Israel: ‘గాజా పౌరుల ఆకలి కేకలు.. ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహంలో భాగమే!’
గాజాలోని పౌరులను ఆకలి కేకలకు గురిచేయడాన్ని ఇజ్రాయెల్ ఓ యుద్ధతంత్రంగా అమలు చేస్తోందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ ఆరోపించింది.
జెరూసలెం: గాజా (Gaza)లోని పౌరులను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆకలి కేకలకు గురిచేస్తోందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్ (Human Rights Watch)’ సంస్థ ఆరోపించింది. ఇదంతా ఇజ్రాయెల్ యుద్ధతంత్రంలో భాగమేనని పేర్కొంది. ‘‘గాజాలోని పౌరులను ఆకలితో మాడ్చి చంపడాన్ని (Starvation) ఇజ్రాయెల్ (Israel) ఓ యుద్ధ తంత్రంగా అమలు చేస్తోంది. ఇది యుద్ధ నేరం’’ అని న్యూయార్క్కు చెందిన ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. అయితే.. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. తమ దేశంలో చోటుచేసుకున్న అక్టోబరు 7నాటి మారణకాండను ఈ సంస్థ ఖండించలేదని గుర్తుచేసింది.
‘‘గాజాకు ఆహారం, నీళ్లు, ఇంధన సరఫరాలను ఇజ్రాయెల్ సైన్యం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోంది. మానవతా సాయాన్ని నిరోధిస్తోంది. వ్యవసాయ క్షేత్రాలనూ నాశనం చేస్తోంది. పౌరులకు వారి మనుగడకు అవసరమైన సామగ్రిని అందకుండా చేస్తోంది’’ అని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. అయితే.. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. హెచ్ఆర్డబ్ల్యూను యూదు, ఇజ్రాయెల్ వ్యతిరేక సంస్థగా పేర్కొంది. ఇజ్రాయెల్ వాసుల హక్కుల ఉల్లంఘనపై కళ్లు మూసుకున్న ఈ సంస్థకు.. గాజాలో ప్రస్తుతం జరుగుతోన్న దానిపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఇజ్రాయెల్ విదేశాంగ ప్రతినిధి లియర్ హయాత్ ఓ వార్తాసంస్థకు చెప్పారు.
హమాస్ అతిపెద్ద సొరంగం ఇలా.. వీడియో విడుదల..!
అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడుల నేపథ్యంలో.. అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాజాను దిగ్బంధం చేయడంతో.. స్థానికంగా ఆహారం, నీళ్లు, ఇంధనం, ఔషధాల కొరత నెలకొంది. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఈజిప్టు- గాజా సరిహద్దులోని రఫా కేంద్రం గుండా పాలస్తీనీయన్లకు కొంత మానవతా సాయానికి ఇజ్రాయెల్ అనుమతించింది. ఇటీవల తన ‘కెరెమ్ షాలోమ్ క్రాసింగ్’ ద్వారా కూడా గాజాకు అత్యవసర సాయం చేరవేయడానికి అంగీకరించింది. దీంతో ఈ క్రాసింగ్ గుండా ఆదివారం కొన్ని ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాయని రెడ్ క్రీసెంట్ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
-
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
-
అందుకే ‘జనతా గ్యారెజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
-
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. వైకాపా నేతల దుశ్చర్య
-
యశోదాలో ఉద్యోగుల వేతనాల పేరిట రూ.3.26 కోట్లు స్వాహా
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ