప్రదేశంలోని చిత్రాలు షేర్ చేయడం, తన పిల్లల గురించి మాట్లాడటం చూసి ఆ సందేహాలు ఎగిరిపోయాయి. అలాగే తన అభిమానులను కాంటాక్ట్ అయ్యే తీరును ఆయన వెల్లడించాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడితో తన మీటింగ్ గురించి చెప్పాడు. ఒకసారి వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. నన్ను ప్రేమిస్తున్నానని కూడా చెప్పాడు’’ అంటూ ఆమె వెల్లడించారు. ఆ సైబర్‌ నేరగాడు ఆ కాల్‌ను ఏఐ డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి మాట్లాడినట్లు ఆమె పేర్కొన్నారు.

దేశాల మధ్య డీప్‌ఫేక్‌ చిచ్చు.. ఫిలిప్పీన్స్‌-చైనాలో కలకలం సృష్టించిన వీడియో

‘‘తర్వాత తన కొరియన్ ఉద్యోగుల కోసం డబ్బు పంపేలా అతడు నన్ను ఒప్పించాడు. నా డబ్బును పెట్టుబడిగా పెట్టి, ధనవంతురాలిని చేస్తానని నమ్మబలికాడు. తన అభిమానులు ధనవంతులుగా మారితే తనకు సంతోషమన్నాడు’’ అని ఆమె తెలిపారు. ఆ మాయమాటలు నమ్మిన ఆమె డబ్బు పంపారు. చివరకు రూ.41 లక్షలు పోగొట్టుకున్నారు. ఇదిలాఉంటే.. 2022 జనవరి నుంచి జూన్ మధ్యలో ఈతరహా నేరాలు 280 వరకు వెలుగుచూసినట్లు కొరియా యూనివర్సిటీ నిర్వహించిన సర్వే పేర్కొంది. ఆ దేశంలో ఈ మోసాలను కట్టడి చేసేలా చట్టాల్లో తగిన నిబంధనలు లేవని మీడియా కథనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు