ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచండి
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తమ ప్రధాన ఆయుధ కర్మాగారాలను సందర్శించారు. అధునాతన క్షిపణులతో పాటు ఇతర యుద్ధ ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు.
అధికారులకు కిమ్ ఆదేశం
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తమ ప్రధాన ఆయుధ కర్మాగారాలను సందర్శించారు. అధునాతన క్షిపణులతో పాటు ఇతర యుద్ధ ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా సోమవారం తెలిపింది. యుద్ధానికి సిద్ధం కావాలంటూ ఇటీవల అధికారులకు పిలుపునిచ్చిన కిమ్ ఇప్పుడు ఆయుధాల తయారీకి సంబంధించి కీలక ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా దక్షిణ కొరియా-అమెరికా దళాలు సంయుక్త సైనిక విన్యాసాలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో కిమ్ ఆయుధ కర్మాగారాల సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆయుధాల విక్రయ నిమిత్తం కిమ్ తాజా ఆదేశాలు జారీ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!