Maldives: చైనా.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదట!
చైనాతో (China) వ్యూహాత్మక సంబంధాలు గొప్పగా ఉన్నాయని.. తమ దేశ సార్వభౌమత్వానికి జిన్పింగ్ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తుందని మాల్దీవులు పేర్కొంది.
బీజింగ్: భారత్తో వివాదం కొనసాగుతున్న వేళ మాల్దీవుల తీరులో మార్పు కనిపించడం (India Maldives conflict) లేదని తెలుస్తోంది. భారత్తో సంబంధాలు ఎలా ఉన్నా.. చైనాతో (China) మాత్రం వ్యూహాత్మక సంబంధాలు గొప్పగా ఉన్నాయంటూ పొగడ్తలు కురిపించింది. ఇరు దేశాలు గౌరవించుకుంటాయని, తమ దేశ సార్వభౌమత్వానికి చైనా పూర్తిగా మద్దతిస్తుందని పేర్కొంది. భారత్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని డెడ్లైన్ విధించిన సమయంలోనే మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed muizzu) చైనాపై ప్రశంసలు గుప్పించడం గమనార్హం.
ముయిజ్జుకు రాజధాని మాలెలో షాక్
మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. 1972లో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలైనప్పటి నుంచి చైనా తమ అభివృద్ధిలో సహకారం అందించిందన్నారు. డ్రాగన్ చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్డు కార్యక్రమం ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇవి మరింత బలపడతాయని అన్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో జిన్పింగ్ (Xi Jinping) ప్రభుత్వం జోక్యం చేసుకోదంటూ చైనా అధికారిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను వ్యక్తిగతంగా పొగడ్తలతో ముంచెత్తిన ముయిజ్జు.. ఆయన సారథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సరికొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. మాల్దీవులు తన లక్ష్యాలను సాధించేందుకు బీజింగ్ సహకరిస్తుందని జిన్పింగ్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీసుకొన్న ఓ నిర్ణయంపై స్వపక్షం, విపక్షంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇజ్రాయెల్కు అండగా ఉండాలని పలువురు నాయకులు ఆయనను కోరుతున్నారు. -
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
Russia: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును తొలగించారు. -
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. -
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ హెచ్చరిక
అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ సుప్రీం నేత అల్ ఖమేని సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడబోదని పేర్కొన్నాడు. -
సంక్షిప్త వార్తలు (6)
ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో బ్రేకులు సరిగా పనిచేయక ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 53 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. -
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి