Harry Potter Train : భద్రతా ప్రమాణాలపై అధికారుల సంతృప్తి.. మళ్లీ పట్టాలెక్కిన హ్యారీ పోటర్ రైలు!
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే హ్యారీ పోటర్ (Harry Potter) రైలు మళ్లీ పట్టాలెక్కింది. నవంబరు 30 వరకు ఈ రైల్వే సర్వీసులు (Railway services) కొనసాగనున్నాయి.
Image : westcoastrailways.co.uk
ఇంటర్నెట్ డెస్క్ : హ్యారీ పోటర్ (Harry Potter) రైలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘హోగ్వార్ట్ ఎక్స్ప్రెస్’ (జాకోబైట్) తిరిగి పట్టాలెక్కింది. స్కాట్లాండ్లోని (Scotland) ఎత్తయిన పర్వతాలపై ఈ రైలు ప్రయాణం సాగుతుంది. మల్లాయిగ్ నుంచి ఫోర్ట్ విలియం వరకు రాకపోకలు సాగించే ఈ రైలు ప్రయాణం గ్లిన్ఫిన్నన్ వంతెనపై చూడముచ్చటగా కనిపిస్తుంది. దాంతో ఎక్కువ మంది పర్యాటకులు ఈ రైలులో ప్రయాణించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. సరైన భద్రతా నియమాలు పాటించడం లేదనే కారణంతో ఈ రైల్వే సేవలను ‘ద ఆఫీస్ ఆఫ్ రైల్ అండ్ రోడ్’ అధికారులు (ఓఆర్ఆర్) కొన్ని రోజుల క్రితం నిలిపివేశారు. తాజాగా లోపాలను సవరించడం పట్ల ఓఆర్ఆర్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే సేవలను ఈ నెల 8 నుంచి నవంబరు 30 వరకు కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేశారు.
మాస్కోలోని కర్మాగారంలో భారీ పేలుడు.. 25 మందికి గాయాలు
వెస్ట్కోస్ట్ రైల్వే నిర్వహిస్తున్న హ్యారీ పోటర్ రైలులో కొన్ని వారాల క్రితం అధికారులు భద్రతా తనిఖీలు చేశారు. సెకండరీ డోర్ లాక్ల చుట్టూ సమస్యలున్నట్లు వెల్లడైంది. దాంతో ప్రయాణికులు పడిపోయే ప్రమాదముందని నిర్ధారణకు వచ్చారు. కిటీకీల నుంచి బయటకు వాలుతున్న సమయంలో బయటి వస్తువులు తగిలే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆ రైల్వే సేవలను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో వెస్ట్ కోస్ట్ రైల్వే కంపెనీ లిమిటెడ్ అవసరమైన మార్పులు చేసింది. వాటిని పరిశీలించిన ఓఆర్ఆర్ అధికారులు జాకోబైట్ సేవలు కొనసాగించడానికి పచ్చజెండా ఊపారు. సెంట్రల్ డోర్ లాకింగ్ లేకుండా హింగ్డ్ డోర్ క్యారేజీలు అమర్చిన రైళ్లకు తప్పనిసరిగా కొత్త నిబంధనలు వర్తిస్తాయని సందర్భంగా ఓఆర్ఆర్ స్పష్టం చేసింది. ముందస్తు బుకింగ్లు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హ్యారీ పోటర్ రైలు సర్వీసును పొడిగిస్తున్నామని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
-
అందుకే ‘జనతా గ్యారెజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
-
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. వైకాపా నేతల దుశ్చర్య
-
యశోదాలో ఉద్యోగుల వేతనాల పేరిట రూ.3.26 కోట్లు స్వాహా
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు