Japan PM: అణు జలాల భయం వేళ.. చేపను తిన్న జపాన్ ప్రధాని
Japan PM Fumio Kishida: పసిఫిక్ మహా సముద్రంలోకి అణు వ్యర్థ జలాల విడుదలపై భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. జపాన్ ప్రధాని కిషిదా ఫుకుషిమా చేపలను ఆరగించారు.
టోక్యో: జపాన్ (Japan)లో 2011లో సంభవించిన సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం (Fukushima Nuclear Plant)లో పేరుకుపోయిన రేడియో ధార్మిక వ్యర్థ జలాలను (radioactive water) పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అణు వ్యర్థ జలాలు సముద్రంలో కలవడం వల్ల కాలుష్యం పెరగడమే గాక.. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లితుందని చైనా, దక్షిణ కొరియా తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ భయాలను పోగొట్టేందుకు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా (Fumio Kishida) చేసిన పని ఆసక్తికరంగా మారింది. అణు వ్యర్థ జలాలను విడుదల చేసిన ఫుకుషిమా తీరంలో పట్టిన చేపను తిన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను జపాన్ ప్రధాని కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అందులో కిషిదాతో పాటు మరో ముగ్గురు అధికారులు ఫుకుషిమా చేపలను ఆరగిస్తూ కన్పించారు. ‘‘ఇది చాలా బాగుంది. జపనీస్ సముద్ర ఆహారం రుచికరమైనది, సురక్షితమైనది’’ అని ప్రధాని ఆ వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
శరణార్థుల భవనంలో అగ్నిప్రమాద ఘటన.. ఆ గేటు వెనుక అన్నీ కాలిన శవాలే..!
2011లో ఫుకుషిమా (Fukushima) అణు కేంద్రం సునామీ కారణంగా దెబ్బతిన్న నాటి నుంచి ఈ నీటిని భారీ ట్యాంకుల్లో నిల్వ చేశారు. కానీ, ఇప్పుడు నిల్వకు చోటు సరిపోని పరిస్థితికి చేరుకొంది. ఇక్కడ మొత్తం 1.34 మిలియన్ టన్నుల అణు జలాలు ఉన్నాయి. వీటిల్లో ముందుగా 200 నుంచి 210 క్యూబిక్ మీటర్ల నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి వదిలేసింది. ఏదైనా అసాధారణ ఫలితాలు కనిపిస్తే తక్షణమే నీటి విడుదలను నిలిపివేసి దర్యాప్తు చేపడతామని ఇటీవల టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) వెల్లడించింది.
500 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్కు సమానమైన ఈ నీటిని పూర్తిగా విడుదల చేయాలంటే కొన్ని దశాబ్దాలు పట్టనుంది. వీటిని వివిధ దశల్లో శుద్ధి చేసి రానున్న 30 ఏళ్లలో పూర్తిగా సముద్రంలో కలిపేందుకు జపాన్ చర్యలు చేపట్టింది. అయితే, ఈ అణుజలాల్లో ట్రీటియం, కార్బన్-14 మూలకాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అణుజలాల కారణంగా మత్స్యసంపద నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జపాన్ సముద్ర ఆహారంపై ఆందోళనలను పోగొట్టేందుకు ప్రధాని ఇలా ఫుకుషిమా చేపలను తిన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.