Ebrahim Raisi: బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బెల్ 212గా గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) దుర్మరణం చెందారు. స్థానిక న్యూస్ ఏజెన్సీలు విడుదల చేసిన ఫొటోలు, వీడియోల ప్రకారం ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ను బెల్-212గా (Bell 212) గుర్తించారు. దీన్ని అమెరికాకు చెందిన బెల్ టెక్స్ట్రాన్ కంపెనీ తయారు చేసింది. ఇది టెక్సాస్లోని ఫోర్ట్వర్త్ కేంద్రంగా పనిచేస్తోంది.
ప్రమాదానికి గురైన తాజా హెలికాప్టర్లో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్ సహా ఎంత మంది ఉన్నారనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. బెల్-212లో (Bell 212) సిబ్బంది సహా గరిష్ఠంగా 15 మంది ప్రయాణించగలరు. రెండు బ్లేడ్లతో ఉండే ఈ మధ్యశ్రేణి హెలికాప్టర్ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాలకు వినియోగించుకునేలా రూపొందించారు. దీన్ని బెల్ 205కు కొనసాగింపుగా 1960లో ప్రవేశపెట్టారు. కంపెనీ తయారు చేసే కీలక మోడళ్లలో ఇదొకటి. పరిశ్రమలో అత్యంత సమర్థమైనదిగా.. ‘వర్క్హార్స్’గా దీన్ని పేర్కొంటుంటారు.
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
గతంలోనూ ప్రమాదాలు..
ఈ హెలికాప్టర్ గతంలోనూ ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. 1997లో పెట్రోలియం హెలికాప్టర్స్కు చెందిన బెల్-212.. లూసియానా తీరంలో కుప్పకూలింది. దీంట్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. సాధారణ ఆఫ్షోర్ రవాణా కార్యకలాపాలు చేపడుతుండగా.. మెకానికల్ సమస్య తలెత్తి ప్రమాదం జరిగింది. 2009లో కెనడాలోని న్యూఫౌండ్లాండ్లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఇంజిన్లో ఆయిల్ ప్రెజర్ కోల్పోయిన కారణంగా దుర్ఘటన సంభవించినట్లు తేల్చారు. కెనడా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదంగా ఇది నిలిచింది.
ఆధునిక హెలికాప్టర్లలో అనేక భద్రతా పీచర్లు వస్తున్నాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రయాణికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ మెకానికల్ లోపాలు, ప్రతికూల వాతావరణం, మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి శత్రువుల దాడిలోనూ కుప్పకూలుతుంటాయి. ఇలా హెలికాప్టర్ ప్రమాదాలకు చాలా కారణాలే ఉంటాయి.
ఇరాన్ పేలవ వాయు రవాణా భద్రత చరిత్ర..
తాజా హెలికాప్టర్ ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. ఇరాన్ వాయు రవాణా భద్రత చరిత్ర మాత్రం చాలా పేలవంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి అమెరికా ఆంక్షలు కొంత వరకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రైసీ ప్రయాణించిన తాజా హెలికాప్టర్ను 1979లో కొనుగోలు చేసినట్లు సమాచారం. తర్వాత వారికి అమెరికా విక్రయాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్ రక్షణ, రవాణా శాఖ మంత్రులు సహా పలువురు కమాండర్లు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ఘటనలు ఉన్నాయి.
అణు కార్యక్రమాలను పరిమితం చేసుకోవడం ద్వారా పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలకు ఇరాన్ కృషి చేసింది. తద్వారా తమ విమాన, హెలికాప్టర్లను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రచించింది. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అవి తలకిందులయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు. -
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆవాసాలను ఖాళీ చేయాల్సి వస్తోంది. -
ప్రచారం కోసం డబ్బు వెదజల్లుతున్న రిపబ్లికన్లు
ట్రంప్ ప్రచారం కోసం డబ్బును రిపబ్లికన్లు వెదజల్లుతున్నారు. గత సోమవారం నుంచి ఆగస్టు దాకా టీవీ, రేడియోల్లో ప్రచారం కోసం ఆ పార్టీవారు 68 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు