పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది.
అనుకూలంగా ఐరాసలో 143 దేశాల తీర్మానం
వ్యతిరేకించిన అమెరికా, ఇజ్రాయెల్
ఐక్యరాజ్యసమితి: పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుకూలంగా 143 దేశాలు ఓటేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ సహా 9 దేశాలు వ్యతిరేకించాయి. 25 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించదు. సభ్యత్వానికి అర్హత సాధించినట్లు గుర్తింపు మాత్రమే లభిస్తుంది. ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పంపుతుంది. అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమకు పూర్తిస్థాయి సభ్యత్వం కావాలంటూ ఏప్రిల్లో కూడా ఐరాస భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది. అయితే ఈ తీర్మానానికి 12 సభ్యదేశాలు ఆమోదం తెలిపినా.. అమెరికా వీటో చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధం ఆపేది 6 వారాలే
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందం అసంపూర్తిగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆరు వారాలే యుద్ధం ఆపుతామని, శాశ్వతంగా ఆపే ప్రసక్తే లేదని తెలిపారు. -
పోర్చుగల్లో గాల్లో ఢీకొన్న విమానాలు
దక్షిణ పోర్చుగల్లో నిర్వహించిన ఎయిర్షోలో ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాలు ప్రదర్శిస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్ మృతిచెందగా.. -
సయోధ్య ఒప్పందం రద్దుకు దక్షిణ కొరియా నిర్ణయం
ఉత్తర కొరియా తమ భూభాగంపైకి బెలూన్ల ద్వారా చెత్తాచెదారం విరజిమ్ముతున్నందుకు ప్రతిగా 2018నాటి సయోధ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు (సస్పెండ్) చేయాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. -
ఇరాన్ అధ్యక్ష రేసులో పార్లమెంటు స్పీకర్
ఇరాన్ అధ్యక్ష రేసులో ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ నిలిచారు. సోమవారం ఆయన తన అభ్యర్థిత్వాన్ని నమోదు చేసుకున్నారు. -
మూడు కేసుల్లో నిర్దోషిగా ఇమ్రాన్
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాక్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (71) మూడు ముఖ్యమైన కేసుల్లో నిర్దోషి అని సోమవారం కోర్టులు తీర్పు ఇచ్చాయి. -
మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షేన్బామ్
మెక్సికో నూతన అధ్యక్షురాలిగా అధికార మోరెనా పార్టీకి చెందిన క్లాడియా షేన్బామ్ భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. 200 ఏళ్ల ఆ దేశ చరిత్రలో ఓ మహిళ అధ్యక్షురాలు కావడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
-
ఉత్కంఠ మలుపుల్లో హిమాచల్ రాజకీయం
-
టెట్ మార్కుల కేటాయింపు ఎలా?
-
నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టిస్తారా?
-
ఏపీ చూపు.. ఉమ్మడి పశ్చిమగోదావరి వైపు.. ఇక్కడ అత్యధిక స్థానాలొచ్చిన పార్టీకే పట్టం
-
లెక్కింపు బాధ్యతల నుంచి ఉపాధ్యాయుల్ని తప్పించేశారు.. ఆఖరి నిమిషంలో కీలక నిర్ణయం