కెనడాకు రాకపోకల్లో జాగ్రత్త సుమా
కెనడాలో ఉంటున్న ప్రవాస భారతీయులు, ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్లబోతున్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.
అక్కడ కొన్నిచోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి
ప్రజలు, ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
భారత్కు సంఘీభావంగా పలు దేశాలు
దిల్లీలో సదస్సుకు కెనడా హాజరవుతుందన్న సైన్యాధికారి
దిల్లీ: కెనడాలో ఉంటున్న ప్రవాస భారతీయులు, ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్లబోతున్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కెనడాలో కొన్నిచోట్ల భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా జాగ్రత్త వహించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. నిషిద్ధ ‘ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్’ (కేటీఎఫ్) నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో మూడు నెలల క్రితం హత్యకు గురికావడం వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో చేసిన వ్యాఖ్య పెను దుమారం రేకెత్తించిన విషయం తెలిసిందే. ‘రాజకీయ ప్రేరేపిత విద్వేష నేరాలు కెనడాలో పెరుగుతున్నాయి. భారత వ్యతిరేక ఎజెండాతో పనిచేస్తున్నవారిని వ్యతిరేకిస్తున్న మన దౌత్యవేత్తలు, ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ఘర్షణలు, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలవైపు వెళ్లవద్దు. అలాంటి పరిస్థితికి ఆస్కారం ఉన్నచోట్లకు ప్రయాణాలు మానుకోవాలి. కెనడాలోని భారతీయుల భద్రత, క్షేమం కోసం కెనడా దౌత్యవర్గాలతో మన హైకమిషన్, కాన్సులేట్లు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కెనడాలోని భారత పౌరులు ఒట్టావాలోని హైకమిషన్.. లేదా టొరంటో, వాంకోవర్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద తమ పేర్లను వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు నేరుగా, వేగంగా సంప్రదించేందుకు తద్వారా వీలవుతుంది’’ అని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. కెనడాతో దౌత్యపరమైన సంబంధాలు, భారతీయుల పరిస్థితిపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ప్రధాని మోదీకి నివేదించారు.
సైనిక సహకారంపై ప్రభావం పడదు
వివాదం ప్రభావం ద్వైపాక్షిక సైనిక సహకారంపై పడబోదని సైనిక దళాల ప్రధాన కార్యాలయంలో వ్యూహాత్మక ప్రణాళిక అదనపు డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అభినయ రాయ్ స్పష్టంచేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో దిల్లీలో జరగబోయే భారత్-పసిఫిక్ సైనిక అధిపతుల సమావేశం (ఐపీఏసీసీ)లో కెనడా పాల్గొంటుందని చెప్పారు. సరిహద్దులో ప్రతిష్టంభన ఉన్నా చైనాతో సైనిక, దౌత్యస్థాయిలో సంబంధాలు ఉన్నట్లుగానే కెనడాతోనూ ఉంటాయన్నారు. ఇదే విషయాన్ని కెనడా సైనిక అధికారి ఒకరు కూడా తేల్చిచెప్పారు. 22 దేశాల ప్రతినిధులు దీనిలో పాలుపంచుకుంటారు. శాంతి, సుసంపన్నత, సుస్థిరతల పరిరక్షణే ధ్యేయంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం ఆ సమావేశం ఉద్దేశం.
ఖండించడానికి అమెరికా విముఖత
నిజ్జర్ హత్యను బహిరంగంగా ఖండించాలని అమెరికా సహా ‘ఫైవ్ఐస్ గ్రూపు’లోని కొన్ని మిత్రదేశాలను కెనడా ఇటీవల కోరినా వాటినుంచి స్పందన కరవైనట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ వెల్లడించింది. జీ20 సదస్సుకు కొద్ది వారాల ముందు ఈ కూటమి నిఘా విభాగ అధికారులతో కెనడా రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలిపింది. కూటమిలో సభ్యదేశాలుగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, కెనడా ఉన్నాయి. హత్య విషయాన్ని బహిరంగంగా లేవనెత్తేందుకు ఈ దేశాలు నిరాకరించాయి. ఈ నేపథ్యంలోనే జీ20 సదస్సులో భారత్ సహా మిత్రదేశాల అధినేతలతో కెనడా అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
భారత్తో వ్యవహారం.. నిప్పుతో చెలగాటమే
ట్రూడో ఆరోపణలను అమెరికా విదేశాంగశాఖ నిపుణులు ఖండించారు. అవి అత్యంత తీవ్రమైనవని పేర్కొన్నారు. ‘‘ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంతమంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారు. ఖలిస్థానీ నేత హత్యలోకి భారత్ను లాగుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. రాజకీయంగా ట్రూడోకు దీర్ఘకాలంలో ఇది లాభం కలిగిస్తుందేమో గానీ.. నాయకత్వ లక్షణం మాత్రం కాదు. ఈ వ్యవహారంలో అమెరికా నేతలు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నాం. ఎందుకంటే నిప్పుతో కెనడా చెలగాటమాడుతోంది’’ అని అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ మండిపడ్డారు. కెనడా చర్య ‘సిగ్గుచేటు’ అని దుయ్యబట్టారు. అమెరికాలోని అత్యధిక సిక్కుల వాణికి ఖలిస్థాన్ ఉద్యమం ప్రాతినిధ్యం వహించడం లేదని ‘సిక్స్ ఫర్ అమెరికా’ వ్యవస్థాపకుడు జెస్సీ సింగ్ చెప్పారు. భారత్లోని సిక్కులు ఖలిస్థాన్కు అనుకూలం కాదన్నారు. భారత్పై ఆరోపణలు ఆందోళనకరమని ఆస్ట్రేలియా పేర్కొంది. ‘భాగస్వామ్య పక్షాలతో కలిసి తాజా పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంతకంటే మేం మాట్లాడలేం’ అని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ఐరాసలో విలేకరులతో అన్నారు.
ఆందోళన వెలిబుచ్చిన బ్రిటన్ సిక్కు ఎంపీలు
‘కెనడా వ్యాఖ్యలు ఆందోళనకరం. దీనిపై యూకే ప్రభుత్వంతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. న్యాయం జరగాలి’ అని బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. దోషులెవరనేది కెనడా దర్యాప్తులో తేలుతుందని, తాము తమ ఆందోళనలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్తున్నామని మరికొందరు ఎంపీలు తెలిపారు. పంజాబీ కెనడా గాయకుడు శుభ్నీత్ సింగ్ భారత్లో జరపాల్సిన పర్యటన రద్దు అయినట్లు ‘బుక్మైషో’ బుధవారం ప్రకటించింది. టికెట్లు కొన్నవారికి పూర్తిడబ్బు వాపసు ఇస్తామని తెలిపింది. ఖలిస్థానీ సానుభూతిపరుడైన సింగ్ పర్యటనను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పిలుపు నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది. -
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
నేపాల్కు చెందిన షెర్పా కమీ రీటా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని 29 సార్లు విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించాడు. -
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
ప్రపంచంలోనే తొలిసారిగా పంది కిడ్నీని మార్పిడి చేయించుకున్న అమెరికాకు చెందిన రిచర్డ్ స్లేమాన్(62) శనివారం మరణించినట్లుగా అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
అర్జెంటీనాలో తప్పనిసరి ఓటింగ్ అమల్లోకి వచ్చి 112 ఏళ్లు దాటింది. ప్రస్తుతం అక్కడ పాలకుల కారణంగా ఈ వ్యవస్థ కొంత మసక బారింది. -
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
తాము అవసరమైతే అణుబాంబు తయారీకి వెనుకాడమని ఇరాన్ తేల్చిచెప్పింది. -
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
పేరుకే అక్కడ నిర్బంధ ఓటింగ్.. కానీ, ఓటర్లకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటుంది. అయినా కానీ, ఓటు వేసేందుకు ఎవరైనా మొరాయిస్తే కొరడా ఝుళిపిస్తుంది. ఆ విశేషాలేంటో చూద్దాం.. -
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
Canada: నిజ్జర్ హత్య కేసులో బ్రాంప్టన్ ప్రాంతంలో నివాసముంటున్న అమర్దీప్ సింగ్ను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. -
సౌమ్యా స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్యా స్వామినాథన్కు ప్రతిష్ఠాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. -
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
అఫ్గానిస్థాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బదాక్షాన్, బగ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బగ్లాన్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. -
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ -
విశ్రాంతి కరవైన చోదకుడు బస్సును నదిలోకి నడిపాడు
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. అదుపుతప్పిన బస్సు వాహనాలను ఢీకొంటూ వెళ్లి నేరుగా వంతెన పైనుంచి నదిలో పడిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. -
బాలుడి మృతదేహాన్ని వదిలేసిన విమాన సంస్థ
తల్లిదండ్రుల వెంట విమానంలో పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్థాన్కు వెళ్లాల్సిన ఆరేళ్ల బాలుడి మృత దేహాన్ని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది ఇస్లామాబాద్ విమానాశ్రయంలో వదిలేశారు. -
ట్రంప్నకు బైడెన్ చురక
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం విరాళాలు సేకరించే పనిలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు నిమగ్నమయ్యాయి. -
రాకెట్ లాంచింగ్ వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా
కిమ్జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా మరోసారి తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. బహుళ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ సన్నాహక పరీక్షను నిర్వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు