Zelensky: జెలెన్స్కీ, గ్రీక్ ప్రధాని కాన్వాయ్ లక్ష్యంగా క్షిపణి దాడి.. ?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, గ్రీకు ప్రధాని కిరియాకోస్ రష్యా క్షిపణి దాడి నుంచి కొద్దిలో తప్పించుకొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky), గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్ ప్రాణాంతక దాడి నుంచి తప్పించుకొన్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి వారి కాన్వాయ్కు కేవలం 500 మీటర్ల దూరంలో పడింది. ఈ ఘటన నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో చోటు చేసుకొంది. ఉక్రెయిన్ పర్యటనకు వచ్చిన కిరియాకోస్తో కలిసి జెలెన్స్కీ నగర సందర్శనకు బయల్దేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి పుట్టగొడుగు ఆకారంలో భారీగా పొగ పైకి ఎగసిపడటాన్ని ప్రత్యక్ష సాక్షులు వీక్షించారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు.
గత రెండేళ్లుగా జెలెన్స్కీ యుద్ధ క్షేత్రాల్లోని సైనికులను ఉత్సాహపర్చేందుకు పర్యటనలు చేస్తున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రపంచ నాయకులను కూడా తీసుకెళుతున్నారు. కానీ, బుధవారం నాటో సభ్యదేశమైన గ్రీక్ ప్రధాని ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం. ఇది ఏమాత్రం విజయవంతమైనా యుద్ధం ఊహకందనంత తీవ్రమయ్యేది.
ఈ ఘటనపై జెలెన్స్కీ మాట్లాడుతూ ‘‘నేను ఈ రోజు దాడిని చూశాను. మనం ఎలాంటి వారిని ఎదుర్కొంటున్నామో మీరు తెలుసుకోవచ్చు. ఆ దాడిలో కొందరు మరణించినట్లు తెలిసింది. మరింత సమాచారం రావాల్సి ఉంది. మేము ఆత్మరక్షణ చర్యలు చేపట్టడం అన్నిటికంటే అత్యంత కీలకం. అందుకు గగనతల రక్షణ వ్యవస్థ అవసరం’’ అని పేర్కొన్నారు. యుద్ధం కారణంగా నగరంలో జరిగిన నష్టాన్ని గ్రీకు ప్రధానికి చూపించారు.
మరోవైపు ఈ దాడిని రష్యా రక్షణశాఖ ధ్రువీకరించింది. తాము ఒడెస్సాలోని ఓ హ్యాంగర్ను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకొన్నట్లు వెల్లడించింది. అక్కడ ఉక్రెయిన్ దళాలు సముద్ర డ్రోన్లను సిద్ధం చేస్తున్నాయని తెలిపింది. ఈ దాడి విజయవంతమైందని పేర్కొంది. కానీ, ఈ ప్రకటనలో జెలెన్స్కీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
తాము అవసరమైతే అణుబాంబు తయారీకి వెనుకాడమని ఇరాన్ తేల్చిచెప్పింది. -
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
పేరుకే అక్కడ నిర్బంధ ఓటింగ్.. కానీ, ఓటర్లకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటుంది. అయినా కానీ, ఓటు వేసేందుకు ఎవరైనా మొరాయిస్తే కొరడా ఝుళిపిస్తుంది. ఆ విశేషాలేంటో చూద్దాం.. -
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
Canada: నిజ్జర్ హత్య కేసులో బ్రాంప్టన్ ప్రాంతంలో నివాసముంటున్న అమర్దీప్ సింగ్ను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. -
సౌమ్యా స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్యా స్వామినాథన్కు ప్రతిష్ఠాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. -
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
అఫ్గానిస్థాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బదాక్షాన్, బగ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బగ్లాన్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. -
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ -
విశ్రాంతి కరవైన చోదకుడు బస్సును నదిలోకి నడిపాడు
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. అదుపుతప్పిన బస్సు వాహనాలను ఢీకొంటూ వెళ్లి నేరుగా వంతెన పైనుంచి నదిలో పడిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. -
బాలుడి మృతదేహాన్ని వదిలేసిన విమాన సంస్థ
తల్లిదండ్రుల వెంట విమానంలో పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్థాన్కు వెళ్లాల్సిన ఆరేళ్ల బాలుడి మృత దేహాన్ని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది ఇస్లామాబాద్ విమానాశ్రయంలో వదిలేశారు. -
ట్రంప్నకు బైడెన్ చురక
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం విరాళాలు సేకరించే పనిలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు నిమగ్నమయ్యాయి. -
రాకెట్ లాంచింగ్ వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా
కిమ్జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా మరోసారి తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. బహుళ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ సన్నాహక పరీక్షను నిర్వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్
-
విజయవాడలో బస్సుల కొరత.. ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల మండిపాటు
-
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
-
మీకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి!
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి