మూడేళ్లు మీకు.. రెండేళ్లు మాకు!
పాకిస్థాన్లో సైన్యం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.
పాక్ ప్రధాని పదవిపై పీఎంఎల్-ఎన్, పీపీపీ చర్చలు
తెరపైకి బిలావల్ భుట్టో పేరు
లాహోర్: పాకిస్థాన్లో సైన్యం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఆదివారం షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)లు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ చర్చల్లో అధికార పంపకంపై కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చాయని సమాచారం. తమ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి కావాలని పీపీపీ గట్టిగా పట్టుబడినట్లు సమాచారం. ప్రధాని పదవిని మూడేళ్లు పీఎంఎల్-ఎన్, రెండేళ్లు పీపీపీ పంచుకోవాలన్న ప్రతిపాదనపైనా కసరత్తు జరుగుతోందని బిలావల్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని పగ్గాలను ఏ పార్టీ ముందు స్వీకరించాలన్న విషయంపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. పీఎంఎల్-ఎన్ తరఫున నవాజ్ షరీఫే ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్కు 75 స్థానాలు దక్కాయి.
ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. పీఎంఎల్-ఎన్ అధికారంలోకి రావాలంటే 54 సీట్లలో విజయం సాధించిన పీపీపీ మద్దతు తప్పనిసరి. పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు కలిస్తే మొత్తం 129 సీట్లు అవుతాయి. ఆరుగురు స్వతంత్రులు కూడా ఆదివారం పార్టీలో చేరినట్లు పీఎంఎల్-ఎన్ ప్రకటించింది. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. మరోవైపు పీఎంఎల్-ఎన్, పీపీపీ ఏర్పరిచే సంకీర్ణ ప్రభుత్వంలో తాము చేరే ప్రసక్తే లేదని ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) స్పష్టం చేసింది. వారితో కూటమి కట్టే కంటే.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడతామని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో