WHO: డబ్ల్యూహెచ్వోలో బంగ్లా ప్రధాని కుమార్తెకు కీలక పదవి
డబ్ల్యూహెచ్వో (WHO) ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజినల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ నామనేట్ అయ్యారు.
దిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో బంగ్లాదేశ్ (Bangladesh) ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కుమార్తె సైమా వాజెద్ (Saima Wazed) కీలక పదవి చేపట్టనున్నారు. డబ్ల్యూహెచ్వో ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజినల్ డైరెక్టర్గా వాజెద్ నామినేట్ అయ్యారు. ఈ మేరకు బుధవారం జరిగిన డబ్ల్యూహెచ్వో రీజినల్ కమిటీ 67వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ పదవికి సైమా వాజెద్తో పాటు డబ్ల్యూహెచ్వో సీనియర్ అధికారి డా. శంబు ప్రసాద్ ఆచార్య కూడా పోటీపడ్డారు. ఆయనను నేపాల్ ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే దిల్లీలో బుధవారం జరిగిన రీజినల్ కమిటీ సమావేశంలో దీనిపై ఓటింగ్ చేపట్టారు. ఇందులో వాజెద్కు అనుకూలంగా 8 ఓట్లు వచ్చాయి. ఆచార్యకు రెండు ఓట్లు వచ్చాయి. దీంతో వాజేద్ను నామినేట్ చేస్తున్నట్లు కమిటీ తీర్మానించింది.
పిల్లలున్నవారికి ప్రోత్సాహకాలు ఉండాలి..! మస్క్ వ్యాఖ్య
వచ్చే ఏడాది జనవరి 22-27 మధ్య జెనీవాలో జరిగే 154వ డబ్ల్యూహెచ్వో ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఆమె ఎన్నికను ఆమోదించనున్నారు. 2024 ఫిబ్రవరి 1 నుంచి వాజెద్.. రీజినల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ ప్రకటనలో వెల్లడించింది. ఐదేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. తన ఎంపికపై సైమా వాజెద్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ఆటిజం, న్యూరోడెవలప్మెంటల్ డిజార్డర్ వంటి వ్యాధులపై బంగ్లా జాతీయ అడ్వైజరీ కమిటీకి ఛైర్పర్సన్గా ఉన్నారు.
ఈ రీజినల్ కమిటీలో బంగ్లాదేశ్, నేపాల్తో పాటు భారత్, భూటాన్, ఉత్తరకొరియా, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయ్లాండ్, తైమోర్ లెస్తే సభ్య దేశాలుగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్