Israel: అల్-షిఫా కింద బయటపడ్డ సొరంగం..: ప్రకటించిన ఇజ్రాయెల్
అల్-షిఫా ఆస్పత్రిపై ఆపరేషన్లో ఇజ్రాయెల్ కొంత పురోగతి సాధించింది. ఆస్పత్రి ప్రాంగణంలో ఓ సొరంగాన్ని కనుగొంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడుతూ కొన్ని రోజులు హమాస్ బందీలను ఈ ఆస్పత్రిలోనే ఉంచిందని పేర్కొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్-షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దీనికి సబంధించిన ఫొటోలు, వీడియోలను శుక్రవారం విడుదల చేసింది. ‘‘ఆస్పత్రిలోని హమాస్ సొరంగం నెట్వర్క్ను గుర్తించాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆ దేశ ప్రత్యేక దళాలు బుధవారం తెల్లవారుజామున తొలిసారి అల్-షిఫా ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టాయి. ఆ తర్వాత ఎమ్మారై గదిలో భారీగా ఆయుధాలను గుర్తించాయి. అనంతరం నేడు సొరంగాన్ని కనుగొన్నారు. ఈ సొరంగం మూతను హమాస్ దళాలు కాంక్రీట్తో సీల్ చేసినట్లు ఉంది. దీనిలోకి వెళ్తున్న పైపులు, కేబుల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు అక్కడ ఆయుధాలు దాచిన ప్రాంతంలో పేలుడు పదార్థాలతో ఓ ఉచ్చును అమర్చిన కారును అడ్డంపెట్టినట్లు తాము గుర్తించామన్నారు. ఇక తమ ఇంజినీర్లు టన్నెల్ నెట్వర్క్ను బయటపెట్టడానికి తీవ్రంగా యత్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
బందీలను అల్-షిఫాలో ఉంచినట్లు ఆధారాలున్నాయి
ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసిన బందీలను అల్-షిఫా ఆస్పత్రిలో ఉంచినట్లు తమ వద్ద బలమైన సంకేతాలున్నాయని ఆ దేశా ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తమ సైన్యం దానిపై ఆపరేషన్ మొదలుపెట్టడంతో ప్రస్తుతానికి వారిని అక్కడి నుంచి వేరే స్థావరానికి తరలించారని పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందటి వరకూ హమాస్ అక్కడ కార్యకలాపాలను నిర్వహించిందన్నారు. ఆ వైద్యశాలలోకి తమ దళాలు అడుగుపెట్టడానికి అదే ప్రధాన కారణమని తెలిపారు. బందీలకు సంబంధించి తమ ప్రభుత్వం వద్ద కీలకమైన ఇంటెలిజెన్స్ ఉందని.. ఆ వివరాలను తాము బహిర్గతం చేయలేమని పేర్కొన్నారు. తమ బలగాలు ఆస్పత్రిలో కచ్చితమైన లక్ష్యాలపైనే దాడులు చేస్తున్నాయని అన్నారు.
హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందంపై నెతన్యాహు స్పందిస్తూ గ్రౌండ్ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోందని.. హమాస్ కాల్పుల విరమణ ప్రకటించేలా ఒత్తిడి పెంచుతున్నామని వెల్లడించారు. హమాస్ మొత్తం బందీలను విడుదల చేస్తేగానీ.. తాము పాలస్తీనా బందీలను విడుదల చేస్తామన్న ప్రచారంపై మాత్రం నెతన్యాహు ఏమీ మాట్లాడలేదు. కేవలం ‘రహస్యం’ అని మాత్రమే చెప్పారు. పాలస్తీనాలో నాయకత్వ మార్పు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘పాలస్తీనీయులు వారిని వారు పాలించుకొనే అధికారం ఉంది. కానీ, ఇజ్రాయెలీలను భయపెట్టే అధికారం మాత్రం లేదు. అంటే గాజాను నిస్సైనికీకరణ చేయడంతోపాటు.. డీర్యాడికలైజ్ చేస్తాం’’ అని నెతన్యాహు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
Russia: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును తొలగించారు. -
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. -
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ హెచ్చరిక
అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ సుప్రీం నేత అల్ ఖమేని సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడబోదని పేర్కొన్నాడు. -
సంక్షిప్త వార్తలు (6)
ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో బ్రేకులు సరిగా పనిచేయక ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 53 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. -
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్