Dubai: భారతీయులకు దుబాయ్ ఆఫర్.. ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ పర్యటక వీసా..!
భారత్తో బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రత్యేక వీసా విధానాన్ని దుబాయ్ (Dubai) అమల్లోకి తెచ్చింది.
ఇంటర్నెట్డెస్క్: భారతీయుల కోసం దుబాయ్ (Dubai) మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసాను ప్రవేశపెట్టింది. ఇటువంటి సౌకర్యాన్నే గల్ఫ్ దేశాలకు కూడా ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (డీఈటీ)ను ఉటంకిస్తూ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
గతేడాది దుబాయ్ను 2.46 మిలియన్ల మంది భారతీయులు సందర్శించారు. కొవిడ్-19 ముందునాటి పరిస్థితితో పోలిస్తే ఇది దాదాపు 25శాతం అధికం. గతేడాది భారత్ నుంచి 1.84 మిలియన్ల మంది పర్యటకులు ఆ దేశాన్ని సందర్శించారు. 2019లో ఈ సంఖ్య కేవలం 1.97 మిలియన్లు మాత్రమే.
భారత్-బ్రిటన్ సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్పై హూతీల దాడి..!
ఈ సరికొత్త విధానం ద్వారా భారతీయులు పర్యటక వీసా ద్వారా దుబాయ్(Dubai)కు ఐదేళ్ల వ్యవధిలో పలు మార్లు వెళ్లి రావచ్చు. ఒక సారి వెళితే 90 రోజులపాటు అక్కడ ఉండి రావచ్చు. ఒక ఏడాదిలో మొత్తం 180 రోజులకు మించకుండా ఉండాలి. ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్ను కేవలం రెండు నుంచి ఐదు పనిదినాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ వీసాకు అర్హులైన వారు కచ్చితంగా కీలకమైన అంశాలను పాటించాలి. గత ఆరునెలల్లో బ్యాంక్ ఖాతాలో 4,000 డాలర్ల లేదా అంతకు సమానమైన విదేమారకద్రవ్యం ఉండాలి. యూఏఈలో చెల్లుబాటయ్యేలా ఆరోగ్య బీమా తప్పనిసరి. ‘‘దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ వీసా ఎంట్రీని ప్రవేశపెట్టింది. సుస్థిర ఆర్థిక సహకారం కొనసాగేందుకు, వాణిజ్య, పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు దీనిని అమలు చేస్తున్నారు’’ అని డీఈటీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!