Joe Biden vs Xi Jinping: బైడెన్ వర్సెస్ జిన్పింగ్: ఫోన్లోనే అగ్ర దేశాధినేతల వాగ్వాదం
అమెరికా-చైనా అధ్యక్షులు నేరుగా ఫోన్లోనే హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాధినేతలు బైడెన్, జిన్పింగ్ ఫోన్లోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కాల్ ఇరు దేశాల మధ్య సంబంధాల్లో టెన్షన్ను మరింత పెంచింది. మరికొన్ని రోజుల్లో అమెరికాకు చెందిన ఇద్దరు మంత్రులు చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
దాదాపు ఐదు నెలల తర్వాత మంగళవారం అమెరికా, చైనా అధ్యక్షులు తొలిసారి నేరుగా ఫోన్కాల్లో మాట్లాడుకొన్నారు. ఒక దశలో పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. ఈవిషయాన్ని అమెరికా, చైనా పత్రికలు వెల్లడించాయి. తమ దేశానికి అత్యాధునిక టెక్నాలజీ ఉత్పత్తుల విక్రయంపై బైడెన్ సర్కార్ విధించిన బ్యాన్ ఆర్థిక ముప్పును పెంచుతోందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆరోపించారు. ‘‘మా హైటెక్ అభివృద్ధిని అణచివేయాలని, బీజింగ్కు ఉన్న ఎదిగే హక్కును కాలరాయాలని ప్రయత్నిస్తే మేము చూస్తూ ఊరుకోం’’ అని ఆయన నేరుగా బైడెన్ను హెచ్చరించారు. అంతేకాదు.. తైవాన్ విషయంలో అమెరికా లక్ష్మణ రేఖను దాటకూడదని తేల్చిచెప్పారు.
మా భద్రత విషయంలో రాజీలేదు: బైడెన్
జిన్పింగ్ ఆరోపణలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా దీటుగా స్పందించారు. ‘అత్యాధునిక టెక్నాలజీని మా దేశ భద్రతకే ముప్పులా మార్చే చర్యలను అడ్డుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటాం. దీనిని ఆపేది లేదు. అనవసరంగా వాణిజ్యం, పెట్టుబడులను పరిమితం చేయకుండా చర్యలు తీసుకొంటాం’’ అని జిన్పింగ్కు తేల్చి చెప్పారు. ఇక టిక్టాక్పై చర్యల విషయంలో తగ్గేది లేదన్నారు. అమెరికన్ల డేటా భద్రతే తమకు ముఖ్యమన్నారు. మే 20వ తేదీన తైవాన్ అధ్యక్ష ప్రమాణస్వీకారం ఉండటంతో.. శాంతి, సుస్థిరతలను కాపాడాలని ఆయన జిన్పింగ్ను కోరినట్లు శ్వేతసౌధం ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు.
భారీ భూకంపం.. ఊగిపోయిన ఫ్లైఓవర్
అమెరికా ట్రెజరీ సెక్రెటరీ జానెట్ ఎల్లన్ నేడు చైనాలోని గ్వాంగ్జూకు వెళ్లనున్నారు. మరికొన్ని వారాల్లో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా బీజింగ్లో పర్యటించనున్నారు. మరోవైపు వచ్చే వారం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా అమెరికాను సందర్శించనున్నారు. ఆ సమయంలో ఫిలిప్పిన్స్ అధ్యక్షుడితో కలిసి బైడెన్తో త్రైపాక్షిక చర్చలు జరపనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
Columbia University: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా విద్యార్థులు చేస్తున్న నిరసనలను పోలీసులు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు. తాజాగా కొలంబియా వర్సిటీలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
-
పలు స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర